రాయి పడింది... ప్లాను చెడింది.. కోడికత్తి-2 కేసు తుస్సుమంది!

Publish Date:Apr 16, 2024

Advertisement

అదీ విషయం.. కోడికత్తి-2 కేసు అలియాస్ గులకరాయి దాడి కేసు తుస్సుమని, అటక ఎక్కే దారిలో పయనిస్తోంది. గత ఎన్నికల సందర్భంలో కోడికత్తి ద్వారా తన మీద తాను దాడి చేయించుకోవడం ద్వారా జగన్ మావయ్య రాజకీయంగా లాభం పొందారు. ఈసారి ఎన్నికలకు వెళ్ళే సమయానికి ఆయన ప్రభుత్వం పరువు పాతాళానికి చేరుకోవడంతో ‘కోడికత్తి-2’ డ్రామాకు తెర తీసిన జగన్ అండ్ కో ఇప్పుడు ఆ కేసును నీరుగార్చే పనిలో పడింది. అలా రాయి తగిలిందో లేదో ఇలా జగన్‌పై హత్యాయత్నం అని భారీ స్థాయిలో మీడియాలో ప్రచారం చేయడంతోపాటు, జగన్‌పై హత్యాయత్నం చేయించింది చంద్రబాబు నాయుడేనని రకరకాల కథనాలు వండి వడ్డిస్తూ వచ్చిన జగన్ అండ్ కో ఇప్పుడు వెనకడుగు వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

జగన్‌పై రాయిపడిన సంఘటనకి  ‘హత్యాయత్నం’ కలరింగ్ ఇచ్చి, దానికి  చంద్రబాబుని బాధ్యుణ్ణి చేసి రాజకీయంగా మరోసారి లాభం పొందాలని వైసీపీ వర్గాలు శాయశక్తులా కృషి చేశాయి. అయితే జనం ఈసారి జగన్ మాయలకు మోసపోవడానికి సిద్ధంగా లేకపోవడంతో వాళ్ళ చేసిన ప్రచారం అంతా తేలిపోయింది. జనంలో సానుభూతికోసమే జగన్ ఈ డ్రామా ఆడిస్తున్నాడని జనం అర్థం చేసుకుని లైట్‌గా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవర్ని కదిలించినా ఇది జగన్ ఆడుతున్న డ్రామా అని క్లారిటీగా చెబుతున్నారు. దాంతో జగన్ పథకం పారలేదు. దీనితోపాటు ఈ సంఘటనతో జగన్ మీద నెగటివిటీ పెరిగింది. ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం వుంది. ఈ నెలరోజులపాటు ‘హత్యాయత్నం, హత్యాయత్నం’ అని గగ్గోలుపెట్టి జనం సానుభూతిని పొందాలని జగన్ అండ్ కో వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈసారి జరిగే ఎన్నికలలో జగన్ పార్టీకి 40 వరకు అసెంబ్లీ స్థానాలు వస్తాయని అంచనాలుండేవని, ఈ కోడికత్తి-2 సంఘటన తర్వాత జగన్ మీద జనంలో వ్యతిరేకత మరింత పెరిగి మరో పదిస్థానాలు తగ్గిపోయాయని ఒక వైసీపీ ప్రముఖుడే వాపోయాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ కేసుని కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్‌గా తీసుకోవడంతో వాళ్ళు కేసును తవ్వి నిజానిజాలు బయట పెట్టేముందే తామే హ్యాండ్సప్ అయిపోతే మంచిదని, కేసును  క్లోజ్ చేసే దిశగా తీసుకెళ్తే మంచిదని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అందుకే పోలీసులు కొత్త కేరెక్టర్లను రంగంలోకి దించారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్ కాలనీకి చెందిన సతీష్ అనే యువకుడితోపాటు అతని మిత్రులైన ఆకాష్, చిన్నారావు, దుర్గ, సంతోష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ మీద రాయి విసిరిందని తానేనని సతీష్ అనే కుర్రాడు ఒప్పుకున్నాడు. ఇంతకీ జగన్ మీద రాయి ఎందుకు వేశావయ్యా అని పోలీసులు అడిగితే, ‘మాకు క్వార్టర్ బాటిల్, 350 రూపాయలు ఇస్తామని వైసీపీ నాయకులు ఆశపెట్టి జగన్ సభకు తీసుకొచ్చారు. తీరా వచ్చాక డబ్బు ఇవ్వకుండా మందు బాటిల్ చేతిలో పెట్టి వెళ్లిపోయారు. డబ్బులివ్వకుండా వెళ్ళిపోయారన్న కోపంతోనే జగన్‌ను రాయితో కొట్టాను’ ఇది జగన్‌పై ‘హత్యాయత్నం’ కేసులో దొరికిపోయిన నవ యువకుడు చెప్పాడు. డబ్బు ఇవ్వకపోవడంతో సదరు యువకుడికి కోపం వచ్చిందట. రోడ్డు పక్కనే వున్న ఒక రాయిని తీసుకుని జగన్ మీదకి విసిరాడట. అదీ విషయం.

నిన్నటి వరకూ అంతమంది జనాల్లో, అది కూడా లైట్లు లేని సమయంలో ఎవరు దాడి చేశారో ఎలా కనుక్కవాలి? అని చెబుతూ వచ్చిన విజయవాడ పోలీసు పెద్దలకు ఇప్పుడు ఈ 350 రూపాయల బ్యాచ్ ఎలా దొరికిందో వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు జగన్‌పై దాడి చేశాడని చెప్పిన యువకుడు, మిగతావాళ్ళ పరిస్థితి మరో కోడికత్తి శ్రీనులా అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిందే. తన కొడుకుని పోలీసులు వచ్చి పట్టుకెళ్ళారని, ఎక్కడ వున్నాడో తెలియదని సతీష్ అనే యువకుడి తల్లి లబోదిబోమంటోంది. మరి పోలీసులు సతీష్ తదితరులను మీడియా ముందు హాజరు పరుస్తారా లేక పోలీసులే ఈ కేసు గురించి, దాడి జరిగిన తీరు గురించి మీడియాకి చెప్పి చేతులు దులుపుకుంటారా అనేది చూడాల్సి వుంది. 

By
en-us Political News

  
జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఓ రేంజ్ లో ఉంది. వేసవి వడగాడ్పులు ఎన్నికల హీట్ ముందు శీతల పవనాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో ఎన్నికల పోరు మరో ఎత్తు అన్న భావన నిన్నమొన్నటి దాకా ఉండేది. ఎన్నికలు 11 రోజుల్లో జరగనున్నాయి. ఫలితాలు రావడానికి జూన్ 4 దాకా వేచి చూడాలి.
ఓయులో కరెంట్ , నీటి కటకట ఉందని ఈ కారణంగానే హాస్టల్స్ మూసి వేస్తున్నారని బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఓయు చీఫ్ వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో క్రిషాంక్ ను  చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ నుంచి పవన్ కు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఒక సారి గెలిచిన పార్టీ మరో సారి ఓడిపోతుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సహజం. అయితే ఒక్కో సారి మాత్రం ఒక ఓటమి ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. అంటే కళ్ల ముందరే ఓడలు బళ్లు అయిన దృశ్యం సాక్షాత్కరిస్తుందన్న మాట. సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలా ఉంది.
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్‌ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. 
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.