జగన్ కక్ష పూరిత రా జకీయాలు.. వ్యవస్థలే టార్గెట్!

Publish Date:Sep 27, 2023

Advertisement

జగన్ రెడ్డి కక్ష రాజకీయాలు దాటి, వ్యక్తులను దాటి ఏకంగా వ్యవస్థలనే టార్గెట్ చేసిందా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. అక్రమాస్తుల కేసులో తనను జైలుకు పంపిన వ్యవస్థలపై ఆయన కక్షకట్టారనీ, అందుకే రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకున్నారనీ అంటున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను పంజరంలో ఉన్న పెంపుడు చిలుకలుగా మార్చేసిన జగన్ ఇక న్యాయ వ్యవస్థపై కూడా పంజా విసరాలని భావిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.

2019 ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన జగన్ రెడ్డి.. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటమే కాకుండా ప్రశ్నించిన వారిపై వేధింపులకు దాడులకు పాల్పడుతున్నారు. సీఐడీ కస్టడీలో మ్యాన్ హ్యాండిలింగ్ కు గురైన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం  రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు.   ఇక అధికారం చరమాంకానికి వచ్చిన తరుణంలో జగన్ వైనాట్ 175 అన్న ధీమానుంచీ ఎట్ లీస్ట్ అధికారం మరో సారి అన్న అభ్యర్థనలను కూడా జనం వినరన్న నిర్ధారణకు వచ్చిన తరువాత.. తనతో పాటు అందర్నీ ముంచేయాలన్న ఉద్దేశంతోనే అక్రమ అరెస్టులకు తెరతీశారని రామకృష్ణం రాజు ఆరోపించారు. నిజమే.. జగన్ విపక్షాలను అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో దిగ్బంధించేసి రాష్ట్రం మొత్తాన్ని భయం గుప్పెట బంధించేసి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో విశృఖలంగా వ్యవహరిస్తున్నారనీ, పీక్స్ చేరిన అధికార ఉన్మాదంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.

అయితే జనం ఒక సారి డిసైడ్ అయితే.. ఎదుటి వ్యక్తి ఎంత శక్తిమంతుడైనా, ఎంతగా మంద బలంతో అణచివేయాలని చూసినా ప్రజల చేతిలోని ఓటు అనే పాశుపతాస్త్రం సూటిగా లక్ష్యాన్నే తాకుతుందని, ఎంతటి వారినైనా ఓడించి ఇంటికి పంపుతుందనీ చరిత్ర పలుమార్లు రుజువు చేసిందంటున్నారు. అధికారంలో ఉన్నాం ఏం చేసినా చెల్లుతుందని భావించిన నేతలు ప్రజాగ్రహానికి గురై ఇళ్లకే పరిమితమైన ఉదంతాలెన్నో ఉన్నాయని ఉదహరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను విస్మరించిన జగన్ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజల ఆగ్రహాన్నీ చవి చూస్తున్నారనీ, ప్రజాగ్రహాన్ని కూడా దౌర్జన్యంతో అణచివేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేవనీ అంటున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన సంపూర్ణ మద్య నిషేధం, వారంలో సీపీఎస్ రద్దు హామీ అంటూ గత ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఇప్పుడు దానిని పట్టించుకోవడం లేదనీ, అలాగే అంగన్వాడీలు, ప్రభుత్వోద్యోగులు, సంపూర్ణ మద్య నిషేధం హామీని తుంగలోకి తొక్కి మహిళల ఆగ్రహానికీ గురైన జగన్ను ఇప్పుడు ఆ ఆగ్రహ జ్వాలల సెగ తగిలి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.

దొంగ ఓట్లు, డబ్బు, మద్యం, ప్రలోభాలూ ఇవేవీ జగన్ ను ఎన్నికలలో ఓటమి నుంచి కాపాడే పరిస్థితి లేదని అంటున్నారు. ఇప్పుడు జగన్ అన్ని హద్దులూ దాటేసి జరగని కుంభకోణాలు, లేని కేసులతో విపక్ష నేతలను నిర్బంధించి గెలవాలని, గెలుస్తాననీ భావించడం భ్రమే అవుతుందని అంటున్నారు. జగన్ కు విజయం కనుచూపుమేరలో కూడా లేదని ఇప్పటికే పలు సర్వేలు తేల్చేశాయని పరిశీలకులు ఉదహరిస్తున్నారు. 

By
en-us Political News

  
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.