జగన్‌ ఖేల్ ఖతమయ్యేదే.. జస్ట్ మిస్....

Publish Date:Apr 16, 2015

Advertisement



పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులకు ఎలా ఆటంకం కలిగించాలా ఆన్న ఆలోచనలో ప్రస్తుతం  వైసీపీ అధినేత జగన్ వున్నారు. దానికోసం తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతంలోని ప్రజల మనసుల్లో విషం నింపే ప్రయత్నాన్ని మొదలెట్టారు. దానికోసం ప్రాజెక్టుల యాత్రని చేపట్టారు. అయితే మంగళవారం నాడు వైసీపీలో జరగాల్సిన పరిణామాలు చివరి క్షణంలో ఆగిపోయాయి. ఆ పరిణామాలే కనుక జరిగి వుంటే, జగన్ పొలిటికల్ ఖేల్ ఖతమ్ అయిపోయి వుండేది. అప్పుడాయన ప్రాజెక్టుల యాత్రని పక్కన పెట్టి, రాజకీయ పతన యాత్రని  చేయాల్సి వచ్చేది. అసలింతకీ చివరి క్షణంలో ఆగిపోయిన ఆ పరిణామాలేంటి?

జగన్ వ్యవహార శైలి ఆ పార్టీలో వున్న ఎమ్మెల్యేలకు మొదట్నుంచీ నచ్చడం లేదు. జగన్ నుంచి దూరంగా పారిపోవాలన్న ఆలోచనలు ఎమ్మెల్యేలలో ఎప్పటి నుంచో వున్నాయి. ఈమధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేస్తు్న్న అడ్డగోలు పోరాటం చాలామంది ఎమ్మెల్యేలకు ఎంతమాత్రం నచ్చడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలుగా వున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితిల్లో జగన్‌ వెనుక నిలబడి అరుస్తున్నారు అంతే! ఇటీవలి కాలంలో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల విషయంలో జగన్ తీరు వారికి ఎంతమాత్రం మింగుడు పడటం లేదు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రాజెక్టుల విషయంలో జగన్ వైఖరిని బాహాటంగానే ఖండించారు. జగన్ వ్యవహారశైలితోపాటు, ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియని వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం చాలామంది ఎమ్మెల్యేలకు ఇబ్బందిగానే వుంది. వైసీపీ నుంచి విముక్తి లభించే ముహూర్తం ఎప్పుడొస్తుందా అని వారంతా ఎదురుచూస్తున్నారు.

ఆ దివ్యమైన ముహూర్తం మంగళవారం నాడు రానే వచ్చింది. మంగళవారం నాడు జగన్ ప్రాజెక్టుల వ్యతిరేక యాత్ర కోసం బస్సు ఎక్కి వెళ్ళగానే, వైసీపీకి మంగళం పలుకుదామని 40 మంది ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. జగన్ బస్సు యాత్రకి సన్నాహాలు చేసుకుంటూ వుంటే, ఈ 40 మంది ఎమ్మెల్యేలు పార్టీనుంచి బయటకి వెళ్ళిపోయే సన్నాహాలు ముమ్మరం చేసుకున్నారు. జగన్ అలా బస్సు ఎక్కగానే ఇలా పార్టీని చీల్చేసే ఏర్పాట్లు చేసుకున్నారు. వైసీపీకి ఉన్న మెజారిటీలో సగానికి పైగా వున్న ఈ 40 మంది జగన్‌కి జలక్‌ ఇచ్చారంటే అది జగన్‌కి రాజకీయంగా పెద్ద షాక్. ఆయన పెట్టిన పార్టీ ఆయన చేతుల్లోంచి జారిపోయే అవకాశాలు కూడా వున్నాయి.

తమ పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది తనకు షాక్ ఇవ్వబోతున్నారన్న విషయం ఎలా తెలిసిందోగానీ జగన్‌కి తెలిసింది. దాంతో ఆందోళనకు గురైన ఆయన ఆ ఎమ్మెల్యేలతో టచ్‌‌లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. అయితే వాళ్ళు తమకు జగన్ని కలిసే ఉద్దేశం లేదని, పార్టీని చీల్చడం ఖాయమని సంకేతాలు ఇచ్చారు. దాంతో జగన్ ఆపద్బంధువు వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగి 40 మంది ఎమ్మెల్యేల కాళ్ళూ గడ్డాలూ పట్టుకుని జగన్‌కి వారికి భేటీని ఏర్పాటు చేశారు. ఆ భేటీలో జగన్ వాళ్ళని ప్రాధేయపడిన తీరు చూస్తే శత్రువులకు కూడా కన్నీరు వచ్చేదట. ఆ స్థాయిలో బతిమాలడంతో ఆ 40 మంది ఎమ్మెల్యేలు శాంతించి తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నామని చెప్పారట. మీరు తలపెట్టిన ప్రాజెక్టుల యాత్ర పూర్తి చేసుకుని రండి... మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అన్నారట. అప్పటికీ జగన్‌కి భయం తగ్గలేదు. తాను అలా బస్సు ఎక్కి వెళ్ళగానే, ఇక్కడ వీళ్ళు ఇలా ప్లేటు ఫిరాయిస్తే ఎలా అనే సందేహం ఆయన్ని పీడించింది. దాంతో ఆ 40 మంది ఎమ్మెల్యేలు కూడా తనతోపాటు ప్రాజెక్టుల యాత్రకి రావాల్సిందేనని బతిమాలి ఒప్పించాడట. ఇలా జగన్‌కి ప్రస్తుతానికి ఒక గండం గడిచింది. వైసీపీలో బద్దలు కాబోయే అగ్ని పర్వతం ప్రస్తుతానికి శాంతించింది. ఆ అగ్నిపర్వతం ఎప్పటికైనా బద్దలయ్యేదే!

By
en-us Political News

  
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.