అక్క చెళ్లెమ్మలపై ఇన్ని ఘోరాలు.. జగనన్నా ‘దిశ’ ఏందన్నా!

Publish Date:Apr 28, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనతో రాష్ట్రంలో అక్క చెళ్లెమ్మలకు భద్రత కరవైంది.  రోజుకోచోట అక్క చెళ్లెమ్మలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా.. ముఖ్యమంత్రి మాత్రం వాటిపై నోరు మెదపడం లేదు. నిందితులపై చర్యలకు ఆదేశించడం లేదు. 

రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటూ ఘనంగా ప్రకటించి.. ఆడబిడ్డపై అఘాయిత్యం జరిగితే నిందితులపై కఠిన చర్యలకు ఏకంగా దిశ చట్టాన్నే తీసుకువచ్చామని చెప్పిన జగన్ ఇప్పుడా చట్టం ఏం పని చేస్తున్నది, ఎక్కడ పని చేస్తున్నదో చెప్పాల్సిన అవసరం ఉందని విపక్షాలు నిలదీస్తున్నాయి.
అత్యాచార కేసుల్లో నిందితులు దర్జాగా ఎస్పీ కార్యాలయంలో కూర్చుంటున్నారు, బాధితురాలి బంధువులు సంబధీకులూ న్యాయం కోసం కార్యాలయం ఎదుట పడిగాపులు కాస్తున్నా ఫలితం ఉండటం లేదు. పాలనా రాహిత్యానికి పరాకాష్టగా ఈ ప్రభుత్వ పని తీరు ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. రోజా వంటి మంత్రులు మహిళా సాధికారత గురించి గొప్పలు చెబుతున్నారు.
  ఒక అనూష, రమ్య, తేజస్విని, వరలక్ష్మి నాగమ్మ, తాజాగా తెనాలి.. ఇలా మహిళలు బలౌతుంటే.. దిశ చట్టం అంటూ ఘనంగా ప్రకటనలు గుప్పించిన సీఎం మౌనం  దారుణమని అంటున్నారు. 

ప్రభుత్వ పరంగా బాధితులకు ఓదార్పు ఇవ్వడం, స్వాంతన కలిగించే చర్యలు తీసుకోవడానికి ముందుకు రాని ముఖ్యమంత్రి విపక్ష నేతలు బాధితులను పరామర్శించడానికి వెళ్లేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని విపక్ష నాయకులు లోకేష్ విమర్శించారు. బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయనపై రాళ్ల దాడి జరగడం తెలిసిందే. రాళ్ల దాడులకు భయపడేది లేదన్న ఆయన అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి ప్రభుత్వం రాకపోవడం ఒక దారుణమైతే...హత్యాచారానికి గురైన యువతికి కనీసం పోస్టు మార్టం చేయకుండా పోలీసులు అత్యాచారం జరగలేదనీ, అక్రమ సంబంధమే హత్యకు కారణమనీ ప్రకటనలివ్వడం ఏంటని నిలదీశారు.  

అత్యాచారాల విషయంలో నోరు మెదపని నేతలు విపక్ష నేతల పరామర్శలను అడ్డుకోవడం దృష్టి మళ్లింపు రాజకీయం తప్ప మరొకటి కాదని పరిశీలకులు చెబుతున్నారు. అత్యాచార సంఘటనపై దృష్టి మళ్లించడానికే దాడులు చేస్తున్నారనీ, దీని ద్వారా ప్రజల దృష్టి ఘటనపై నుంచి మరలి..అధికార విపక్షాల మధ్య ఘర్షణపై కేంద్రీకృతం అవ్వాలన్నదే దాడులకు పాల్పడే వారి ఉద్దేశమని వారు విశ్లేషిస్తున్నారు.

ప్రభుత్వాధినేత బాధితులను పరామర్శించరు, వారికి అండగా నిలుస్తామన్న మామీ ఇవ్వరు.. విపక్ష నేతలను పరామర్శకు వెళ్ల నివ్వరు.. దాడులకు పాల్పడతారు.. అంటే అత్యాచారాలు జరిగినా ఎవరూ మాట్లాడకూడదు, ఆల్ ఈజ్ వెల్ అంటూ మిన్నకుండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నదని అంటున్నారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. అత్యాచార ఘటనల్లో ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వైసీపీకి చెందిన వారే కావడం వల్ల పోలీసులు చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. జిల్లాల ఎస్పీలఅప్రైజల్ జాబితాను తన వద్ద ఉంచుకుని జగన్  వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ అధికార పార్టీకి తొత్తులుగా మారేలా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పోలీసు అధికారుల అప్రైజల్ జాబితా సీఎం తన వద్ద పెట్టుకున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటేనని వివ్లేషకులు చెబుతున్నారు. 
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేయడం వల్లనే ఆడబిడ్డలపై అత్యాచారాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నదన్న విమర్శలు ఉన్నాయి. ప్రతికల్లో ప్రకటనలు, గంభీర ప్రసంగాలకే ‘దిశ’ చట్టం పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగనన్నా ‘దిశ’ ఏందన్నా అని జనం ఆక్రోశిస్తున్నారు. ఇప్పటికైనా అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకుని రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రతకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. 

By
en-us Political News

  
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.