నవ్యాంధ్ర అభివృద్ధి జాతర....చంద్రబాబు కలలకు జగన్ పాతర

Publish Date:Apr 20, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం ఎవరికీ పట్టని బిడ్డ ఎక్కెక్కి ఏడ్చిందన్న చందంగా రెవెన్యూ లోటుతో....ఎడారిలో ఏకాకిగా మిగిలిన రాష్ట్రాన్ని నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి.....నిలబెట్టారు. తన దార్శనికతతో....సంపన్న రాష్ట్రాలతో పోటీగా అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి  నిర్మాణం కోసం భూమి సమీకరణకు శ్రీకారం చుట్టారు. అప్పటి వరకూ ఎవరూ ఎన్నడూ చేయని రీతిలో ఆయన తలపెట్టిన భూ సమీకరణకు రైతుల నుంచి అపూర్వ స్పందన లభించింది. చంద్రబాబుపై నమ్మకంతో, రైతులు  దాదాపు 33వేల ఎకరాలను భూ సమీకరణ పద్ధతిలో ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో తనపై ప్రజా నమ్మకమే పెట్టుబడిగా....ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి నవ్యాంధ్రలో శ్రీకారం చుట్టారు.  ఇప్పటి అవసరాలే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా ఆదాయ వనరుగా అమరావతిని తీర్చిదిద్దేలా ప్రణాళికలు అమలు చేశారు. సంక్షోభాన్ని సదవకాశంగా, సవాళ్లను  దీటుగా ఎదుర్కొన్న నేత చంద్రబాబు. 
అయితే ఆయన తరువాత అధికారంలోనకి వచ్చిన జగన్ సర్కార్ రాజకీయ కారణాలతో అమరావతి నిర్మాణాన్ని  మూడు ముక్కలాట పేరుతో మూలకు నెట్టేశారు. అయితే ఆయన తరువాత అధికార పగ్గాలు చేపట్టిన జగన్ తన విధానాలు, కక్షపూరిత వైఖరితో అభివృద్ధికి పాతర వేసే ధోరణిలో ముందుకు సాగుతున్నారు. 

 ఆదాయ వనరులు లేని, రెవెన్యూలోటుతో ఆవిర్భవించిన రాష్ట్రాన్నిఏడాది వ్యవధిలోనే రెండం కెల వృద్ధికి తీసుకు వచ్చారు. చంద్రబాబు ఆర్థికాభివృద్ధితో సంపన్న రాష్ట్రాలతో పోటీపడే స్థాయికి ఎదిగిన రాష్ట్రం ఇప్పటి ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. శ్రీలంక బాటలో పయనిస్తూ దివాళా అంచున నిలిచింది.
ఇక నవ్యాంధ్రకు జీవనాడిగా భావించే పోలవరం నిర్మాణంలోనూ ఆయన తనదైన వేగం, చొరవ చూపారు. కేంద్రం నుంచి మద్దతు లేకపోయినా, నిధులు అందకపోయినా వెనక్కు తగ్గలే. ఐదేళ్ల వ్యవధిలో దాదాపు 73శాతం నిర్మాణ పనులను పూర్తి చేయించారు. ఇందు కోసం పేద రాష్ట్రమే అయినా వెరవకుండా  నిధులు వెచ్చించారు. ప్రతి సోమవారం విధిగా పోలవరం సందర్శన యాత్ర చేసి పనులను పర్యవేక్షించారు. ఆయన స్వీయ పర్యవేక్షణ కారణంగా దేశంలో చివరి బహుళార్ధసాధక ప్రాజెక్టు అయిన పోలవరం దాదాపు పూర్తయ్యే స్థితికి వచ్చింది. అయితే తరువాత అధికారంలోనికి వచ్చిన వైసీపీ సర్కార్ పుణ్యమా అంటూ నిర్మాణ వేగం కుంటుపడింది.  పెరిగిన అంచనాల మేరకు వ్యయం భరించలేమంటూ.... పోరుగు రాష్ట్రాల ఒత్తిడికి తలొగ్గి పోలవరం ఎత్తును తగ్గించి రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు వైసీపీ సర్కార్ సిద్ధపడుతోంది.

పరిశ్రమలే లేని విభజిత ఆంధ్రప్రదేశ్ అధినేతగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రంలోనికి పెద్ద ఎత్తున పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కంటే స్టేట్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా దావోస్ ఆర్థిక సదస్సులో పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరిపి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తరలిరావడానికి దోహదం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మక కియారా కార్ల తయారీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందంటే అందుకు చంద్రబాబు చొరవు, శ్రమే కారణం.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా  హైదరాబాద్ ఐటీ హబ్ గా అభివృద్ధి చెందడానికి కారకుడై చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరి, విశాఖలలో ఐటీ పరశ్రమలకు కేంద్రాలు మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఆయన కార్యాచరణతో మంగళగిరి హైదరాబాద్ కు దీటుగా ఐటీ కేంద్రంగా రూపుదిద్దుకునే దిశగా అడుగులు పడ్డాయి. పలు స్టార్టప్ లు తమ కార్యకలపాలను ప్రారంభించాయి. అయితే కొత్త ప్రభుత్వం తీరుతో ఆ పరిశ్రమలన్నీ వెనక్కు మళ్లాయి. 
ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ణానాన్ని పాలనను ప్రజలకు చేరువ చేయడానికి చంద్రబాబు వినియోగించుకున్న తీరు ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రశంసలను అందుకుంది. చంద్రబాబు రియల్ టైమ్ గవర్నెన్స్ ప్రజాసమస్యలను నేరుగా ఎప్పటికప్పుడు స్వయంగ పర్యవేక్షించేందుకు వీలు కల్పించింది. రాష్ట్రంలో ఏ మూల కరెంట్ పోయినా వెంటనే డ్యాష్ బోర్డులో తెలసపోయేలా సాంకేతిక పరిజ్ణానాన్ని  పాలనను మెరుగు పరచేందకు చంద్రబాబు వినియోగించుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు...ఇలా ఒకటేమటి....ప్రజాసమస్యలన్నిటిపైనా  వెంటవెంటనే పరిష్కరించేందుకు రియల్ టైమ్ గవర్నెన్స్ సాంకేతిక దన్ను ఇచ్చింది.

ప్రస్తుత ప్రభుత్వం ఉచిత పందేరాలతో రాష్ట్రాన్ని దివాళా దిశగా నడుపుతుంటే....ఎనిమిదేళ్ల కిందటే చంద్రబాబు పేదలకు ఉచితంగా సొమ్ము ముట్ట చెప్పడం కాదు....సంపాదించుకునేందుకు ఉపాధి మార్గాలు చూపాలన్న ఉద్దేశంతో పథకాలకు రూపకల్పన చేశారు. అభివృద్ధి ద్వారా పెరిగి సంపద ఫలాలు అట్టడుగు వర్గాలకుఅందినప్పుడే నిజమైన అభివృద్ధి అని నమ్మి ఆ దిశగా ముందుకు సాగారు. ఆ కారణంగానే గ్రామీణ, పట్టణ ప్రాంతలన్న బేధం లేకుండా విభజత ఆంధ్రప్రదేశ్ లో పేదలకు పుష్కలంగా పనులు దొరికాయి. పరిశ్రమలు కళకళలాడాయి. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. జగన్ రెడ్డి విధానాల కారణంగా రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నాయి. కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఇసుక విధానం కారణంగా నిర్మాణ రంగం కుదేలైంది. వ్యవసాయ రంగం నర్వీర్యమైంది.  బాబు హయాంలో అభివృద్ధి పరుగులు పెడితే జగన్ హయాంలో తిరోగమన దిశలో పయనిస్తున్నది.

రాజకీయంగా చంద్రబాబుతో విభేదించా వారు కూడా అభివృద్ధి విషయంలో ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని అంగీకరిస్తారు.  అభివృద్ధి అంటే కేవలం రోడ్లు భవనాలే కాదు...ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు దోహదపడే వధంగా అభివృద్ధి ఫలాలు అర్హులకు అందడం. చంద్రబాబు టెన్యూర్ లో అదే జరిగింది. 

By
en-us Political News

  
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.