జగన్ హయాంలో ఏమున్నది గర్వకారణం.. మూడేళ్ల చరిత్ర సమస్తం వేధింపులు, విధ్వంసం, బెదిరింపులు

Publish Date:Jun 20, 2022

Advertisement

ఏపీలో జగన్ పాలన అంతా   అంతా విపక్ష నేతల్ని వేధించడం, బెదిరించడం, వారి అస్తులను ధ్వంసం చేయడంగా కొనసాగిపోతోంది. జగన్   అధికారం వచ్చిందే తడవు  ప్రజావేదికను కూలగొట్టడంతో మొదలైన విధ్వంస పాలన తాజాగా మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు, బీసీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహారీగోడను కూల్చే దాకా అప్రతిహతంగా సాగిపోతోంది. జగన్ ప్రభుత్వంపై,  వైసీపీ నేతల అవినీతి, అక్రమాలపై   ఏ విపక్ష నేత నోరెత్తి విమర్శివంచినా వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువల నీరు తాగించడమే ఏకైక లక్ష్యంగా జగన్ పాలన సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో టీడీపీ శాసనసభాపక్షఉప నేత కింజరాపు అచ్చెన్నాయుడ్ని శ్రీకాకుళంలో అరెస్టు చేసి, అక్కడి నుంచి ఊళ్లన్నీ తిప్పి విజయవాడ తీసకువచ్చి ఇబ్బంది పెట్టిన వైనం గుర్తుండే ఉంటుంది. శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న అచ్చెన్నను అంత దూరం, గంటల పాటు కారులోనే తిప్పడంతో ఆయన తీవ్ర ఇబ్బంది పడ్డారు.

ఆ తర్వాత మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా హత్యా నేరం, కుట్ర నెపంతో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో వేసేదాకా వైసీపీ పెద్దల మనసు శాంతించలేదు. అలాగే విశాఖ లోక్ సభా స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీభరత్ కు చెందిన గీతం యూనివర్శిటీపై వైసీపీ పెద్దల కన్నుపడింది. గీతం వర్శిటీలో ప్రభుత్వ భూమి ఉందని చెప్పి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా వర్శిటీ ప్రధాన ద్వారం కూల్చివేయించింది. దాంతో పాటు గీతం వర్శిటీలో కొన్ని ఎకరాల భూమిని మార్కింగ్ చేసి, అందులో నిర్మాణాలేవీ చేయకూడదని ఆదేశించింది.

ఇక వైసీపీ సర్కార్ తప్పిదాలను ఎప్పటికప్పుడు వేలెత్తి చూపిస్తున్నారనే అక్కసుతో మాజీ ఎంపీ సబ్బం హరి విశాఖపట్నంలోని సీతమ్మధారలో నిర్మించుకున్న భవనంలోని వాచ్ మన్ బాత్ రూమ్ ను కూలగొట్టింది. జీవీఎంసీ పార్కుకు చెందిన ఆరు అడుగుల వెడల్పు మేర స్థలం సబ్బం హరి భవనం ఆవరణలో కలిసిపోయిందనే సాకును జగన్ సర్కార్ చూపించింది. విశాఖ సిరిపురంలో వీఎంఆర్ డీఏ స్థలాన్ని లీజుకు తీసుకుని టీడీపీ నేత హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ హొటల్ ను దీపావళి రోజున బలవంతంగా ఖాళీ చేయించడమే కాకుండా హొటల్ లోని వంట పాత్రలతో సహా ఫర్నీచర్ ను లారీల్లో ఎక్కించి తాళాలు వేయించింది.

విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఎమ్మెల్సీ పదవి ఆశచూపి ఆహ్వానించినా వైసీపీలోకి రాలేదనే కక్షతో గాజువాకలో ఆయన నిర్మిస్తున్న వాణిజ్య సముదాయాన్ని జీవీఎంసీ సిబ్బందితో కూలగొట్టించింది. తాజాగా వైసీపీ ప్రభుత్వం, అధిష్టానం, ఆ పార్టీ నేతలు చేస్తున్న దురాగతాలపై ఒంటికాలిపై లేచి మరీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్న చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహారీ గోడను కూలగొట్టించడం రాజకీయంగా దుమారం లేపింది. నర్సీపట్నం మున్సిపాల్టీలోని శివపురంలో అయ్యన్న పాత్రుడు రెండు సెంట్ల భూమిని ఆక్రమించారంటూ ఆదివారం తెల్లవారు జామున కూలగొట్టారు.

వైసీపీ  ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేసి, మానసికంగా కుంగదీయడమే లక్ష్యంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందనే విమర్శలు సర్వత్రా విన వస్తున్నాయి. విపక్ష నేతలను వేధించేందుకు రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖలను పావులుగా వాడుకుంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ ఎవరి నిర్మాణాలను కూల్చివేయాలనే కుట్రను శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము లోపే అమలు చేస్తుండడం గమనార్హం.

By
en-us Political News

  
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.