Publish Date:Aug 28, 2022
ఇంటిల్లపాదినీ సంతోషంగా జీవించేలా చూడటం ఇంటిపెద్ద కర్తవ్యం. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటూ అందరి ఆనందాన్ని కోరుకోవడం ఇంటి పెద్ద ధర్మం. ఇదే ధర్మం రాష్ట పాలకులకు వర్తిస్తుంది. ప్రజలందరినీ ప్రశాంతంగా, సంతోషంగా జీవించేలా చూడటం ప్రభుత్వం, సీఎం ధర్మం. అలాగాకుండా ప్రభుత్వమే అడ్డంకులు కల్పిస్తూ, ముఖ్యమంత్రి, అధికారులు అన్ని రకాల అడ్డంకులు పెడుతూంటే ప్రజలు ఎలా ఉంటారు. ఏపీలో రాను రాను పరిస్థితులు ప్రజాహితంగా లేవన్నది విమర్శకుల మాట. తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్ అందుకు అద్దంపడుతోంది.
ప్రజలు సంతోషంగా ఉండడం అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఇష్టంలేకుండా పోయిందని ఆయన మీడియాతో అన్నారు. దీనికితోడు పండగలు నిర్వహించుకోవాలా వద్దా అన్నది కూడా ప్రభుత్వం అనుమతి తీసుకున్నతర్వాతనే అన్నది మరీ దారుణమని ఆగ్రహించారు.
ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ వినాయకచవితికి సిద్ధపడడంలో ప్రజలు తలమునకలయ్యారు. విగ్రహాల ఏర్పాటు విషయంలో కొన్ని సాధారణ ఆంక్షలు ఉంటాయి. కానీ ఆంక్షలు హద్దులు మీరి ఉంటున్నాయన్నారు.
...
తాడిపత్రి ప్రజలు సంతోషంగా ఉండడం అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఇష్టం లేదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అధికారులు దయ దాక్షిణ్యాలతో హిందూ పండుగలు నిర్వహించుకోవాలా? అని ప్రశ్నించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతుల కోసం గంటల తరబడి యువత నిరీక్షిస్తు న్నా రని మండిపడ్డారు.
వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి నిరాకరణతో వైసీపీ పతనం మొదలైందని ప్రభాకర్ న్నారు. శాంతి భద్రతల పేరుతో వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి నిరాకరణ సరికాదన్నారు. మున్సిపల్ చైర్మన్ అయిన తనకే అనుమతి కోసం ఆయా అధికారులు చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. వినాయక విగ్రహాల ఏర్పాటు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చెయ్యి స్వామి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-rule-full-of-restriction-39-142796.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.