పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బాట పట్టనున్నారా?.. తన అహాన్ని చంపుకుని ప్రతిపక్ష హోదా లేకున్నా తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి హాజరౌతారా? ఈ నెలలో జరుగుతాయని భావిస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆయనతో సహా వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలూ పాల్గొంటారా? అంటే వైసీపీ సోషల్ మీడియా ఔననే అంటున్నది.
ఇంత కాలం ఆయన అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికి ఆయన చెబుతున్న కారణం ప్రతిపక్ష హోదా లేదనే. అర్హత లేకున్నా తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలనీ, తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనీ కోరుతూ కోర్టుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. జగన్ ప్రతిపక్ష హోదా డిమాండ్ ను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ప్రజా తీర్పును తాము శిరసావహిస్తామనీ, వారి మేండేట్ కు విరుద్ధంగా జగన్ పార్టీకి విపక్ష హోదా ఇవ్వలేమనీ విస్పష్టంగా చెప్పింది. ఇప్పుడు జగన్ తన అహాన్ని వీడి సాధారణ సభ్యుడిగా అసెంబ్లీకి హాజరు కావడానికి నిర్ణయించుకున్నారు. అసెంబ్లీలో వైసీపీ తెలుగుదేశం, జనసేనల తరువాత మూడో పెద్ద పార్టీగా ఉంటుంది. హౌస్ లో ఆ పార్టీ కంటే బీజేపీకి మాత్రమే తక్కువ సభ్యులు ఉన్నారు. ఆ నిష్పత్తి ప్రకారమే సభలో మైక్ దొరికే సమయం కూడా ఉంటుంది.
ఇక విషయానికి వస్తే.. జగన్ అసెంబ్లీకి రావడమంటూ జరిగితే.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సభాధ్యక్ష స్థానంలో ఉండటం ఖాయం. ఆయనను జగన్ ఎలా ఫేస్ చేస్తారన్నది చూడాలి. అయితే ఇప్పటి వరకూ వైసీపీ నుంచి అధికారికంగా అసెంబ్లీకి హాజరుపై ఎలాంటి సమాచారం లేదు. గత అసెంబ్లీ సెషన్ ను జగన్, ఆయన పార్టీ సభ్యులు బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ జరిగినన్నాళ్లు ప్రతి రెండు మూడు రోజులకు ఒక సారి జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఆ విమర్శలను జనం ఇసుమంతైనా పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇప్పుడు జగన్ తన ప్రతిజ్ణను అంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ చేసిన ప్రతిజ్ణను పక్కన పెట్టి అసెంబ్లీకి హాజరవ్వడమంటే ఆయనలో అహం చచ్చిందనే భావించాల్సి ఉంటుంది. గతంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆయన పలు వాగ్దానాలను భంగం చేశారు. అది వేరే సంగతి. ఇప్పుడు సాధారణ సభ్యుడిలా అసెంబ్లీకి హాజరు కావడానికి సిద్ధమయ్యారంటూ వస్తున్న వార్తలు నిజమే అయితే అది ఆయన పార్టీకి చెందిన మిగిలిన పది మంది ఎమ్మెల్యేలకూ పెద్ద ఊరట అనే చెప్పాలి. జగన్ మాట పట్టుకుని అసెంబ్లీకి డుమ్మా కొట్టడం ద్వారా వారు తమతమ నియోజకవర్గాలలో ప్రజలకు మొహం చూపించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కనీసం వారినైనా కాపాడుకోవాలంటే జగన్ తన అహాన్ని వీడి వాస్తవం గ్రహించి మెసులుకోని తీరాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-to-attend-assembly-39-192347.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.