వెంకన్న దేవునికి జగనన్న అవమానం...అందుకేనా ?

Publish Date:Sep 28, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ ‘రెడ్డి’ ది ఏ కులం? ఏ మతం? ఇలా ప్రశ్నించడం, ‘సభ్య’ సమాజానికి  సమంజసం అనిపించక పోవచ్చును, కానీ, ఎంత కాదనుకున్నా, కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన కులం ఏమిటి? ఆయన మత విశ్వాసం ఏమిటి? అనే అంశం చర్చకు వస్తూనే వుంది. వస్తూనే ఉంటుంది కూడా. ముఖ్యంగా, ఇతర మతస్తుల, ముఖ్యంగా మెజారిటీ మతస్తులు, హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ముఖ్యమంత్రి లేదా ఆయన కుటుంబ సభ్యులు ప్రవర్తించి నప్పుడు, తప్పయినా, ఒప్పయినా ఇంకేదైనా, ముఖ్యమంత్రి  మత విశ్వాసాలు తప్పని సరిగా చర్చకు వస్తూనే ఉంటాయి.

అందులోనూ  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హిందూ దేవాలయాల పై వరుస దాడులు పెరిగాయి. దేవీ, దేవతల విగ్రాహాలు ద్వంసం చేసే దురాగతాలు పెరిగి పోయాయి. రథాలను దుండగలు తగల బెట్టారు. మరో వంక క్రైస్తవ మత ప్రచారం, మత మార్పిడులు మహా జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు ప్రతి రోజూ వినిపిస్తూనే ఉన్నాయి. పరిస్థితి ఎంత వరకూ వెళ్లిందంటే, క్రైస్తవులకు ప్రత్యేక దేశం కావాలనే, డిమాండ్ వరకు వెళ్ళింది. ఇదంతా ముఖ్యమంత్రి ప్రోత్సాహం, ప్రోద్బలంతో సాగుతోందా లేదా అనేది పక్కన పెడితే, జరుగతున్న పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి మత  విశ్వాలు చర్చకు రావడం తప్పు కాదు. వస్తాయి,

వస్తూనే ఉంటాయి.  నిజానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,అయన కుటుంబ మత విశ్వాసాల గురించి ఎవరికీ, ఎలాంటి సందేహం అవసరం లేదు.  ఇందుకు సమబందించి జగన్ రెడ్డి తల్లి   విజయమ్మ బైబిల్ సాక్షిగా, చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో చాలా కాలం క్రితం, ఒక ఇంటర్వ్యూలో ఆమెను ఇదే ప్రశ్న అడిగినప్పుడు, ఆమె ఏ మాత్రం తడబాటు లేకుండా, “మాది క్రైస్తవ కుటుంబం. ఏసు ప్రభువు ఒకడే దేవుడు అని నమ్మే క్రైస్తవ ధర్మాన్ని, మా కుటుంబం దేవుని వాక్కుగా విశ్వసిస్తుంది. కుటుంబంలో జరిగే శుభ, అశుభ కార్యాలు అన్నీ, క్రైస్తవ ధర్మం ప్రకారమే జరుగుతాయి” అని స్పష్టంగా చెప్పారు.

అంతే కాదు, రాజశేఖర రెడ్డి (వైఎస్సార్) కానీ, జగన్  కానీ, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, రాజకీయ అవసరాల కోసం హిందూ దేవాలయాలలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హిందువుల పండగలు, పబ్బాలలో మొక్కుబడిగా మాత్రమే పాల్గొంటారని నిర్మొహమాటంగా తెగేసి చెప్పారు. అంతే కానీ, క్రైస్తవ ధర్మాన్ని మాత్రం ఆ క్షణంలో కూడా మరవరని విజయమ్మ అంతే స్పష్టంగా చెప్పారు. విజయమ్మ చెప్పిన సత్య్యాన్ని పక్కన పెట్టినా, కళ్ళ ముందు జరుగతున్న పరిణామాలు  జగన్మోహన్ రెడ్డికి, ఆయన  కుటుంబానికి,“ఏసు దేవుడు ఒక్కడే దేవుడు”, ఇతర మతాలను, ఇతర దేవుళ్ళను వారు వారు విశ్వసించరు అనే నిజం, వారి చర్యలలో స్పష్టంగా దర్శనమిస్తూనే వుంది. అందులో ఎవరికీ అనుమానం అవసరం లేదు.

జగన్ రెడ్డి చాలా సందర్భాలలో మాటకు ముందో మారు, చివరో మరో మారు దేవుని ప్రస్తావన చేస్తారు. దైవ స్తుతి చేస్తారు. అయితే, అమాయకంగా, హిందువులు ఎవరైనా, ఆయన ప్రస్తావించిన, దేవుడు, ముక్కోటి దేవతలు ఆరాధించే,  వెంకన్న దేవుడనో, కనకదుర్గమ్మ తల్లనో, అనుకుంటే, అది పొరపాటే అవుతుంది. ఆయన పగటి పూట పలవరించినా, రాత్రులలో కలవరించినా ‘ఏసు’ దేవుని నామమును మాత్రమే పలుకుదురు. మరో, దేవున్ని మనసులోకి రానీయరు. ఆలాగే ఆయన రాత్రులలో నేరుగా దేవునితో మాట్లాడినా, ఏసు దేవునితోనే మాట్లాడతారు కానీ , పక్కనే ఉన్నారు కదా అని మంగళగిరి పానకాల స్వామితోనో, మన వైజాగ్’ కు దగ్గరగా ఉన్నారని  సింహాద్రి అప్పన్నతోనో మాట్లాడరు. ఆయన ఏసు ప్రభువునే ధ్యానిస్తారు, ఏసు ప్రభువునే ఆరాధిస్తారు.

ఏసు ప్రభువుతోనే మాట్లాడతారు. కలలో అయినా, ఆయన, ఏ ‘హిందూ’ దేవుడిని దేవుడినిగా గుర్తించరు. ముక్కోటి హిందూ దేవీ దేవతలలో ఏ ఒక్కరి పేరూ పొరపటున అయినా  ఉచ్చరించరు. అయితే, ఇప్పడు ఇదంతా ఎందుకంటే, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, నుదుటున బొట్టు లేదని, అయన వెంట వారి సతీమణి రాలేదని, లేరనీ, సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో, ఇప్పుడు మళ్ళీ మరో మారు ముఖ్యమంత్రి మత విశ్వాసాల విషయం చర్చకు వచ్చింది. 
నిజానికి ముఖ్యమంత్రి తమ మత విశ్వాసాలను పాటిస్తే, ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఇతర మత విశ్వాసాలను, ముఖ్యంగా హిందువుల విశ్వాసాలు, ఆచార, వ్యవహారాలను అగౌరవ పరిచే విధంగా, ముఖ్యమంత్రి ప్రవర్తన, సర్కార్ తీరు ఉంటున్నాయనేదే హిందూ ధార్మిక సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణ.

ప్రస్తుత విషయానికే వస్తే, తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆచారంగా వస్తోంది. నిజానికి, దేవుని కార్యానికి అనే కాదు, హిందూ ధర్మం,ఆచార, వ్యవహారాల  ప్రకారం పెళ్లి, పేరంటం ఏదైనా, తల్లి తండ్రులు, పెద్దలు, పిల్లలు ఎవరైనా  దంపతులకు దంపతులే బట్టలు పెడతారు. అంతేకానీ, ఇలా ఒంటరిగా వచ్చి బట్టలు పెట్టడం ఉండదు. అలాంటిది, ఆ దేవ దేవునికి ముఖ్యమత్రి ఒంటరిగా పట్టు వస్త్రాలు సమర్పించడం,అపచారం. అవమానం. హిందువుల మనోభావాలను కించపరిచే, అపరాధం. నిజమే, ఏసు నాథుని తప్ప మరో దేవుని పేరును ఉచ్చరించడమే మహా పాపమని, ‘సెక్యులర్’ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భావిస్తే భావించ వచ్చును, అది వారి విశ్వాసం. అలాటప్పుడు, ముఖ్యంత్రి అయినా, మనసు చంపుకుని మొక్కుబడి తంతుగా కార్యక్రమలో పాల్గొనడం ఎందుకు?   ఇంచక్కా దేవాదాయ శాఖ మంత్రి దంపతులకో, లేదా మరో మంత్రికో ఆ కార్యం అప్పగిస్తే, ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు కాదా? ముఖాన బొట్టు పెట్టుకోవలసిన అవసరం ఉండదు కదా?  ఇలా, తమ మనస్సును కష్ట పెట్టుకొంటూ, కోట్లాది హిందువుల మనోభావాలను కించే పరచడం అవసరమా? ఇదే ఇప్పడు హిందూ సమాజం, హిందూ ధార్మిక సంస్థలు ముఖ్యమంత్రిని అడుగుతున్న ప్రశ్న.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.