ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సారి పరామర్శ యాత్రలకు శ్రీకారం చుట్టనున్నారు. తాజాగా ఆయన రెండు రోజుల పాటు పరామర్శయాత్రకు రెడీ అయిపోయారు. ఔను ఆయన బుధ, శుక్రవారాలలో రాష్ట్రంలో పరామర్శ పర్యటన చేస్తారు. బుధవారం గుంటూరు, శుక్రవారం ఇబ్రహీం పట్నం లలో ఆయన పరామర్శ యాత్రలు ఉండనున్నాయి. ఈ యాత్రలలో భాగంగా ఆయన గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను, శుక్రవారం ఇబ్రహీంపట్నలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు అధికారికంగా తెలిపాయి.
జగన్ అంబటి, జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రెడీ అవ్వడంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయి. అరెస్టైన నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులన పరామర్శించడం ఓకే.. అసెంబ్లీకి వచ్చి ఇదే అంశాలపై మాట్లాడడానికి జగన్ కు ధైర్యం ఉందా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. అంబటి, జోగి రమేష్ ల విషయాన్ని అసెంబ్లీలో జగన్ ప్రస్తావిస్తే అసలు బండారం బయటపడుతుందన్న భయం జగన్ ను వెంటాడుతోందంటున్నారు. అయినా జగన్ పరామర్శయాత్రలంటే జనం భయంతో వణికిపోతున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఉదహరిస్తున్నారు. పరామర్శల పేరుతో జగన్ చేసే పర్యటనల అసలు లక్ష్యం శాంతి భద్రతల సమస్య సృష్టించడమేనని విమర్శిస్తున్నారు.
గతంలో గుంటూరు, అనంతపురం, సత్య సాయి జిల్లాలో ఆయన పర్యటన చేసినప్పుడు జరిగిన సంఘటనలను ఉదహరిస్తున్నారు. అసలే ఉద్రిక్తతలు నెలకొన్న గుంటూరు, ఇబ్రహీంపట్నంలో జగన్ పరామర్శ యాత్ర శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పరామర్శల పేరుతో శాంతికి భంగం కలిగించే కంటే.. ఈ నెలలోనే జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై తిరుమల ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి సహా అన్ని అంశాలపై చర్చిస్తే మేలన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-paramarsa-yatralu-again-39-213432.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!