పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బాట పట్టనున్నారా?.. తన అహాన్ని చంపుకుని ప్రతిపక్ష హోదా లేకున్నా తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి హాజరౌతారా? ఈ నెలలో జరుగుతాయని భావిస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆయనతో సహా వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలూ పాల్గొంటారా? అంటే వైసీపీ సోషల్ మీడియా ఔననే అంటున్నది.
ఇంత కాలం ఆయన అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికి ఆయన చెబుతున్న కారణం ప్రతిపక్ష హోదా లేదనే. అర్హత లేకున్నా తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలనీ, తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనీ కోరుతూ కోర్టుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. జగన్ ప్రతిపక్ష హోదా డిమాండ్ ను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ప్రజా తీర్పును తాము శిరసావహిస్తామనీ, వారి మేండేట్ కు విరుద్ధంగా జగన్ పార్టీకి విపక్ష హోదా ఇవ్వలేమనీ విస్పష్టంగా చెప్పింది. ఇప్పుడు జగన్ తన అహాన్ని వీడి సాధారణ సభ్యుడిగా అసెంబ్లీకి హాజరు కావడానికి నిర్ణయించుకున్నారు. అసెంబ్లీలో వైసీపీ తెలుగుదేశం, జనసేనల తరువాత మూడో పెద్ద పార్టీగా ఉంటుంది. హౌస్ లో ఆ పార్టీ కంటే బీజేపీకి మాత్రమే తక్కువ సభ్యులు ఉన్నారు. ఆ నిష్పత్తి ప్రకారమే సభలో మైక్ దొరికే సమయం కూడా ఉంటుంది.
ఇక విషయానికి వస్తే.. జగన్ అసెంబ్లీకి రావడమంటూ జరిగితే.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సభాధ్యక్ష స్థానంలో ఉండటం ఖాయం. ఆయనను జగన్ ఎలా ఫేస్ చేస్తారన్నది చూడాలి. అయితే ఇప్పటి వరకూ వైసీపీ నుంచి అధికారికంగా అసెంబ్లీకి హాజరుపై ఎలాంటి సమాచారం లేదు. గత అసెంబ్లీ సెషన్ ను జగన్, ఆయన పార్టీ సభ్యులు బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ జరిగినన్నాళ్లు ప్రతి రెండు మూడు రోజులకు ఒక సారి జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఆ విమర్శలను జనం ఇసుమంతైనా పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇప్పుడు జగన్ తన ప్రతిజ్ణను అంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ చేసిన ప్రతిజ్ణను పక్కన పెట్టి అసెంబ్లీకి హాజరవ్వడమంటే ఆయనలో అహం చచ్చిందనే భావించాల్సి ఉంటుంది. గతంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆయన పలు వాగ్దానాలను భంగం చేశారు. అది వేరే సంగతి. ఇప్పుడు సాధారణ సభ్యుడిలా అసెంబ్లీకి హాజరు కావడానికి సిద్ధమయ్యారంటూ వస్తున్న వార్తలు నిజమే అయితే అది ఆయన పార్టీకి చెందిన మిగిలిన పది మంది ఎమ్మెల్యేలకూ పెద్ద ఊరట అనే చెప్పాలి. జగన్ మాట పట్టుకుని అసెంబ్లీకి డుమ్మా కొట్టడం ద్వారా వారు తమతమ నియోజకవర్గాలలో ప్రజలకు మొహం చూపించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కనీసం వారినైనా కాపాడుకోవాలంటే జగన్ తన అహాన్ని వీడి వాస్తవం గ్రహించి మెసులుకోని తీరాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-to-attend-assembly-25-192348.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.