కాంగ్రెస్ వైపు జ‌గ‌న్ చూపు.. ష‌ర్మిళ‌ గేమ్‌ప్లాన్ షురూ !

Publish Date:Aug 13, 2024

Advertisement

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేంద్రంలో ఇండియా కూట‌మితో జ‌త క‌ట్టేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌తో తీవ్ర ఇబ్బందులు పడిన  ఏపీ జనం తెలుగుదేశం కూట‌మికి భారీ మెజార్టీతో అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో రెండు నెల‌ల కాలంలోనే రాష్ట్రంలో అభివృద్ధి ప‌రుగులు పెడుతోంది. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపులో ఉండ‌టంతో ప్ర‌జ‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జీవ‌నం సాగిస్తున్నారు. మ‌రో వైపు అధికారంలోఉన్న స‌మయంలో పెద్ద ఎత్తున భూముల క‌బ్జాలు, అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వైసీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి సారించింది. పూర్తిస్థాయిలో ఆధారాలు సేక‌రించి చ‌ట్ట‌ప‌రంగా శిక్షించేందుకు పోలీస్ ఉన్న‌తాధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు. దీంతో వైసీపీ నేత‌లు ఒక్కొక్కరుగా జైలు కెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి భూ దందా వ్య‌వ‌హారాలు వెలుగులోకి వ‌చ్చాయి. త్వ‌ర‌లో ఆయ‌న అరెస్ట్ ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు అగ్రి గోల్డ్ భూముల వ్య‌వ‌హారంలో మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యాడు. చంద్ర‌బాబు ఇంటిపై దాడి కేసులో త్వ‌ర‌లో జోగి ర‌మేశ్, టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులోవ‌ల్ల‌భ‌నేని వంశీ.. ఇలా ఒక్కొక్క‌రుగా వైసీపీ నేత‌లు జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

 వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపైనా అనేక అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే ఆయ‌న‌పై పదకొండు కేసుల్లో సీబీఐ కోర్టులో విచారణ జ‌రుగుతోంది. ఇటీవ‌ల టీడీపీ ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణం రాజు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదైంది. కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ.. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్ర‌భుత్వంలోనూ భాగ‌స్వామిగా ఉంది. దీనికి తోడు కేంద్ర ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు నాయుడు కీల‌కంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల విష‌యంలో ఎప్పుడైనా జైలుకు వెళ్తారన్న టాక్ ఏపీ రాజకీయ వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మ‌రోవైపు వైసీపీ అధికారాన్ని కోల్పోవ‌డంతో ఆ పార్టీకి చెందిన నేత‌లు ఒక్కొక్క‌రుగా జ‌గ‌న్ కు దూర‌మ‌వుతున్నారు  అధికారం కోల్పోయిన త‌రువాత అన్నివైపుల నుంచి ముప్పు త‌రుముకొస్తుండ‌టంతో జ‌గ‌న్ అల‌ర్ట్ అవుతున్నారు. ఎన్డీయే కూట‌మి వైపుకు వెళ్లేందుకు ద్వారాలు మూసుకుపోవ‌డంతో ఇండియా కూట‌మిలో చేరితే కాస్త‌యినా జాతీయ పార్టీల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది‌. ఈ క్ర‌మంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పెద్ద‌ల‌తో జ‌గ‌న్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం శివ‌కుమార్ ద్వారా ఇండియా కూట‌మిలో భాగ‌స్వామి అయ్యేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు  సాగిస్తున్నార‌ని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగానే ఆయ‌న త‌ర‌చూ బెంగ‌ళూరు వెళ్తున్నార‌ు‌. ఇటీవ‌ల బెంగ‌ళూరు వెళ్లిన స‌మ‌యంలో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీతో జ‌గ‌న్ భేటీ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

 వారం రోజుల కిందట బెంగళూరులో రాహుల్ గాంధీతో జ‌గ‌న్ రహస్యంగా సమావేశం అయినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పాటు పలు అంశాలపై చర్చించినట్టు స‌మాచారం. అయితే, కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం చేయ‌డం కాకుండా ఇండియా కూట‌మిలో చేర‌తామ‌ని రాహుల్ తో జ‌గ‌న్ చెప్పిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. కానీ, రాహుల్ గాంధీ మాత్రం వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తేనే నీకు రాజ‌కీయంగా భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని సూచ‌న చేసిన‌ట్లు స‌మాచారం. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్ కొన్ని గొంతెమ్మ కోర్కెలు కోరగా, రాహుల్ గాంధీ వాటికి నో చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి డిమాండ్లు చేయడం వల్లే గతంలో కాంగ్రెస్ పార్టీకి దూరమైపోయి, ఇప్పుడిలా రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోయావని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా జగన్ తో అన్నట్టు సమాచారం.   స‌మ‌యం తీసుకొని మీ అభిప్రాయం చెప్పాల‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాహుల్ సూచించిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 
జ‌గ‌న్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండ‌టంలో ప్ర‌స్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఉన్న ష‌ర్మిల అల‌ర్ట్ అయ్యారు.  

ఏపీ రాజ‌కీయాల్లో జ‌రుగుతున్న మార్పుల‌కు అనుగుణంగా భవిష్యత్ ను అంచనా వేస్తూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా మరోసారి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ లో మరింత పట్టు సాధించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు‌. కాంగ్రెస్ పార్టీలో ష‌ర్మిల తీరుతో ఇప్ప‌టికే ఓ వ‌ర్గం అసంతృప్తితో ఉన్న‌ట్ల తెలుస్తోంది. వారికి చెక్ పెట్ట‌డంతో పాటు.. ఒక‌వేళ జ‌గ‌న్   కాంగ్రెస్ పార్టీతో జత‌ క‌లిసినా, వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు ఇబ్బందులు తలెత్త‌కుండా పార్టీలో త‌న వ‌ర్గాన్ని బ‌లోపేతం చేయడంపై ఆమె దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో రాష్ట్ర‌, జిల్లా స్థాయి క‌మిటీల్లో త‌న‌కు అనుకూలంగా ఉండే నేత‌ల‌కు ష‌ర్మిల ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని భావిస్తున్నారు‌. తాజాగా ఢిల్లీలో రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో ఏఐసీసీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది.. ఆసమావేశంలో పాల్గొనేందుకు షర్మిల ఢిల్లీ వెళ్లారు. పార్టీ రాష్ట్ర కమిటీల్లో తాను సూచించిన వ్యక్తులకు చోటు కల్పించాలంటూ ఏఐసీసీ నేతలకు ఆ సందర్భంగా షర్మిల పెద్ద జాబితానే సమర్పించిన‌ట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో పూర్తిగా తనకు మద్దతుదారులుగా ఉన్న నేతల పేర్లే షర్మిల పొందుపరిచారని స‌మాచారం. త‌న అనుకూల వ‌ర్గానికి పార్టీ ప‌ద‌వులు ఇప్పించుకోవ‌డం ద్వారా రాబోయే కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పార్టీలో త‌న ప‌ట్టు చేజారిపోకుండా ష‌ర్మిల వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

By
en-us Political News

  
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.