చెల్లెళ్ల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలేవి జ‌గ‌న్ రెడ్డీ?

Publish Date:Mar 17, 2024

Advertisement

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురై ఐదేళ్లు అయ్యింది. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన వైఎస్ హత్య రాష్ట్రంలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం రేకెత్తించింది. త‌న‌ బాబాయ్ హ‌త్య‌ను అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై నెట్టేసి ప్ర‌జ‌ల‌ సానుభూతితో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చారు. ఈ ఐదేళ్ల కాలంలో వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు నిందితుల్లో వైసీపీ ఎంపీ, జ‌గ‌న్ సోద‌రుడు అవినాశ్ రెడ్డి పాత్ర ఉంద‌ని సీబీఐ అధికారులు తేల్చిన‌ప్ప‌టికీ.. ఆయ‌న్ను అరెస్టు చేయ‌కుండా స్వయంగా జగనే కాపాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  ఈ క్ర‌మంలో స్వ‌యాన త‌న సొంత చెల్లెళ్లు వైఎస్ ష‌ర్మిల, డాక్టర్ సునీతారెడ్డిలు వివేకానంద హ‌త్య కేసులో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాత్రపైనా అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అందుకే అవినాశ్ అరెస్టు కాకుండా జ‌గ‌న్ కాపాడుతున్నారని వారు   ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  కడపలోని వైఎస్ వివేకానంద రెడ్డి ఐదో వర్ధంతి స‌భ జ‌రిగింది. ఈ స‌భ‌లో ష‌ర్మిల‌, సునీతారెడ్డిల‌తో పాటు ప‌లువురు తెలుగుదేశం, కాంగ్రెస్ నేత‌లు సైతం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు మాట్లాడుతూ.. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్య‌వ‌హార‌శైలిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. వివేకానంద రెడ్డిని హ‌త్య‌చేసిన నిందితుల‌ను అరెస్టు చేసే వ‌ర‌కూ త‌మ పోరాటం ఆగ‌ద‌ని జ‌గ‌న్ కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

 వివేకా వ‌ర్ధంతి స‌భ‌లో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై చెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డే వివేకాను చంపారు అన్న ప‌దం త‌ప్ప వివేకా హత్యలో   జ‌గ‌న్ పాత్ర ఉంద‌ని వాళ్లు త‌మ ప్ర‌సంగంలో విస్పష్టంగా చెప్పారు. వివేకాను చంపింది వైసీపీ ఎంపీ అవినాశ్ అని సీబీఐ అధికారులు తేల్చిన‌ప్ప‌టికీ ఎందుకు కాపాడుతున్నావ్ అంటూ జ‌గ‌న్ ను నిలదీశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందుల‌తో పాటు రాష్ట్రంలో ఎక్క‌డ ఎవ‌రికి ఏం అన్యాయం జ‌రిగినా వారికి అండ‌గా ఉండ‌టంలో ముందుండేవారు. వాళ్ల వార‌సుడుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం  సొంత బాబాయ్ ను హ‌త్య‌ చేసిన నిందితులు క‌ళ్ల‌ముందే ఉన్నా వాళ్ల‌ను  జైలుకు పంపించ‌కుండా, తిరిగి బాబాయ్ కుటుంబాన్ని, సొంత చెల్లెళ్ల‌ను సోష‌ల్ మీడియాలో వేధింపుల‌కు గురిచేసి, నింద‌లు మోపుతున్నారు. అలాంటి జ‌గ‌న్‌ వైఎస్ కుటుంబానికి ఎలా వార‌సుడు అవుతావంటూ జ‌గ‌న్ చెల్లెళ్లు ప్ర‌శ్నించారు. వివేకానంద‌రెడ్డిని హ‌త్య‌చేసిన హంత‌కుల‌ను జైలుకు పంపించాల‌ని సునీత చేసే ధ‌ర్మ‌పోరాటానికి తాను  ఆయుధం అవుతా అంటూ వైఎస్ ష‌ర్మిల వ్యాఖ్యానించ‌డం ప్ర‌జ‌ల‌ను ఆలోచింప‌జేస్తున్నది.

 వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాజ‌కీయ‌ వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి,  సొంత బాబాయ్ చ‌నిపోయినా ప‌ట్టించుకోడు.. సొంత చెల్లెలు క‌న్నీరు పెట్టినా ప‌ట్ట‌దు. అలాంటి జ‌గ‌న్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రాజ‌కీయ వార‌సుడు ఎలా అవుతాడ‌న్న ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. వివేకా హ‌త్య విషయంలో  సొంత చెల్లెళ్ల నుంచి, ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న‌ల‌కుస‌మాధానం చెప్ప‌కుండా ఎన్నాళ్లు త‌ప్పించుకొని తిరుగుతారు  జ‌గ‌న్మోహ‌న్ రెడ్డీ అంటూ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుసైతం ప‌లు స‌భ‌ల్లో వివేకానంద రెడ్డి హ‌త్య గురించి ప్ర‌స్తావిస్తున్నారు. ఐదేళ్లు అధికారంలోకి ఉండి సొంత‌బాబాయ్ ను హ‌త్య‌చేసిన నిందితుల‌ను క‌ట‌క‌టాల వెనుక్కు పంపించ‌లేని వ్య‌క్తి రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు ఏవిధంగా న్యాయం చేస్తారని చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తున్నారు.  వివేకానంద రెడ్డి స‌తీమ‌ణి సౌభాగ్య‌మ్మ సైతం త‌న భ‌ర్త హ‌త్య‌కు కార‌ణ‌మైన నిందితుల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కాపాడుతున్నారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయినా, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ విష‌యంపై స్పందించ‌క పోవ‌టం ప‌లు అనుమానాల‌కు తావునిస్తోంది. దీంతో కుటుంబ స‌భ్యులతోపాటు, మెజార్టీ ప్ర‌జ‌లు వివేకా హ‌త్య‌  విష‌యంలో జ‌గ‌న్ పాత్ర ఉంద‌న్నఅభిప్రాయానికి వచ్చేస్తున్నారు. 

ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. అయితే, ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో వైసీపీకి ఘోర‌ ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని పలు స‌ర్వేలు  ఇప్ప‌టికే వెల్ల‌డించాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీని వీడుతున్న నేత‌ల సంఖ్యా రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. జ‌గ‌న్ ఐదేళ్ల అస్తవ్యస్త పాల‌న‌, క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో విసిగిపోయిన జ‌నం ఈసారి కూట‌మికి ప‌ట్టం క‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా  ఎన్నిక‌ల్లో ఘోర‌ ప‌రాభ‌వం ఎదురైన‌ప్ప‌టికీ.. క‌డ‌ప జిల్లాలో ముఖ్యంగా జ‌గ‌న్ పోటీచేసే పులివెందుల నియోజ‌క‌వర్గంలో ఎదురుండ‌ద‌ని ఇన్నాళ్లూ వైసీపీ నేతలు భావించారు. కానీ, ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తుంటే పులివెందుల ప్ర‌జ‌లు కూడా జ‌గ‌న్ ప‌ట్ల ఆగ్ర‌హంతో ఉన్నారని తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వివేకా హ‌త్య కేసులో నిందితుల‌ను క‌ట‌క‌టాల వెనక్కు పంపించ‌క‌పోగా.. సొంత చెల్లెళ్లు, సొంత పిన్నిపై, వారి కుటుంబంపైనే కుట్ర‌ పూరితంగా, కక్ష పూరితంగా జగన్  వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో పులివెందుల ప్ర‌జ‌ల‌ు జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. దీనికి తోడు క‌డ‌ప ఎంపీ స్థానంలో  వివేకానంద‌రెడ్డి స‌తీమ‌ణి సౌభాగ్య‌మ్మ లేదా ఆయన కుమార్తె సునీతారెడ్డిలలో ఒకరు  పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది..వారిలో ఎవరు  పోటీలో నిలిచినా వారికి అండ‌గా నిలుస్తామ‌ని ప‌లు పార్టీలకు చెందిన స్థానిక నేత‌లు హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. క‌డ‌ప ఎంపీ స్థానం నుంచి మ‌రోసారి అవినాశ్ రెడ్డే పోటీ చేస్తున్నారు. క‌డ‌ప పార్ల‌మెంట్ నుంచి సౌభాగ్య‌మ్మ బ‌రిలోకి దిగితే అవినాశ్ రెడ్డితోపాటు, పులివెందుల‌లో జ‌గ‌న్ కుసైతం ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురుకావ‌టం ఖాయ‌మ‌ని ప‌రిశీలకులు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.