జగన్ పాదయాత్రను పూర్తిచేస్తారా..? మధ్యలో ఆపేస్తారా..?

Publish Date:Nov 14, 2017

Advertisement

ఆరునూరైనా 2019లో అధికారాన్ని అందుకోవాలి.. ఇప్పటికే వీధి పోరాటాలు, రోడ్ల మీద బైఠాయింపులు అన్నీ అయిపోయాయి. ప్రజలు తన గురించే మాట్లాడుకోవాలి.. తన పేరు జనం నోట్లో నానాలంటే ఏం చేయాలి. వీటన్నింటికి సమాధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత ఎంచుకున్న మార్గం పాదయాత్ర. సీఎం అవ్వడమే లక్ష్యంగా.. రాష్ట్రం మొత్తం చుట్టివచ్చేలా సుమారు ఆరు నెలల పాటు మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయాలని జగన్ నిర్ణయించారు. ఆయన నిర్ణయం వెనుక బలమైన కారణాలున్నాయి. రాష్ట్ర చరిత్రలో పాదయాత్రలకు ప్రత్యేక స్థానం ఉంది. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాగించిన "ప్రజా ప్రస్థానం" పాదయాత్రతో ప్రజల మన్ననలు పొంది సీఎం అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన వయసును సైతం లెక్క చేయకుండా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఆయనా సీఎం అయ్యారు.

 

ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అయి తాను కూడా ముఖ్యమంత్రిని కావాలని భావించారు జగన్. దీనిలో భాగంగా ఈ నెల 6న ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అయితే ఆయన ఆరు నెలల కాలంలో అన్ని అవాంతరాలను దాటుకొని.. అనుకొన్న లక్ష్యాన్ని అందుకోగలరా అన్న సందేహన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.. అందుకు కారణాలు లేకపోలేదు.. యాత్ర ప్రారంభించి నేటికి తొమ్మిదో రోజు.. ఇవాళ్టీకి ఆయన 100 కిలోమీటర్ల మైలు రాయిను అందుకున్నారు. ఇంత నత్తనడకన ఆయన పాదయాత్ర సాగుతోంది.. తొలుత యాత్రను చాలా తేలిగ్గా తీసుకున్నారట జగన్ .. అయితే రంగంలోకి దిగితే కానీ మ్యాటర్ అర్థం కాలేదు..

 

జీవితంలో ఎప్పుడు ఈ స్థాయిలో శారీరకంగా కష్టపడకపోవడంతో త్వరగా అలసిపోతున్నారు.. మొదటి రోజే నడుం పట్టేయడం.. రెండో రోజు నుంచి ఇన్‌ఫెక్షన్‌లు రావడంతో జగన్‌కు ఇబ్బందులు మొదలయ్యాయట. దీనికి తోడు యాత్ర నిర్వహిస్తోన్న విధానం.. దానికి ప్రజల నుంచి వస్తోన్న స్పందన పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా సొంత జిల్లాలోనే ఇలా జరగడం వారిలో సందేహాలను రేకేత్తిస్తోంది. మొదటిరోజు లక్షమంది జనం వస్తారని అంచనా వేయగా.. గట్టిగా 20వేల మందికి మించి రాలేదట. ఆ రోజును పక్కనబెట్టినా ఆ తర్వాతి రోజుల్లో కూడా ప్రజల నుంచి ఆశించిన స్పందన లభించడం లేదు.

 

మరోవైపు రోజుకు 15 కిలోమీటర్లు నడిస్తేనే.. ఆరు నెలల కాలంలో మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేయగలుగుతారు కానీ.. ఆయన 10 కిలోమీటర్లకు మించి నడవలేకపోతున్నారు. ఇలా నడిస్తే మొత్తం లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఎంత లేదన్నా 300 రోజులు కావాలి.. మధ్యలో అనారోగ్య సమస్యలు, వాతావరణం దానికి తోడు కోర్టు వాయిదాలు ఇలా పోతే దాదాపు సంవత్సరానికి పైగానే యాత్రకు సమయం పడుతుంది. వచ్చే ఏడాది చివర్లో ముందుస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్న సమయంలో జగన్ యాత్రలు చేసుకుంటూ వెళితే పార్టీ బలపడటం సంగతి పక్కనబెడితే బలహీనపడే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పాదయాత్ర దూరాన్ని కుదించడమో లేదా మధ్యలో ఆపివేయక తప్పకపోవచ్చని వారు అంటున్నారు. మరి జగన్ వెనుకడుగు వేస్తాడా లేక ఎన్ని సమస్యలు ఎదురైనా మడమతిప్పక ముందుకే వెళ్తాడా అన్నది కాలమే నిర్ణయించాలి. 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.