ఢిల్లీలో క‌ద‌లిక.. జ‌గ‌న్ వణుకే ఇక!

Publish Date:Apr 3, 2024

Advertisement

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఐదేళ్ల వైసీపీ పాల‌న‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ప్ర‌జ‌లు.. అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా మే13న జ‌రిగే పోలింగ్‌లో జగన్ కు ఆయన పార్టీకీ ఓటుతో   గుణ‌పాఠం చెప్పేందుకు రెడీ అయిపోయారు. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేత పెల్లుబుకుతుండ‌టంతో మ‌రోసారి అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌ని స‌ర్వేల‌ ద్వారా గుర్తించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎలాగోలా రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ వైసీపీ నేత‌లు రాష్ట్రంలోని కొంద‌రు అధికారుల స‌హ‌కారంతో రెచ్చిపోతున్నారు. మ‌ రోవైపు వాలంటీర్లు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఎన్నిక‌ల ప్ర‌చారాల్లో పాల్గొన్నా, రాజ‌కీయ పార్టీల స‌మావేశాలకు హాజ‌రైనా, ఎన్నిక‌ల విధుల్లో నిమ‌గ్న‌మైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈసీ ఉత్త‌ర్వుల‌కు లోబ‌డి రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిసైతం ప్ర‌త్యేకంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. అయినా, కొంద‌రు వాలంటీర్లు బ‌హిరంగంగానే వైసీపీ అభ్య‌ర్థుల ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. అంతే కాకుండా  ఇంటింటికి తిరిగి వైసీపీకి ఓట్లు వేయాల‌ని కోరుతున్నారు. దీనిపై  ప్ర‌తిప‌క్ష పార్టీల‌ నేత‌లు ఈసీకి ప‌లు సార్లు ఫిర్యాదులు  చేశారు.

 ఏపీలోజగన్  హ‌యాంలో ఐదేళ్ల‌పాటు అరాచ‌క పాల‌న సాగింద‌ని అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ప్ర‌శ్నించిన ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డం, జైలుపాలు చేయ‌డంతోపాటు.. దాడులుసైతం చోటుచేసుకున్నాయి. మేము ఏం చేసినా మాకు ఎవ‌రూ ఎదురు మాట్లాడొద్దు.. మాట్లాడితే దాడులు త‌ప్ప‌వు అన్న‌ట్లుగా వైసీపీ నేత‌లు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేశారు. ఏకంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుపైనా అక్ర‌మ కేసులు పెట్టింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. పోలీసులు, అధికారుల‌ను అడ్డంపెట్టుకొని ఐదేళ్లు రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్ అరాచ‌క పాల‌న సాగించాడు. జ‌గ‌న్ ఫ్యాక్ష‌న్ పాల‌న‌కు చెక్ పెట్టాలంటే కేంద్రంలో బీజేపీ అండ‌దండ‌లు ఉండాల‌ని భావించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్రంలో బీజేపీకి ప్ర‌జాబ‌లం లేక‌పోయినా వారు కోరిన సీట్లు ఇచ్చిన తమ కూటమిలో చేర్చుకున్నాయి. తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మిలో బీజేపీ క‌లవ‌డం, గ‌త నెల‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూట‌మి బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించ‌డంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆట‌ల‌కు చెక్ ప‌డుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు జ‌గ‌న్, వైసీపీ నేత‌లు చేస్తున్న అరాచ‌కాల‌కు చెక్ పెట్ట‌డంలో తాత్సారం చేస్తూ వ‌చ్చారు. దీనికి తోడు పార్ల‌మెంట్‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌లో బీజేపీ అధిష్టానం జ‌గ‌న్ విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంద‌న్న  చ‌ర్చ‌ కూడా రాజకీయాలలో జరిగింది.  జ‌గ‌న్ ప్ర‌మేయం వ‌ల్ల‌నే బీజేపీ నుంచి టికెట్ ఆశించిన రాఘురామ‌ రాజుకు చుక్కెదురైంద‌న్న వాద‌న‌లు తెర‌పైకి వ‌చ్చాయి. స్వయంగా ర‌ఘురామ‌ రాజు సైతం త‌న‌కు బీజేపీ టికెట్ రాక‌పోవటానికి కార‌ణం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 ఏపీలోతెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల‌తో బీజేపీ పొత్తులో ఉన్న‌ప్ప‌టికీ.. బీజేపీ పెద్ద‌లు మాత్ర‌మే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వాద‌న ఏపీ రాజ‌కీయాల్లో విస్తృతంగా జ‌రుగుతున్నది. దీంతో తెలుగుదేశం, జ‌న‌సేన శ్రేణులు బీజేపీ కేంద్ర పెద్ద‌ల‌పై ఆగ్ర‌హంతో ఉన్నారు. పొత్తు ధ‌ర్మాన్ని బీజేపీ తుంగ‌లో తొక్కుతున్నద‌న్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే  తాజాగా బీజేపీ కేంద్ర పెద్ద‌ల్లో క‌ద‌లిక వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో గ‌త నాలుగు రోజులుగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వ‌రుస‌గా షాక్‌లు త‌గులుగుతున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. వాలంటీర్లు ఎన్నిక‌ల్లో పాలు పంచుకోవ‌ద్ద‌ని ఇప్ప‌టికే ఈసీ ఆదేశించింది. దీనికితోడు పెన్ష‌న్ల పంపిణీలోనూ వాలంటీర్ల ప్ర‌మేయం ఉండొద్ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాలున్న వాలంటీర్లు పెన్షన్ల పేరుతో, రేషన్‌ పేరుతో ఓటర్ల వద్దకు వెళ్తుండడంతో ఇక నుంచి అలాంటివి కుదరవని ఈసీ తెల్చి చెప్పింది.

ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. వైసీపీ పార్టీ అభ్య‌ర్థుల‌కు వ‌త్తాసు ప‌లుకుతున్న అధికారుల‌పైనా ఈసీ గురిపెట్టింది. పలువురు కలెక్టర్లు, ఎస్పీలను ఎన్నికల విధులకు దూరం చేసింది. దీంతో జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గీయులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వారి ఆందోళల ప్రస్ఫుటంగా కనిపిస్తోంది‌. దీనికితోడు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ కు జ‌డ్ సెక్యూరిటీని కేంద్రం క‌ల్పించింది. వైసీపీ ప్ర‌భుత్వంలో నారా లోకేశ్ పై అనేక‌సార్లు వైసీపీ నేత‌లు దాడుల‌కు య‌త్నించారు. ఆ స‌మ‌యంలో భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరిన‌ప్ప‌టికీ వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికల మేర‌కు లోకేశ్ కు కేంద్ర జ‌డ్ కేట‌గిరి భ‌ద్ర‌త‌ను కేంద్రం క‌ల్పించింది. లోకేశ్ కు జెడ్ సెక్యూరిటీ ఇవ్వ‌డాన్ని జీర్ణించుకోలేక పోతున్న వైసీపీ నేత‌లు.. అవాకులు చ‌వాకులు పేలుతున్నారు. 

సుప్రీం కోర్టులోనూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై కారణాలు తెలపాలని సీబీఐని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో ట్రయల్‌ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం ఆదేశించింది. ఈసీ ఎన్నిక‌ల నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన వైసీపీ నేత‌ల‌పై కొర‌డా ఝళిపిస్తుండ‌టంతో పాటు మ‌రోప‌క్క జ‌గ‌న్ కేసుల విచారణ కూడా వేగం పుంజుకుంటుండటంతో  బీజేపీ పెద్ద‌లు రంగంలోకి దిగార‌ని, జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గీయుల ఆగ‌డాల‌కు చెక్ ప‌డిన‌ట్లేన‌ని ప్ర‌తిప‌క్షాల నేత‌లు పేర్కొంటున్నారు. దీంతో జగన్ కు, ఆయన పార్టీ నేతలకూ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. 

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.