Publish Date:Jun 23, 2022
దూరంగా కనిపించేవరకూ వున్న వన్నీ మా భూములే.. అంటాడు ప్రేమ్ నగర్ సినిమాలో హీరో ఏఎన్నార్ కొత్తగా నగరానికి వచ్చినవాడికి అప్పటికే నగరంలో నాలుగు వీధులు తిరిగినవాడు ఆ కనిపించేది మనోడిదే, అక్కడంతా మనదే రాజ్యం అని గొప్పలు చెబుతూంటాడు. అసలు నేను చెప్పకుంటే సచివాలయంలో నీ పని పది రోజుల్లో అయ్యేది కాదంటాడు ఓ బ్రోకరు ఓ చిరుద్యోగితో! అదో చిత్రమయిన మనస్తత్వం. అలా చెప్పు కోవడంలో ఆదో తుత్తి!
ఆ తుత్తి ఇపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రదర్శిస్తున్నాడు. తనవి కానివి తన వల్లే జరిగాయని ప్రచారం చేసుకోవడానికి ధైర్యం చేయడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. అది అమాయకత్వం కాదు, ఎవరూ గమనించరని, గమనించినా ప్రశ్నించే ధైర్యం చేయరనీ ఓ నమ్మకం. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న ఎలక్ట్రా నిక్ కంపెనీలన్నీ తన పాలనా ప్రతిభ, తన స్నేహ బంధాలతోనే వచ్చాయని జగన్ అనడం విడ్డూరమే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎవరికో పుట్టిన బిడ్డకు తానే తండ్రిని అని చెప్పుకోవడంతో జగన్ దొరికిపోయాడని కామెంట్ చేశారు.
గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు రాష్ట్రానికి సాధించినవి తాను సాధించినవే అని జగన్ చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడం ఆయన దుస్థితిని తెలియజేస్తుంది. అప్పట్లో రాష్ట్రంలో ఐ.టి కంపెనీలు, ఎలక్ట్రానిక్ కంపెనీలు రావడం, రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడింది. ఆ ఖ్యాతి తప్పకుండా చంద్రబాబుకే దక్కుతుంది. అసలు ఏపీని ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చడానికి నాటి సీఎం చంద్రబాబు చేసిన కృషి అనన్య సామాన్యం. ఇది లోకమంతా గుర్తించింది. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి జగన్కి అవేమీ గుర్తుకు రావడం లేదు.
కానీ ప్రజలు మర్చిపోలేదు. తన పాలన గురించి, తన పాలనా ప్రత్యేకతల గురించి, సాధించిన విజయాలను ప్రచారం చేసుకోవడానికి తనకంటూ ఏమీ లేని లోటు బాగా కనపడుతోంది. అందుకే పాపం జగన్ కి మతి భ్రమించిందేమో, చంద్రబాబు పాలన లో అభివృద్ధిని తన ఖాతాలో వేసేసుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-owning-developement-done-ib-babu-rule-39-138254.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.