నేషనల్ మీడియా ముందు చేతులెత్తేసిన జగన్!

Publish Date:May 4, 2024

Advertisement

ఏపీలో జగన్ ఖేల్ ఖతమ్ అయిపోయింది. ఇక తట్టా బుట్టా సర్దుకుని జైలుకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవడమే. ఈ విషయం ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. సాక్షాత్తూ జగన్ ముఖం చూస్తే చాలు. ఆయన ముఖంలో ఓటమి కళ అరచేతి మందంలో కనిపిస్తోంది. జగన్ మాటల్లో ఈ వాస్తవం డీటీఎస్‌లో వినిపిస్తోంది. ఈ విషయంలో ఇంకా ఎవరికైనా డౌట్స్ వుంటే, శుక్రవారం నాడు నేషనల్ మీడియా టైమ్స్ నౌలో సీనియర్ లేడీ జర్నలిస్టు నవికా కుమార్‌కి జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూడవచ్చు. ఈ ఇంటర్వ్యూలో జగన్ ఆద్యంతం ఏడుపు ముఖంలో, ఓటమి కన్ఫమ్ అయిపోయిన ఎక్స్.ప్రెషన్‌తో కనిపించారు. 

ఇంటర్వ్యూలో జర్నలిస్టు నివకా కుమార్ ఒక్కో ప్రశ్న సంధిస్తుంటే జగన్ తెల్లముఖం వేసుకుని, సమాధానాలు చెప్పడానికి నానా తంటాలూ పడ్డారు. ఒక సందర్భంలో జగన్ ఆమె ప్రశ్నకు సమాధానంగా- ‘‘మీరు నా స్థానంలో వుంటే అర్థమవుతుంది’’ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. దానికి నవికా కుమార్ చురుగ్గా స్పందిస్తూ, ‘‘దేవుడి దయవల్ల నేను మీ స్థానంలో లేను’’ అన్నారు. దాంతో షాకైపోవడం జగన్ వంతు అయింది.

జగన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తనను జైల్లో వేయడం దగ్గర నుంచి ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి తనకు వ్యతిరేకంగా పని చేస్తూ వుండటం వరకు... తాను ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ చంద్రబాబే కారణం అని చెబుతుంటే నవికా కుమార్ జగన్‌ని ఇదేంట్రా బాబూ అన్నట్టు చూస్తూ, మీరు ప్రతీదానికీ చంద్రబాబే కారణం అంటున్నారు అని వెటకారంగా అన్నారు. దానికి మన జగన్ సార్ ఒక వెర్రి నవ్వుతో ప్రతిస్పందించారు.

రాహుల్ గాంధీ గురించి జగన్‌ని నవికా కుమార్ ప్రశ్నించినప్పుడు జగన్ దిక్కులు చూస్తూ, వెర్రినవ్వులు నవ్వుతూ వుండటంతో ఆమె ‘‘నవ్వడం కాదు.. సమాధానం చెప్పండి’’ అన్నారు. జగన్ ఓ సందర్భంలో నేషనల్ పాలిటిక్స్ గురించి తనకు అంతగా అవగాహన లేదు అన్నారు. అప్పుడు నవికా కుమార్ జగన్‌ని శుద్ధ మొద్దుని చూసినట్టు చూసి, ‘‘ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వున్న మీరు నేషనల్ పాలిటిక్స్ గురించి పట్టనట్టు వుండటం కరెక్టుగా లేదు’’ అంటూ కామెంట్ చేశారు. అయినా మనసార్ ఒక వయ్యారపు నవ్వు విసిరారు.

ఇంటర్వ్యూ ప్రారంభంలోనే ఈ ఎన్నికలలో మీకు ఎన్ని సీట్లు వస్తాయి అని నవికా కుమార్ అడిగితే, జగన్ జీవం లేని నవ్వు నవ్వుతూ ‘స్వీప్ చేస్తాం’ అన్నారు. నవీ కుమార్ మరోసారి రెట్టించి అడిగితే, ‘స్వీప్ చేస్తాం’ అని మరోసారి అన్నారు. ఆ ‘స్వీప్’ గెలుపు స్వీప్‌లా అనిపించలేదు.. చీపురు పట్టుకుని చేసే స్వీప్‌లా అనిపించింది.

జగన్ మాటమాటకీ, షర్మిల నా కుటుంబం పరువు తీస్తోంది అని అన్నప్పుడు, అది మీ కుటుంబం మాత్రమే కాదు.. షర్మిల కుటుంబం కూడా అని నవికా కుమార్ చురక వేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఆయన వారసత్వం కావచ్చు.. అది మీకు మాత్రమే కాదు.. షర్మిలకు కూడా సమానంగా దక్కుతాయి అని నవికా కుమార్ అన్నప్పుడు జగన్ ముఖం చూడాలి. అబ్బో... ఆ ఎక్స్.ప్రెషన్ ఇవ్వడం ఆయనకి తప్ప మరొకరికి రాదు.

మీరు ఐదేళ్ళుగా అధికారంలో వుండి మీ బాబాయి హత్య కేసులో ఎలాంటి పురోగతి ఎందుకు సాధించలేదు అంటే, ఏదేదో సంబంధం లేని సమాధానం చెప్పి దాటవేశారు. మొత్తమ్మీద నవికా కుమార్ అడిగిన ప్రశ్నలకు జగన్ చెప్పిన సమాధానాలు తక్కువ.. సాగదీసింది ఎక్కువ. వెంట వెంటనే సమాధానాలు చెబితే, ఇంకో ప్రశ్న దూసుకొస్తుందన్న భయంతో జగన్ లాగీ లాగీ సమాధానం చెప్పారు. అలా టైమ్ కిల్ చేయగలిగారు.

పాపం జగన్‌కి ఇంకో దరిద్రం ఏమిటంటే, ఇంటర్వ్యూ నడిచినంతసేపూ బ్యాక్ గ్రౌండ్లో చంద్రబాబు విజయోత్సాహంతో ప్రచారం చేస్తున్న క్లిప్పింగ్స్, మోడీ ప్రచారం చేస్తున్న దృశ్యాలు, షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్న దృశ్యాలు, షర్మిల ప్రచారం చేస్తున్న చూపించారు. జగన్ ప్రచారం చేస్తున్న విజువల్స్ కొద్ది క్షణాలు మాత్రమే చూపించారు. 

మొత్తమ్మీద నీర్సంగా, అన్యమనస్కంగా, జిడ్డుకారుతున్న ముఖంతో, జీవం లేని నవ్వుతో, బిత్తర చూపులతో, క్లారిటీ లేని సమాధానాలతో సాగిన ఈ ఇంటర్వ్యూ ఇక జగన్ ఓటమి పక్కా అని కన్ఫమ్ చేసింది.

By
en-us Political News

  
ఈ సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీకి వేవ్ లేదని రాక్ ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర శర్మ అభిప్రాయపడ్డారు. ఈ వేవ్ లెస్ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేనలను ఎన్డీయేలోకి చేర్చుకోవడం ద్వారా బీజేపీ బోలెడంత రాజకీయ లబ్ధి పొందిందని ఆయన అన్నారు.
తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. టీఎస్ పేరును టీజీగా మారుస్తామని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని కేంద్రం సైతం అంగీకరించింది. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు టీజీ పేరును ఇస్తున్నారు. ఈ మార్పులతో తాజాగా టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చారు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. అరాచకాలు, అకృత్యాలు, దాడులు, ఈవీఎంల విధ్వంసం ఇలా ఆయన చేయని దారుణం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
చైనా భారత్ సరిహద్దు వివాదం చాలాకాలంగా నలుగుతూనే ఉంది. అయితే డ్రాగన్ దేశం భారత్ పై విషం చిమ్ముతూనే ఉంది. తాజాగా చైనా భారత్ మీద మరో అఘాయిత్యానికి పాల్పడింది. భారత పౌరుల చేత భారత్ మీదే సైబర్ నేరాలకు పాల్పడాలన్న చైనా  కుట్ర భగ్నమైంది. 
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 4న జరుగుతుంది. అయితే ఇప్పటికే కూటమి గెలుపుపై సర్వత్రా ఒక నమ్మకం అయితే ఏర్పడిపోయింది. అధికారికంగా ఫలితం వెలువడే వరకూ ఒకింత ఉత్కంఠ తప్పదు. కానీ గెలుపు గుర్రాలు ఏవీ, పరాజయం పాలై పలాయనం చిత్తగించేది ఎవరు అన్న విషయంలో రాష్ట్రంలో ఎన్నికలపై జరుగుతున్న బెట్టింగులను బట్టి సులువుగానే అర్ధం అవుతున్నది.
పెద్దలు సాధారణంగా నాలుగు రాళ్ళు వెనకేసుకోమంటారు. కానీ చాలామంది కడుపులో రాళ్ళు పెంచుకుంటున్నారు
జాతీయ ప్రజాస్వామ్య కూటమి అంటే నేషనల్ డెమక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఎ). ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్’పేయి సారధ్యంలో 24 పార్టీల కూటమిగా కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఎకు ఇప్పుడు మోడీ పదేళ్ల పాలనలో ఎన్డీయేకూ అసలు పోలికే లేదు. ఇప్పుడు ఎన్డీయేలో సింగిల్ సీట్ పార్టీలు తప్ప మరేమీ మిగలలేదు. తాజాగా ఎన్నికల ముందు కూటమిలో చేరిన తెలుగుదేశం, జనసేన వినా ప్రస్తుతం ఎన్డీయేలో చెప్పుకోదగ్గ పార్టీ లేదని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
ఏపీలో వైసీపీ నేత‌ల రాజ‌కీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. వారి త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబును అడ్డుపెట్టుకోవ‌టం వారికి అల‌వాటుగా మారింది. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త ఐదేళ్లుగా ఇదే ప‌ని చేశారు.
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. నియోజకవర్గ పరిధిలోని తంబిగాని పల్లెలో తెలుగుదేశం వర్గీయులపై దాడికి తెగబడ్డాయి.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవలు ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల వేంకటేశ్వరుని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం పేరు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. నియోక‌వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి అరాచ‌కాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ఏపీలో పోలింగ్ రోజు నియోజ‌క‌వ‌ర్గంలో పిన్నెల్లి సోద‌రులు, వారి అనుచ‌రులు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు, కార్య‌కర్త‌ల‌పై దాడులకు తెగ‌బ‌డి భ‌య‌ బ్రాంతుల‌కు గురిచేశారు.
పిరికి పిల్లి పిన్నెల్లి చేసిన పాపాలకు కనీసం ఏడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. ఆయన రాక కోసం సెంట్రల్ జైలు గేటు ఎదురుచూస్తోంది.
మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కీలక నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బుధవారం పంపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.