సెల్ఫ్ గోల్ దిశగా జగన్ నాలుగో అడుగు!?

Publish Date:Jan 17, 2024

Advertisement

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి వచ్చే ఎన్నికలలో  గెలుపు కోసం నేల విడిచి చేస్తున్న సాము ప్రత్యర్థుల నెత్తిన పాలు పోస్తోంది.  తన మీద ఉన్న ప్రజా వ్యతిరేకతను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆపాదించి తనకు తోచినట్లుగా వారిని బంతాట ఆడుకుంటున్నారు. జగన్ ఆడుతున్న సిట్టింగుల మార్పు, తొలగింపు ఆటకు ఒక రూల్ అంటూ ఏదీ లేదు. రిఫరీతో పనేం లేదు. తాను ఔట్ అంటే ఔట్, కాదు. మొత్తంగా  జగన్ తన కోసం తన చేత, తానే ఆడుతున్న ఈ ఆట పార్టీ పునాదులను కూల్చేస్తున్నా జగన్ కు వినోదంగానే ఉంది. సీతయ్యలా ఎవరి మాటా వినకుండా, ఎవరినీ పట్టించుకోకుండా జగన్ చేస్తున్న విన్యాసాలు.. పార్టీలో అసమ్మతిని రోజు రోజుకూ పెంచేస్తున్నాయి.

అందుకే జగన్ సిట్టింగుల మార్పు కోసం మొదలు పెట్టిన ఆట పార్టీని విజయతీరాలకు చేర్చడం కోసం అని ఆయన అనుకుంటుంటే, పార్టీ శ్రేణులు మాత్రం  జగన్ సెల్ఫ్ గోల్ చేసు కుంటున్నారని, పార్టీ పుట్టి మునగడం ఖాయమని వాపోతున్నారు.  సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలను, చివరికి కొందరు మంత్రులను కూడా పక్కన పెట్టేస్తూ, వారిపై పని రానివారనీ, పనికి రాని వారనీ, వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందనీ, జరుగుతుందనీ ముద్ర వేసి మరీ తీసిపారేస్తున్నారు.

అందుకే ఇక్కడ చెల్లని కానీ ఇంకెక్కడా చెల్లదు అంటూ జనం తమ నియోజకవర్గానికి జగన్ ఎంపిక చేసిన ఇన్ చార్జిని పట్టించుకోవడం లేదు. ఇక పార్టీలో అయితే జగన్ తీసుకొచ్చి తమ నెత్తిన కూర్చో పెడుతున్న అభ్యర్థికి వ్యతిరేకంగా ఏకంగా ఆందోళనలకే దిగుతున్నారు. మీరే అసమర్ధుడని తీసి పారేసిన వ్యక్తిని మాకు అంటగట్టి గెలిపించమంటే ఎలా అని నిలదీస్తున్నారు. ఇక తమపై అసమర్ధుడని ముద్ర వేసి పక్కన పెట్టేసిన సిట్టింగులైతే.. తమ ప్రమేయం ఇసుమంతైనా లేకుండానే నియోజకవర్గాన్ని వాలంటీర్ల చేతిలో పెట్టి, ఇప్పుడు ప్రజా వ్యతిరేకత అంటూ తమను పక్కన పెట్టేయడమేంటని నిలదీస్తున్నారు. కొందరైతే జగన్ కు ఒక దండం, వైసీపీకి ఇంకో దండం అని ముఖం మీదే చెప్పేసి తమ దారి తాము చూసుకుంటున్నారు.

మరి కొందరు బాధను, కోపాన్ని మనసులోనే దాచుకుని సమయం కోసం వే చి చూస్తున్నారు. మొత్తం మీద జగన్ సిట్టింగుల మార్పు విన్యాసం, టికెట్ దక్కని నేతలు, దక్కిన నేతలు ఇద్దరిలోనూ సమానంగా అసంతృప్తిని నింపుతోంది.  అయితే జగన్మోహన్‌ రెడ్డి మాత్రం వీటిని వేటినీ పట్టించుకోకుండా,  నాలుగో జాబితాను రెడీ చేసేశారు.  నేడో రేపో ఈ జాబితాను ప్రకటించేందుకు సిద్ధమౌతున్నారు.  ఇప్పటికే తొలి జాబితాలో 11 మందిని, రెండో జాబితాలో 27 మంది, మూడో జాబితాలో  21 మంది చొప్పును మొత్తం  59 మందికి టికెట్స్ ఖరారు చేసారు. ఇక ఇప్పుడు నేడో రేపో ప్రకటించనున్న నాలుగో జాబితాలో   ఎంతమందిని మారుస్తారు,  ఇంకెంత మందికి పార్టీ టికెట్ ఇవ్వకుండా  పక్కనపెట్టేస్తారు అన్న దానిపై పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

పార్టీ వర్గాల సమాచారం మేరకు జగన్ దాదాపు 90 మంది సిట్టింగులను మార్చేయాలని డిసైడ్ అయిపోయారు. దీంతో నాలుగో జాబితాలో తమ జాతకం ఏమిటన్న ఆందోళన సిట్టింగులలో వ్యక్తం అవుతోంది. టికెట్‌ లభించదని భయపడుతున్న వారు,లభించినా నియోజకవర్గం మారుతుందేమోనని ఆందోళన చెందుతున్న వారు తాడేపల్లి ప్యాలస్ వద్ద బెంగగా ఎదురు చేస్తున్నారు. అదే సమయంలో  వైఎస్ షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తరువాత అక్కడ తమ బెర్త్ రిజర్వ చేసుకోవడానికి ప్రయత్నాలూ ప్రారంభించేశారు. మొత్తంగా జగన్  విజయం కోసం చేస్తున్న సర్పయాగం లాంటి ఈ సిట్టింగుల మార్పు క్రీడలో ఆయన తనతో పాటు తన పార్టీని కూడా ఆహుతి చేసేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద గెలుపు మంత్రం అంటూ జగన్  సిట్టింగుల మార్పుతో  పార్టీ ఓటమికి రాచబాట పరుస్తున్నట్లుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.