కూట‌మి ఐక్యతను బ‌ద్ధ‌లు కోసం జ‌గ‌న్ స్కెచ్ అదేనా?

Publish Date:Jan 28, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ తో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఐక్యంగా ముందుకు సాగుతున్నది. క్షేత్ర స్థాయిలో ఏమైనా పొరపొచ్చాలు ఉన్నా వాటిని వెంటనే సరి చేసుకుని సమష్టిగా పని చేస్తున్నది. ఇదే విషయాన్ని ఇటీవల మంత్రి నారా లోకేష్ విస్పష్టంగా చెప్పారు. కూటమికి విడాకుల్లేవని పేర్కొన్నారు. ఇక జనసేనాని అయితే లోకేష్ కంటే ముందే దశాబ్దంన్నర పాటు కలిసే ఉంటాం. ఉంటున్నాం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  వీట‌న్నిటినీ బేరీజు వేసిన తరువాతే.. వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి.. ఎన్ని పాద‌యాత్ర‌లు చేసినా నీ ప‌ప్పులు ఉడ‌క‌వ్ జ‌గ‌న్! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక‌ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి సైతం  కూట‌మి ఐక్యంగా ఉన్నంత వ‌ర‌కూ జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డం క‌ల్ల‌ అన్నారు.

ఇలాంటి సిట్యువేష‌న్ ని  కూడా ఢీ కొట్టి, డీకోడ్ చేయ‌డం అన్న‌ది  జ‌గ‌న్ కత్తిమీద సామే అంటున్నారు పరిశీలకులు.  గ‌తంలో అంటే 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్  కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి వేసిన స్కెచ్ పని చేసింది. అప్పట్లో ఆయన  ప్ర‌త్యేక హోదా అనే  అస్త్రం ప్ర‌యోగించారు. దీంతో ఎన్డీఏలోంచి టీడీపీ  బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చేసింది కూడా. కూటమి ఐక్యత దెబ్బతినడం వల్లనే 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు అందుకోగలిగారు. 2024 ఎన్నికలలో కూటమి ఐక్యత కూడా జగన్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిందనడంలో సందేహం లేదు. 

ఇప్పుడు జగన్ కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి జనసేన టార్గెట్ గా స్కెచ్ వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  జనసేనను తెలుగుదేశం నుంచి దూరం చేయడం అన్న లక్ష్యం పెట్టుకున్న జగన్ అందుకు అనుగుణంగా స్కెచ్ వేశారని అంటున్నారు.  

ఒక స్థానిక జ‌ర్న‌లిస్టు రైల్వేకోడూరు ఎమ్మెల్యే వ‌ర్సెస్ మ‌హిళ వ్య‌వ‌హారంలో చిన్న వార్త రాస్తే అత‌డ్ని బండ బూతులు తిడుతూ.. ప్ర‌శ్నించిన ఆ మ‌హిళ నోటి నుంచి ప‌దే ప‌దే వ‌చ్చిన మాట శివారెడ్డి. అంటే ఇక్క‌డ వైసీపీ నేత‌ల పాత్ర ఉంద‌న్న మాట‌. ఆపై టీడీపీ ఇన్ చా ర్జ్ ముక్కా రూపానంద‌రెడ్డిని కూడా బ‌య‌ట‌కు లాగుతూ వీడియోలు విడుద‌ల చేసిందా మ‌హిళ‌. అంటే ఇక్క‌డే అస‌లు మేట‌ర్ అర్ధం అయిపోవ‌డం లేదా? అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 

ఇక ఎమ్మెల్యే త‌ల్లి చెప్పే మాట‌ల‌ను అనుస‌రించి చెబితే.. అర‌వ శ్రీధ‌ర్ ఎమ్మెల్యే అయిన నెల రోజుల నుంచే  ఆ మహిళ ఆయన వెంట‌ప‌డింద‌ట  ఒకే కులం కాబ‌ట్టి పెళ్లి చేసుకోమ‌ని వెంట ప‌డేద‌ట‌. అంటే తొలి నాటి  నుంచీ అరవ శ్రీధర్ వారి వ్యూహంలో చిక్కాడ‌ని భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ మ‌హిళ త‌ర్వాతి  కాలంలో అంచెలంచెలుగా శ్రీధ‌ర్ కి బాగా ద‌గ్గ‌ర‌వుతూ వ‌చ్చి.. ఇప్పుడు ముప్పై కోట్లు ఇవ్వకుంటే.. బండారం మొత్తం బ‌య‌ట పెడ‌తా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నదని, వరుసగా ఒక్కో వీడియో విడుద‌ల చేస్తూ   ప్రెస్ మీట్లు పెడుతూ బెదరింపులకు దిగుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇక్కడే వైసీపీ రంగ ప్రవేశం చేసి.. ఆడ‌పిల్ల‌ల‌కు ఎవ‌రైనా ద్రోహం చేస్తే త‌ల తీసేస్తా అన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డ‌? అంటూ త‌న సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లూయెన్ష‌ర్ల ద్వారా  నానా యాగీ చేస్తున్నది. ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ పాత్ర సుస్ప‌ష్టంగా తెలుస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి ప్రచారం ద్వారా జనసేన పట్ల ప్రజలలో  వ్యతిరేకత వచ్చేలా చేసి.. టీడీపీని జనసేనకు దూరం చేయాలన్నదే జగన్ స్కెచ్ అంటున్నారు.  త‌ద్వారా 2029 ఎన్నిక‌ల నాటికి కూట‌మి ఐక్యత విచ్ఛిన్నమయ్యేలా చేయాలన్నదే వైసీపీ టార్గెట్ అంటున్నారు.  అందుకే  జనసేనాని ఇప్పటికే తమ పార్టీ కార్యకర్తలు, నేతలకు బీవేర్ ఆఫ్ వైసీపీ అంటూ ఓ హెచ్చరిక జారీ చేశారు.    అయితే అర‌వ శ్రీధ‌ర్ లాంటి కొంద‌రు బ‌ల‌హీనులు ఇలాంటి హ‌నీ ట్రాప్ లో చిక్కి.. ఇదిగో ఇలా పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారన్న పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.  

By
en-us Political News

  
ఇప్పటికే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలుగుదేశం నాయకుల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఇలా ఉండగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఇంటిని తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు ముట్టడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే నియోజకవర్గ కేంద్రాలు, మునిసిపాలిటీలలో మోటార్‌సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని నిర్ణయించారు.
ట్ జారీ చేసిన నోటీసులపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై పలు కోణాల్లో వీరు చర్చించారు. ముఖ్యంగా సిట్ కేసీఆర్ వాంగ్మూలం రికార్డు చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ తన వాంగ్మూలాన్ని ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా పార్టీని విజయం దిశగా నడిపించి ముచ్చటగా మూడో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ తహతహలాడారు. అయితే ముచ్చటగా మూడో సారి సీఎం కావాలన్న కేసీఆర్ కలలు, ఆశలు నెరవేరలేదు. మరి ఇప్పుడు కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఏమిటనుకుంటున్నారా?
వైసీపీ 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలవ్వడం, బూతు పురాణంతో డిఫేమ్ అయిన నేతలు ఒక్కరంటే ఒక్కరూ కూడా గెలవకపోవడం తెలిసిందే. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీయులు దాదాపుగా నోరు కట్టేసుకున్నారు. కేసుల భయమైతేనేం.. జనం నోరు జారితే ఇక ఊరుకోరన్న బెరుకు అయితేనేం.. నోరు తెరిస్తే దూషణలు వినా మరోకటి మాట్లాడటం చేతగాని కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారంతా సైలెంట్ అయిపోయారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ మేరకు ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నంబర్ 11 తో నెటిజనులు మరో సారి వైసీపీని ట్రోల్ చేస్తున్నారు. 11 నుంచి ప్రారంభయమ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆ 11 మందీ హాజరౌతారా? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
అంబటి సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బూతు పురాణం విప్పారు. దీనిపై తెలుగుదేశం శ్రేణులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబటి క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు.
దేశ ఆర్థిక రంగాన్ని ఇన్నేళ్లపాటు సమర్థవంతంగా నడిపించడం, స్థిరమైన, నిలకడైన నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించడం ఆమె పరిణితికి నిదర్శనంగా ప్రధాని అభివర్ణించారు. ఒకే ప్రధానమంత్రి పదవీకాలంలో తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు.
అజిత్ పవార్ మృతితో విలీనానికి బ్రేక్ పడిందన్నారు. ఇక పోతే అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా శనివారం (జనవరి 31) ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న సంగతి తనకు తెలియదన్న శరద్ పవార్, అసలు ఎన్సీపీ (అజిత్ పవార్)లో ఏం జరుగుతోందన్న విషయం తనకు తెలియదన్నారు.
ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర పవార్ ఆరు నెలలలోగా రాజీనామా చేసి బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఆమె స్థానంలో అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి.
రాజ్యసభ సభ్యురాలైన సుచిత్రా పవార్ నియమకాన్ని ఖరారు చేసేందుకు ఎన్సీపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. శనివారం మధ్యాహ్నం ముంబైలోని విధాన్ భవన్ లో జరిగే ఈ సమావేశంలో సునేత్రాపవార్ ను ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
దేశంలోనే అతి పెద్ద అవినీతి కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణాన్ని డోలేంద్ర ప్రసాద్ అభివర్ణించగా, ప్రజల ధనం, ఆరోగ్యంతో ఆటలాడిన ఈ కుంభకోణంలో నేరస్తులను చట్టం ముందు నిలబెట్టడంలో విఫలమవ్వడం కంటే దారుణం మరొకటి ఉండదని, అధిక ధరలకు చౌకబారు మద్యం అమ్మారనీ కంఠంనేని రవిశంకర్ అన్నారు.
రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల దృష్ట్యా తాను విచారణకు హాజరు కాలేననీ, సిట్ విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని ఆయన కోరారు. కాగా కేసీఆర్ అభ్యర్థనకు సిట్ అంగీకరించింది. ఫొన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ కు మరింత సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.