పీఎం వ‌స్తే ఎక్స్ సీఎం జంప్

Publish Date:May 3, 2025

Advertisement

రాజ‌ధాని  పునఃప్రారంభంలో క‌నీసం ట్వీటు కూడా చేయని జగన్?
ఇదేనా మీకు ఆంధ్రుల పై ప్రేమా?
ఇన్నాళ్లూ మ‌న‌ల్నో ఆంధ్ర‌ద్రోహి పాలించాడా? అంటూ జ‌నం కామెంట్లు

రాజ‌ధాని అమ‌రావ‌తి అట్ట‌హాసంగా పునః ప్రాంర‌భ‌మైంది. ప్ర‌ధాని మోడీ చేతుల మీదుగా ఈ కార్య‌క్ర‌మం అంగ‌రంగ వైభ‌వంగా  జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి  ప్రాంతంలో భారీ  ఎత్తున హ‌డావిడి క‌నిపించింది. సంద‌డి క‌ను విందు చేసింది. ఇన్నాళ్ల పోరాటం ఫ‌లించి.. రాజ‌ధాని రైతుల క‌ల సాకార‌మైంది. ఆ ఆనందం వారి క‌ళ్ల‌ల్లో ప్రస్ఫుటంగా ప్ర‌తిఫ‌లించింది. అంతే కాదు ఆంధ్ర‌ ప్ర‌జ‌లంద‌రిలోనూ.. మ‌న‌కంటూ ఒక రాజ‌ధాని వ‌చ్చిందన్న సంబ‌రం కొట్టొచ్చిన‌ట్టు కనిపించింది. మోడీ సైతం రావ‌డంతో దేశవ్యాప్తంగా అమ‌రావ‌తి పేరు మారు మోగింది.

అంతా బాగుంది కానీ ఒక్క‌టే మిస్సింగ్.. ఆ మిస్సింగ్ నెంబ‌ర్ పేరే వైయ‌స్ జ‌గ‌న్. ఈ ప్ర‌బుద్ధుడు అసెంబ్లీలో ఒక మాట. బ‌య‌ట మ‌రోమాట‌గా దాగుడు మూత‌లాడి.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ 2019లో భారీ మెజార్టీతో గెలిచి ఏపీని ఐదేళ్ల పాటు పాలించారు. క‌ట్ చేస్తే.. మూడు ముక్క‌లాట ఆడి.. అమ‌రావ‌తి ప‌రువు తీశారు. ఉసురు తీయడానికీ ప్రయత్నించారు. ఈ ప్రాంత వాసుల ఉసురు తీసినంత  ప‌ని చేశారు. వీరి త్యాగాల‌ను అప‌హాస్యం చేశారు. వీరి భ‌విష్య‌త్తుతో ప‌బ్జీ ఆడుకున్నారు.

ఈలోగా 2024 ఎన్నిక‌లొచ్చాయి. ఏక రాజ‌ధాని అమ‌రావ‌తా?  3 రాజ‌ధానులా? అన్న పందెం జ‌రిగినంత ప‌నైంది. కానీ ఈ పందెంలో మూడు ముక్క‌ల మైండ్ గేమ్.. ముక్క‌లు చెక్క‌లై.. 11 స్థానాల‌కు ప‌రిమిత‌మైంది ఫ్యాను పార్టీ. ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజ‌ధాని అమ‌రావ‌తే అన్న నినాదం ఫ‌లించి కూట‌మికి 164 సీట్లు ద‌క్కాయి. ఇంతటి విజయం రావడం ఆంధ్రుల్నే కాదు.. ఏకంగా కూట‌మి అగ్ర‌నేత‌లైన బాబు, ప‌వ‌న్, లోకేష్ లను సైతం అశ్చ‌ర్యపోయేలా చేసింది. జ‌గ‌న్ కి అయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.

ఇప్ప‌టికి ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి అటు ఇటుగా ఏడాది కావ‌స్తోంది. ఈ స‌రికే ఒక ఆత్మ‌ప‌రిశీల‌న అవ‌స‌రం. కానీ జ‌గ‌న్ లో మాత్రం అలాంటిది ఇసుమంతైనా కనిపించట్లేదు, కించిత్ కూడా ఆయ‌న త‌న ప‌రాజ‌యం ప‌ట్ల ఒక విశ్లేష‌ణ చేసుకున్న‌ట్టే  క‌నిపించ‌దు. విజేత‌ల‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం మాత్ర‌మే కాదు. తాము ఎందుకు ఓడామో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అది కూడా  వాస్త‌వ  ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టాలి. ఆ ఓట‌మిని బ‌హిరంగంగా చెప్ప‌కుంటే పోయారు.. కనీసం త‌మ‌లో తామైనా ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి. పార్టీలో అంత‌ర్గ‌తంగా అయినా ఒక రిపోర్టు త‌యారు చేసుకోవాలి. అట్ లీస్ట్ వంద‌ల కోట్ల  రూపాయ‌ల‌తో పెంచి పోషించిన బీహారీ గ్యాంగ్ నుంచైనా నివేదిక తెచ్చుకోవాలి.

ఏ నివేదిక తెచ్చుకున్నా వ‌చ్చే రిజ‌ల్ట్ రాజ‌ధాని రైతుల ఉసురు త‌గిలి శ్రీమాన్ జ‌గ‌న్మోహ‌న రెడ్డిగారు దారుణ ప‌రాజ‌యం పాల‌య్యార‌నే వ‌స్తుంది. అలా నిజాలు తెలుసుకోవ‌డం ఎంద‌ుక‌నుకున్నారో ఏమో జ‌గ‌న్ ఎలాంటి నిజ నిర్దార‌ణ చేసుకోలేదు. పోస్టుమార్టం అంత‌క‌న్నా నిర్వ‌హించుకోలేదు. ఇంకా అదే చిత్త భ్ర‌మ‌. ఇంకా అదే మాయ‌లో ఉన్న‌ట్టున్నారు పాపం ‘ఫ్రీ’వారు. అదే అదే ఫ్రీగా ప‌థ‌కాలు ఇచ్చేయ‌గానే గెలిచేస్తామ‌న్న భ్ర‌మ‌ల్లో ఉన్న జ‌గ‌న్ సార్.

అందుకే ఇప్ప‌టికి ఏడాది గ‌డిచిపోయింది. ఇంకా నాలుగేళ్లు మాత్ర‌మే. మ‌ధ్య‌లో జెమిలీగానీ వ‌స్తే రెండేళ్లే అంటూ కాకిలెక్క‌లు వేసుకుంటున్నారు. మ‌రింత ఓవ‌రాక్ష‌న్లో భాగంగా తాము అధికారంలోకి తిరిగి వ‌చ్చేసిన‌ట్టు.. ఏకంగా న‌ష్ట‌ప‌రిహారాల మిగులు బ‌కాయిలు చెల్లిస్తాన‌న్న ప్ర‌క‌ట‌న‌లు సైతం చేయిస్తున్నారు.

ఓకే.. ఆశావాదం ఎవ‌రికైనా మంచి విష‌య‌మే. ఉండాల్సిందే. కాద‌న‌డం లేదు.. కానీ అప్పుడ‌ప్పుడూ వాస్త‌వ ప‌రిస్థితుల్లో జీవించ‌డం కూడా అవ‌స‌ర‌మే క‌దా? ఇంత జ‌రిగితే సారీ త‌ప్ప‌యి పోయింది. నేను ముందు ఒక మాట అన్నాను. త‌ర్వాత మాట మార్చాను. నావ‌ల్ల ఎవ‌రైనా ఇబ్బంది ప‌డి ఉంటే క్ష‌మించండి. చెప్పుడు మాట‌లు విని మోస‌పోయాను. నేను మీ ప‌క్ష‌మే. అని చెప్పుకోవ‌చ్చు. 

స‌రే అదీ లేక పోతే పోయింది.. రాజ‌ధాని  పునః ప్రారంభ స‌మ‌యంలో క‌నీసం ఈ ప్రాంత వాసుల‌కు, అట్ లీస్ట్ రైతుల‌కైనా.. శుభాకాంక్ష‌లు చెప్పొచ్చు. కానీ జ‌గ‌న్ లో అలాంటి ల‌క్ష‌ణాలేవీ ఉన్న‌ట్టే క‌నిపించ‌దు. ఇక్క‌డుంటే అలాంటి ప‌ని చేయాల్సి వ‌స్తుంద‌నుకున్నారో ఏమో బెంగ‌ళూరు చెక్కేశారు.

ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా.. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఫిక్స‌యిపోయింది. ఈ దిశ‌గా వ‌చ్చే రోజుల్లో చ‌ట్టం చేసే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. ఎవ‌రెంత మొత్తుకున్నా.. రాజ‌ధాని హోదా నుంచి ఈ ప్రాంతాన్ని మార్చే వాడే లేడు. రేప‌టి రోజున జ‌గ‌న్ ల‌క్కు ప‌ని చేసి పొర‌బాటున అధికారంలోకి వ‌చ్చినా.. ఆయ‌న సైతం ప్ర‌జా రాజ‌ధానిని మార్చే అవ‌కాశ‌మే లేదు. అలాంటి రాజ‌ధాని విష‌యంలో ముందే మేలుకుని.. ఈ ప్రాంత రైత‌న్న‌ల‌కు, ఆంధ్ర‌ ప్ర‌జ‌ల‌కు చిన్న విష‌స్ చెప్పొచ్చు. కానీ లోకేష్ అన్న‌ట్టు ప్యాలెస్ పిల్లి.. ఈ ప్యాలెస్ నుంచి ఆ ప్యాలెస్ కి చెక్కేయ‌డంతో.. ప్ర‌స్తుతం  అంద‌రూ ఆయ‌న్న క‌సికొద్దీ తిట్టుకుంటున్న దృశ్యం క‌నిపిస్తోంది. 

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.