క్విడ్ ప్రోకొ వద్దు.. క్విట్ జగన్!

Publish Date:Aug 12, 2024

Advertisement

క్విడ్ ప్రొకో.. జగన్ కు తన వ్యాపార విస్తరణకే కాదు, రాజకీయాలలోనూ బాగా అచ్చి వచ్చింది. క్విడ్ ప్రొకో అండతోనే జగన్ కోట్లకు పడగలెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రీ కాగలిగారు. ఇప్పుడు విపక్షంలో కూడా తనను తాను కాపాడుకోవడానికి క్విడ్ ప్రొకోనే నమ్ముకున్నారు. ఔను ఇటీవలి ఎన్నికలలో జగన్ పార్టీ అత్యంత అవమానకరమైన ఓటమిని అందుకుంది. 2019 ఎన్నికలలో 151 స్థానాలతో తిరుగులేని విజయాన్ని అందుకున్న జగన్.. 2024 ఎన్నికలలో మాత్రం కేవలం 11 స్థానాలకు పరిమితమై కనీసం విపక్ష నేత హోదాకు కూడా నోచుకోలేదు.  

ఇప్పుడు  రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తిరుగులేని నేతగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అంతే కాకుండా కేంద్రంలో కూడా ఆయన మాటకే ఎక్కువ చెల్లుబాటు ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ మనుగడ తెలుగుదేశం పార్టీ మద్దతుపైనే ఆధారపడి ఉంది. దీంతో జగన్  పరిస్థితి దయనీయంగా మారింది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ బీజేపీతో అంటకాగి, రాష్ట్ర ప్రయోజనాలను ఆ పార్టీ అగ్రనాయకత్వం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ జాప్యం చేసుకోగలిగారు. ఇప్పుడు పార్టీ ఘోర పరాజయం తరువాత కూడా బీజేపీకి రాజ్యసభలో సరిపడినంత బలం లేదు కనుక అనివార్యంగా తమ పార్టీ మద్దతు కోసం తన డిమాండ్లకు తలఒగ్గుందని భావించారు. అందుకే లిట్మస్ టెస్ట్ చందంగా లోక్ సభలో బీజేపీ ప్రవేశ పెట్టిన వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును వ్యతిరేకించి ఒక సంకేతం పంపారు.

లోక్ సభలో వైసీపీ వ్యతిరేకించినా ఆ బిల్లు ఆమోదానికి ఎటువంటి ఢోకా ఉండదు. ఆ విషయం స్పష్టంగా తెలిసిన జగన్ రాజ్యసభలో బిల్లును వ్యతిరేకించకుండా ఉండాలంటే తనకు కొన్ని కండీషన్స్ ఉన్నాయని విజయసాయి రెడ్డి ద్వారా అమిత్ షాతో రాయబారం నడిపారు.  అటునుంచి సానుకూల స్పందన వచ్చినట్లు లేదు. సరే ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు వచ్చే నెలలో 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో మెజారిటీ స్థానాలు ఎన్డీయే అభ్యర్థులే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఇక రాజ్యసభలో వైసీపీ మద్దతుపై ఆధారపడాల్సిన అవసరం మోడీ సర్కార్ కు ఉండదు.  ఎందుకంటే ప్రస్తుతం రాజ్యసభలో 241 మంది సభ్యులు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనందున నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక ఇటీవల 9 రాష్ట్రాలలో 12 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుల సంఖ్య 229.   వీరిలో బీజేపీ సభ్యులు 87 మందితో కలుపుకుని ఎన్డీయే సభ్యుల బలం 105. నామినేటెడ్ సభ్యులు ఆరుగురితో కలుపుకుని మొత్తం ఎన్డీయే బలం 111.  

రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే మోడీ సర్కార్ కు మరో నలుగురు సభ్యుల మద్దతు అనివార్యం. వచ్చే నెలలో 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో కనీసం 11 స్థానాలలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే రాజ్యసభలో ఎన్డీయే బలం 122కు చేరుతుంది. అంటే ఎన్డీయేకు సొంతంగా అవసరమైన బలం చేకూరుతుంది. అప్పుడు బీజేపీకి వైసీపీ సభ్యుల మద్దతుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభలో వైసీపీ అనుసరించే విధానం ఏమిటన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. 

By
en-us Political News

  
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.