జగన్ వ్యూహ వైఫల్యం.. ఆ రెండు స్థానాల్లో వైసీపీ ఓటమి ఖాయం!

Publish Date:Apr 24, 2024

Advertisement

గత ఎన్నికల సమయంలో అన్నీ అలా కలిసి వచ్చిన జగన్ కు ఈ సారి మాత్రం ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో తనకు సానుభూతి సంపాదించి పెట్టిన కోడి కత్తి దాడి, బాబాయ్ హత్య ఇప్పుడు ఎదురు తిరిగి ఓటమి భయాన్ని రుచి చూపిస్తున్నాయి. పోనీ కొత్తగా సానుభూతి కోసం రాయి దాడి అంటూ హడావుడి చేస్తే అది కాస్తా సానుభూతి మాట అటుంచి నవ్వుల పాలు చేసింది. ఏపీలో ఇప్పుడు జగన్ తరహాలో కంటిపై బ్యాండేజీ పెట్టుకుని తిరగడం యూత్ లో ఒక కొత్త ట్రెండీ ఫ్యాషన్ గా మారిపోయింది. గోదారోళ్ల ఎటకారాన్ని మించిపోయింది. 

ఇవన్నీ ఒకెత్తయితే.. వ్యూహాత్మకంగా ఆయన సిట్టింగులను మార్చిన తీరు ఇప్పుడు  పలు నియోజక వర్గాలలో  వైసీపీని విజయానికి దూరం చేయడం ఖాయంగా మారింది. అలాంటి నియోజకవర్గాలలో ఇప్పుడు మాడుగుల అసెంబ్లీ, అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గాలు చేరాయి. పోలింగ్ కు ముందే ఈ రెండు నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థుల ఓటమి ఖరారైపోయిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతూ చేతులెత్తేశాయి. 

ముందుగా అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం విషయానికి వస్తే.. ఈ నియోజకవర్గం నుంచి కూటమి మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయనకు దీటైన అభ్యర్థి అని భావించి సీఎం జగన్  మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి బూడి ముత్యాల నాయుడిని అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. నియోజకవర్గం మార్పునకు బూడి ముత్యాల నాయుడిని ఒప్పించడంలో భాగంగా మాడుగుల టికెట్ ను ఆయన కుమార్తె అనూరాథకు మాడుగుల అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. 

ఫలితం ఇప్పడు ఈ రెండు నియోజకవర్గాలలోనూ కూడా వైసీపీ ఓటమి ఖాయమని ఆయన పార్టీ వర్గాలే బాహాటంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. మాడుగుల నుంచి బూడిని అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపడానికి జగన్ సామాజిక సమీకరణాలను ఆధారంగా తీసుకున్నారు. అనకాపల్లి నుంచి బరిలోకి దిగిన సీఎం రమేష్ కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన వారు. అనకాపల్లి లోక్ సభ పురిధిలో ఆ సామాజిక వర్గ ఓటర్లు నాలుగు లక్షల పై చిలుకు ఉన్నారు. దీంతో జగన్ అదే సమాజికవర్గానికి చెందిన బూడిని ఇక్కడ నుంచి బరిలోకి దింపారు.  బూడి స్థానికత ప్లస్ అవుతుందనీ, విజయానికి దోహదపడుతుందనీ జగన్ భావించారు.

అయితే అనకాపల్లిలో కాపు సామాజిక ఓటర్లు  కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఆ సామాజికవర్గ ఓటర్లు 5 లక్షల పై చిలుకు ఉన్నారు. జనసేన కూటమి భాగస్వామ్య పార్టీయే కావడం సీఎం రమేష్ కు కలిసి వచ్చింది. అంతే కాకుండా సీఎం రమేష్ కు మెగా స్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ గంపగుత్తగా ఆయనకే వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక జగన్ సర్కార్ పట్ల వ్యతిరేకత కారణంగా కొప్పుల వెలమ సామాజిక వర్గంలో  మెజారిటీ సీఎం రమేష్ కు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో  జగన్ ఎత్తుగడ ఘోరంగా విఫలమైంది. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ విజయం నల్లేరు మీద బండి నడకే అని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.

ఇప్పుడిక మాడుగుల విషయానికి వస్తే ఈ నియోజకవర్గం నుంచి బూడి ముత్యాలనాయుడు రెండు సార్లు విజయం సాధించారు. ఆయనకు నియోజకవర్గంపై గట్టి పట్టు కూడా ఉంది. అయితే  జగన్ బూడిని మార్చి ఆయన కుమార్తె అనూరాథను ఇక్కడ నుంచి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ నిర్ణయం బూడి కుటుంబంలో చిచ్చుకు కారణమైంది. తన తండ్రి స్థానం నుంచి తానే పోటీ చేస్తానంటూ బూడి కుమారుడు రవి ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగారు. పోటీ నుంచి వైదొలగడానికి ససేమిరా అంటున్నారు. ఈ పరిణామం ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండారు సత్యనారాయణ మూర్తికి ఆయాచిత లబ్ధిగా మారింది.

పెందుర్తి సీటు ఆశించిన బండారు సత్యనారాయణమూర్తి  ఆ సీటు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో చివరి నిముషంలో మాడుగుల బరిలో టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తికి లాభం చేకూరుతుంది. పెందుర్తి సీటును జనసేనకు ఇవ్వడంతో బండారు చొవరి నిముషంలో మాడుగులకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ బండారుకు వైసీపీయే విజయాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగించినట్లైంది.  జగన్ వ్యూహ వైఫల్యం అనకాపల్లి లోక్ సభ, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ పరాజయాన్ని ఖరారు చేసినట్లైందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  

By
en-us Political News

  
వైసీపీ నాయకుడు జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని,
మామూలు ఓట్లతో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది. కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద, యాభై, పాతిక, పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుంది. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది.
మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ ఇచ్చిన మాటకు పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వరన్న సంగతి ఈ ఐదేళ్ల కాలంలో పదే పదే రుజువైంది. మాట ఇవ్వడం మడమ తప్పటం అన్నది జగన్ నైజంగా జనం భావించే పరిస్థితికి వచ్చేశారు.
నార్సీ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఫస్ట్ పార్ట్.లో చెప్పడం జరిగింది. ఈ మానసిక వ్యాధిగ్రస్థులకి వుండే మరికొన్ని లక్షణాలను చూద్దాం.
మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే . గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సిఎం మనీష్ సిసోడియాకు ఇంత వరకు బెయిల్ లభించలేదు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
జగన్‌కి వున్న మానసిక వ్యాధి గుట్టు రట్టయింది.. ఆ వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’, షార్ట్‌కట్‌లో ‘నార్సీ’ అంటారు.
హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలత తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించాయి.
ఒక నాయకుడు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి మనస్సులు గెలవాలి. అయితే ఇంట్లోనే ఆయన తీరుకు, వైఖరికీ నిరసన వ్యక్తం అవుతుంటే..సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి తమ వారిని నమ్మొద్దని చెబుతుంటే ఆ నేతను జనం ఎలా నమ్ముతారు. ఎందుకు విశ్వసిస్తారు. ముందు ఇంట గెలు.. ఈ తరువాత రచ్చగెలవడం గురించి ఆలోచించు అంటారు కదా?
ఏపీ ఇన్‌ఛార్జ్ డీజీపీగా శంఖబ్రతా బాగ్చి నియమితులయ్యారు. ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి డీజీపీని నియమించేవరకు బాగ్చి డీజీపీ
చంద్రబాబు చండ్ర నిప్పులు చెరిగారు. తన స్వభావానికి విరుద్ధంగా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేసిన్పుడు కూడా ఆయన శాంతంగానే ఉన్నారు. న్యాయస్థానాలలోనే తేల్చుకుంటానని, తనపై కేసే తప్పంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఎక్కడా ఆగ్రహం ప్రదర్శించలేదు. జనాలకు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎ వేటు వేసింది. అయితే ఇప్పటికే ఆలస్యమైపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎన్నికల సంఘం తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఫిర్యాదులు, ఆరోపణలకు పూచికపుల్ల విలువ ఇవ్వకుండా ఎన్నికల సంఘం వ్యవహరించిందని అంటున్నారు.
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటిదని చెప్పవచ్చు. పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన 2019 ఎన్నికలలో కూడా ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం విజయం సాధించింది. అయితే దర్శినియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఒకింత భిన్నంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.