జగన్ కక్ష పూరిత రా జకీయాలు.. వ్యవస్థలే టార్గెట్!

Publish Date:Sep 27, 2023

Advertisement

జగన్ రెడ్డి కక్ష రాజకీయాలు దాటి, వ్యక్తులను దాటి ఏకంగా వ్యవస్థలనే టార్గెట్ చేసిందా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. అక్రమాస్తుల కేసులో తనను జైలుకు పంపిన వ్యవస్థలపై ఆయన కక్షకట్టారనీ, అందుకే రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకున్నారనీ అంటున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను పంజరంలో ఉన్న పెంపుడు చిలుకలుగా మార్చేసిన జగన్ ఇక న్యాయ వ్యవస్థపై కూడా పంజా విసరాలని భావిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.

2019 ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన జగన్ రెడ్డి.. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటమే కాకుండా ప్రశ్నించిన వారిపై వేధింపులకు దాడులకు పాల్పడుతున్నారు. సీఐడీ కస్టడీలో మ్యాన్ హ్యాండిలింగ్ కు గురైన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం  రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు.   ఇక అధికారం చరమాంకానికి వచ్చిన తరుణంలో జగన్ వైనాట్ 175 అన్న ధీమానుంచీ ఎట్ లీస్ట్ అధికారం మరో సారి అన్న అభ్యర్థనలను కూడా జనం వినరన్న నిర్ధారణకు వచ్చిన తరువాత.. తనతో పాటు అందర్నీ ముంచేయాలన్న ఉద్దేశంతోనే అక్రమ అరెస్టులకు తెరతీశారని రామకృష్ణం రాజు ఆరోపించారు. నిజమే.. జగన్ విపక్షాలను అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో దిగ్బంధించేసి రాష్ట్రం మొత్తాన్ని భయం గుప్పెట బంధించేసి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో విశృఖలంగా వ్యవహరిస్తున్నారనీ, పీక్స్ చేరిన అధికార ఉన్మాదంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.

అయితే జనం ఒక సారి డిసైడ్ అయితే.. ఎదుటి వ్యక్తి ఎంత శక్తిమంతుడైనా, ఎంతగా మంద బలంతో అణచివేయాలని చూసినా ప్రజల చేతిలోని ఓటు అనే పాశుపతాస్త్రం సూటిగా లక్ష్యాన్నే తాకుతుందని, ఎంతటి వారినైనా ఓడించి ఇంటికి పంపుతుందనీ చరిత్ర పలుమార్లు రుజువు చేసిందంటున్నారు. అధికారంలో ఉన్నాం ఏం చేసినా చెల్లుతుందని భావించిన నేతలు ప్రజాగ్రహానికి గురై ఇళ్లకే పరిమితమైన ఉదంతాలెన్నో ఉన్నాయని ఉదహరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను విస్మరించిన జగన్ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజల ఆగ్రహాన్నీ చవి చూస్తున్నారనీ, ప్రజాగ్రహాన్ని కూడా దౌర్జన్యంతో అణచివేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేవనీ అంటున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన సంపూర్ణ మద్య నిషేధం, వారంలో సీపీఎస్ రద్దు హామీ అంటూ గత ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఇప్పుడు దానిని పట్టించుకోవడం లేదనీ, అలాగే అంగన్వాడీలు, ప్రభుత్వోద్యోగులు, సంపూర్ణ మద్య నిషేధం హామీని తుంగలోకి తొక్కి మహిళల ఆగ్రహానికీ గురైన జగన్ను ఇప్పుడు ఆ ఆగ్రహ జ్వాలల సెగ తగిలి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.

దొంగ ఓట్లు, డబ్బు, మద్యం, ప్రలోభాలూ ఇవేవీ జగన్ ను ఎన్నికలలో ఓటమి నుంచి కాపాడే పరిస్థితి లేదని అంటున్నారు. ఇప్పుడు జగన్ అన్ని హద్దులూ దాటేసి జరగని కుంభకోణాలు, లేని కేసులతో విపక్ష నేతలను నిర్బంధించి గెలవాలని, గెలుస్తాననీ భావించడం భ్రమే అవుతుందని అంటున్నారు. జగన్ కు విజయం కనుచూపుమేరలో కూడా లేదని ఇప్పటికే పలు సర్వేలు తేల్చేశాయని పరిశీలకులు ఉదహరిస్తున్నారు. 

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.