జగన్ రోజు రోజుకూ ఓ ట్రోల్ ఐటెమ్ గా మారిపోతున్నారా?

Publish Date:Jul 2, 2026

Advertisement

ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్.. రోజు రోజుకూ ఓ ట్రోల్ స్టఫ్ గా మారిపోతున్నారా? అంటే నెటిజనులు ఔననే అంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయన   మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారని తెలియగానే.. ట్రోలింగ్ కు, మీమ్స్ కు కావలసినంత స్టఫ్ దొరుకుతుందని నెటిజనులు సంబరపడిపోతున్నారు. అందుకు తగ్గట్టుగానే జగన్ ప్రెస్ మీట్ లలో చేసే ప్రసంగాలు ఉంటున్నాయి.  జగన్ ప్రసంగాలు,  మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.

 నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.  అందుకు తగ్గట్టుగానే జగన్   వివాదాస్పదమైన, వినూత్నమైన ప్రకటనలు ట్రోలర్లకు, నెటిజనులకు కావలసినంత స్టఫ్ అందిస్తున్నాయి.  తాజాగా బుధవారం (జూన్ 1) జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో  అమరావతి వర్సెస్ 'మావిగన్' అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇప్పటికే జగన్ మావిగన్ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా అందరి హేళనలకూ గురై ఒక హాస్యాస్పద అంశంగా మారిపోయింది. అదలా ఉండగానే.. తన తాజా ప్రెస్ మీట్ లో జగన్  ఏకంగా మావిగన్ ను వచ్చే ఎన్నికల అజెండాగా ప్రకటించడం నెటిజనులకు పండుగలా మారింది. 

ఇక దీనిపై మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానం దాటవేసిన తీరు కూడా ఆయనపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు కారణమైంది. సాధారణంగా ప్రెస్ మీట్లలో ఎదురయ్యే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పే జగన్, ఈసారి మాత్రం ఎన్నికల అజెండాగా మావిగన్ అంటూ చేసిన ఆయన ప్రకటనపై విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడం కూడా జగన్ పారిపోయారు అంటూ నెటిజనులు ట్రోల్ చేయడానికి కారణమైంది.  మావిగన్ ఎన్నికల అజెండా అయితే విశాఖ పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు జగన్ నిరుత్తరుడై, కనీసం ఆ ప్రశ్న సంధించిన విలేకరి వైపైనా చూడకుండా.. హడావుడిగా ప్రెస్ మీట్ ను ముగించేయడం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 

ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా జగన్ జారుకున్నారనీ, ప్రశ్నలు వినిపించలేదన్నట్లు యాక్ట్ చేయడంలో జగన్  కమల్ హసన్ ను మించిపోయారనీ నెటిజన్లు వీర లెవెల్లో ఎగతాళి చేస్తున్నారు.  2019 నుంచి 2024 వరకూ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్.. ఆ ఐదేళ్లూ  విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధాని అని, త్వరలోనే అక్కడి నుంచే పాలన సాగిస్తానని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి అత్యంత ఆదర్శవంతమైన ఫార్ములా మూడు రాజధానులేననీ, అదే తాను చేస్తున్నాననీ చెప్పుకున్నారు.

అయితే మూడు రాజధానులను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలూ  2024 ఎన్నికలలో మూకుమ్మడిగా తిరస్కరించి, వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తీర్పు ఇచ్చారు. ఇప్పుడు జగన్ తాజాగా విశాఖను, మూడు రాజధానులనూ వదిలేసి మావిగన్ అంటూ కొత్త రాగం అందుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తన తాజా ప్రెస్ మీట్ లో వైజాగ్ రాజధాని గురించి అడిగిన ప్రశ్న వినగానే..  ఏం చేస్తున్నాడో తెలియనట్లు రెండు చేతులూ జేబులో పెట్టుకుని అలా నడిచి వెళ్లిపోయారంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.  

By
en-us Political News

  
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.