జ‌గ‌న్ సర్కార్ నిర్ల‌క్ష్య‌మే పోల‌వ‌రానికి శాపం

Publish Date:Jul 19, 2022

Advertisement

ఏపీలోని జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యూహాత్మక ప్రణాళికా లోపం, తగిన రీతిలో నిధులను విడుదల చేసే సామర్థ్యం లేకపోవడమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి కారణమని  కేంద్రం స్పష్టం చేసింది. సభలో తెలుగుదేశం రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి బదులిచ్చారు. పోలవరం పూర్తికి గడువు పెంచినట్లు పేర్కొన్నారు. 
ఎవ‌రన్నా ఇబ్బందిలో ఉంటే స‌హాయం కావాలంటే చేస్తాన‌నేవారు చాలా అరుదుగా దొరుకుతారు. కానీ త‌ప్ప‌కుండా స‌హాయం చేస్తామ‌న్న‌వారికి కావ‌ల‌సిన స‌మాచారం అందించ‌డంలో నిర్ల‌క్ష్యం క్షంత‌వ్యం కాదు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి అస్స‌లు క్షంత‌వ్యుడు కారు.  

పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో   అడిగిన స‌మాచారం స‌మ‌యానికి అందించ‌డంలో  జగన్ సర్కార్ నిర్లక్ష్యమే పోలవరం నిర్మాణంలో జాప్యానికి కారణమని పార్లమెంటు సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టేసింది. పోల‌వ‌రం ప్రాజెక్టును రాష్ట్రం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. కానీ ముఖ్య‌మంత్రి నిర్ల‌క్ష్య ధోర‌ణితో రాష్ట్రం కేంద్రంతో మొట్టికాయ‌లు వేయించుకుంటూ అప్ర‌తిష్ట‌పాల‌వ‌డం గ‌మ‌నిస్తున్నాం. ఉభ‌య‌ స‌భ‌ల్లోనూ దీన్ని గురించి ఎప్పుడు చ‌ర్చ త‌లెత్తినా ఎంపీల‌కు అక్షంత‌లు త‌ప్ప‌డం లేదు. ఇపుడు తాజాగా క‌న‌క‌మేడ‌ల పోలవరంపై వేసిన ప్రశ్రకి సమాధానమిస్తూ కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ మంత్రి  జగన్ సర్కార్ వైఫల్యమే పోలవరం జాప్యానికి కారణమని స్పష్టం చేశారు. ఏపీ సీఎం  నిర్వాకంతోనే అన్నీ వెన‌క్కి పోతున్నాయ‌న్న‌ది కేంద్ర మంత్రిగారి స‌మాధాన సారాంశం. 

పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి మంగళవారం రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఎంపీ క‌న‌క‌మేడ‌ల కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి బిశ్వేశ్వ‌ర తుడూను   పోల‌వ‌రం ప్రాజ‌క్టు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌ను నిర్ధారించ‌డానికి ప్ర‌భుత్వం ఏద‌యినా అంచ‌నా లేదా త‌నిఖీ చేసిందా అని ప్ర‌శ్నించారు. ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం 2014లోని నిబంధ‌న‌ల ప్ర‌కారం జాతీయ ప్రాజెక్టు హోదా పొందిన పోల‌వ‌రం నీటిపారుద‌ల ప్రాజెక్టును పూర్తి చేయ‌డంలో తీవ్ర జాప్యం జ‌రిగింది. అయితే ప్ర‌భుత్వ స‌లహా రూపంలో ఏద‌యినా స‌మాచారం ఇచ్చిందా, ఏపీ ప్ర‌భుత్వాన్ని మంద‌లించారా అని అడిగారు. అంతే కాకుండా పిఐపి(పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు) అమ‌లు చేసే ప్ర‌క్రియ‌లో దాని మిన‌హాయింపు లేదా క‌మిష‌న్ చేప‌ట్టిన చ‌ర్య‌లేమిట‌ని రాజ్య‌స‌భ‌లో క‌న‌క‌మేడ‌ల ప్ర‌శ్నించారు. అందుకు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడు లిఖిత పూర్వ‌క స‌మాధానం ఇస్తూ,ముందుగా  నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టును ఏప్రిల్ 2022 నాటికి పూర్తి చేయాలనీ అయితే అయితే ప్ర‌స్తుతం హెడ్‌వ‌ర్క్స్, కుడి ప్ర‌ధాన కాలువ, ఎడ‌మ ప్ర‌ధాన కాలువ‌ల పురోగ‌తి వ‌రుస‌గా 77 శాతం, 93 మరియు 72 శాతం  మాత్రమే పూర్తయ్యాయన్నారు. అందువలన ప్రాజెక్ట్  ఏప్రిల్, 2022 నాటికి పూర్తి చేయాలన్న గడువు దాటిపోయిందన్నారు. 

ఏప్రిల్ 2022 తర్వాత పైప్‌ల అమలుకు సంబంధించి ప్ర‌భుత్వ సమాచారం మేరకు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పిపిఏ, ప్రస్తుత నిర్మాణ షెడ్యూల్‌ను సమగ్రంగా పరిశీలించడానికి , విశ్లేషించడానికి 2021 నవంబర్‌లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తన నివేదికను ఏప్రిల్, 2022లో సమర్పించింది, జూన్, 2024 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి సవరించిన లక్ష్యాన్ని సూచించిందని కేంద్రం మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అవసరమైన రీతిలో వ్యయసామర్ధ్యం లేకపోవడం, సరైన వ్యూహాత్మక ప్రణాళికా లోపం, ప్రణాళిక లేకపోవడమే పోలవరం జాప్యానికి కారణమని స్పష్టం చేశారు. అలాగే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ సమన్వయ లోపం, కోవిడ్ సమస్యలు కూడా ప్రాజెక్టు జాప్యం అవడానికి కారణమని మంత్రి స్పష్టం చేశారు.

By
en-us Political News

  
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.