మతిమరుపు జనానికా.. జగన్ కా! పోలవరం నిర్వాసితులకు పరిహారం దక్కేనా?

Publish Date:Jul 27, 2022

Advertisement

ప్రజలకు గతంలో తాను చెప్నిన మాటలు గుర్తుండవు అనుకున్నారో ఏమో జగన్ పోలవరం నిర్వాసితుల విషయంలో గతంలో మాట్లాడిన దానికి పొంతన లేకుండా మాట్లాడారు. వారికి మతిమరుపు ఎక్కువ అని ఆయన భావం అయి ఉంటుంది. అందుకే పోలవరం నిర్వాసితులకు ఆర్ఆర్ఆర్ ( రిహెబిలిటేషన్ అండ్ రీ సెటిల్ మెంట్) ప్యాకేజీ తన వల్ల కాదని చెప్పేశారు. కేంద్రమే ఇవ్వాలని కానీ కేంద్రం ఇవ్వడం లేదనీ నెపం కేంద్రం మీదకు నెట్టేశారు.

ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలంటే 20 వేల కోట్లు అవసరం అవుతుందని, అది కేంద్రం ఇవ్వాలే కానీ తన వల్ల ఎలా అవుతుందని బీద అరుపులు అరిచారు. పోలవరం ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఆయన బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పిన విషయాలివి. అయితే గతంలో అంటే విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఇందుకు పూర్తి భిన్నంగా మాట్లాడిన విషయాన్ని పోలవరం నిర్వాసితులు గుర్తు చేస్తున్నారు.

గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు కేంద్రం ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పినప్పుడు ఆ ఆర్థిక ప్యాకేజీలో ఆర్ఆండ్ ఆర్ ప్యాకేజీని కూడా ఆ ఆర్థిక ప్యాకేజీలో చేర్చారు. అంతే వంద శాతం ప్రాజెక్టు వ్యయం కేంద్రమే భరించేలా ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే అప్పట్లో విపక్ష నేత హోదాలో జగన్ దీనిని పూర్తిగా వ్యతిరేకించారు.అంచనాలు పెంచడాన్ని జగన్ గట్టిగా వ్యతిరేకించారు. చంద్రబాబు అవినీతి కోసమే అంచనాలు భారీగా పెంచేశారని విమర్శలు గుప్పించారు.

ఇదే విషయాన్ని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఫిర్యాదుల ఆధారంగానే కేంద్రం అంచనాలను తగ్గించేసింది. ఆర్ఆర్ ప్యాకేజీతో తనకు సంబంధం లేదని కేంద్రం తేల్చేసింది. గతంలో అంటే జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు ఎకరానికి పది వేలిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పది లక్షల సంగతి మరిచిపోయి ముందుగా హామీ ఇచ్చిన విధంగా ఎకరాకు ఐదు లక్షలంటూ చెబుతున్నారు. తీసుకున్న అప్పుల లెక్కలు మార్చేసినట్లుగానే హామీ ఇచ్చిన పది లక్షలను వదిలేసి తానిచ్చిన హామీ ఐదులక్షలే అని చెప్పడానికి ఇసుమంతైనా సంకోచించడం లేదు.

జగన్ వైఖరిని పరిశీలకులు తప్పుపడుతున్నారు. జగన్ తన తీరుతో పోలవరం ప్రాజెక్టునూ, పోలవరం నిర్వాసితులనూ నిండా ముంచేశారని విమర్శిస్తున్నారు. ఇక జగన్ వ్యాఖ్యలు కేంద్రాన్నీ ఇరుకున పెట్టాయి. పోలవరం అంచనాల పెంపు వెనుక భారీ అవినీతి ఉందని, అంచనాలు పెంచవద్దని జగన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే అంచనాలను తగ్గించేశామని కేంద్రం చెబుతోంది. ఇప్పుడు అదే జగన్ కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదని కేంద్రంపై ఆరోపణలు చేయడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులకు జగన్ గతంలో చేసిన ప్రసంగాల, అప్పటి చంద్రబాబు సర్కార్ పై పోలవరం అవినీతిపై చేసిన విమర్శలను ప్రజలలోకి తీసుకువెళ్లి జగన్ వైఖరిని ఎండగట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.    

By
en-us Political News

  
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.