జగన్ ఒవైసీ భేటీ.. మర్మమేంటి?

Publish Date:Aug 14, 2023

Advertisement

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి కలవనున్నట్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల  పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతున్నది. అది కూడా హైదరాబాద్ నుండి తాడేపల్లి వెళ్లి మరీ   అసదుద్దీన్ సీఎం నివాసంలోనే భేటీ అవుతారంటున్నారు. మధ్యాహ్నం లంచ్ మీటింగ్ గా ఇది ఉండబోతుందని కూడా వైసీపీ వర్గాల సమాచారం. సీఎం జగనే స్వయంగా అసదుద్దీన్ ను తాడేపల్లి ఆహ్వానించారనీ, ఈ భేటీ త్వరలోనే ఈ భేటీ జరగనుందని ఆ వర్గాలు చెబుతున్నాయి.  దీంతో అసలు ఈ ఇద్దరు నేతల భేటీ వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ మొదలైంది. అసలు ఈ నేతల మధ్య గతంలో ఎలాంటి అనుబంధం లేదు. ఇప్పుడు రాజకీయంగా కూడా ఎక్కడా వీరికి సంబంధాలు లేవు. జగన్   వైసీపీ  తెలంగాణతో తెగదెంపులు చేసుకోగా.. ఓవైసీ హైదరాబాద్ పునాదిగా రాజకీయాలు చేసుకుంటున్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎంఐఎం పోటీ చేసినా ఇప్పటి వరకూ ఏపీలో మాత్రం పోటీ చేయనేలేదు.

మరి ఇలాంటి సమయంలో ఈ భేటీ ఏమిటి? ఎందుకు? అన్న ఆసక్తి సర్వత్రా కలుగుతోంది. ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరూ హైదరాబాద్ లేదా విజయవాడలో ఎక్కడా కలసిన దాఖలాలు అయితే లేవు. గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడు   అసదుద్దీన్ వెళ్లి కలిసి వచ్చారు. అలాగే  గతంలో ఒకసారి రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నిలబెట్టిన రాష్టప్రతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీని గెలిపించేందుకు చంచల్‌గూడ జెైల్లో ఉన్న వెైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవెైసీ కలిశారు. అప్పుడు యూపీఏ నుంచి తృణమూల్ కాంగ్రెస్ వైదొలిగిన నేపథ్యంలో ఆ స్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ కు మద్దతివ్వాలని.. కాంగ్రెస్‌ రాయబారిగా ఒవెైసీ జగన్‌తో మాట్లాడి రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని కోరారు. ఆ సమయంలో జగన్ తల్లి విజయమ్మతో కూడా అసదుద్దీన్   చర్చించారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఎక్కడా ఈ రెండు పార్టీల నేతలు కలిసిన దాఖలాలు లేవు.

 అయితే, ఇప్పుడు ఒక్కసారి లంచ్ మీటింగ్ లో ఇరువురు నేతలూ కలవనున్నారన్న సమాచారంతో ఈ భేటీ వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమిటన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైందిప.  ఎంఐఎం ఒక్కో రాష్ట్రంలో తమ ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఏపీలో కూడా ఇలాంటి ప్రయత్నం ఏమైనా మొదలు పెట్టే ఉద్దేశ్యంతోనే జగన్ మోహన్ రెడ్డిని కలిసి మద్దతు కావాలని కోరుతుందా అనే చర్చ ఒకటి జరుగుతుంది. గత ఎన్నికల సమయంలో ఏపీలో ముస్లిం మైనార్టీలు వైసీపీకి ఎక్కువగా మద్దతుగా ఉన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ తో ఉన్న ఈ వర్గం ఆ తర్వాత వైసీపీ వైపు మళ్లింది. అదే సమయంలో టీడీపీ 2014లో బీజేపీతో పొత్తుకు వెళ్లడం కూడా ఈ వర్గం జగన్మోహన్ రెడ్డి వైపు చూసేలా చేసింది. కానీ  వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ వర్గాన్ని అసలు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రత్యేకించి వీరి కోసం నాలుగేళ్ళలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకపోవడంతో ఈ వర్గం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది.

 ఈ నేపథ్యంలో ఓవైసీను ఇక్కడ రంగంలోకి దింపి ప్రచారం చేయించడం.. కావాలంటే ఎంఐఎం పార్టీ కూడా ఏపీలో పోటీ చేసేలా పొత్తుకు దిగి ఎక్కడో చోట కనీసం ఒక్క అసెంబ్లీ స్థానంలో అయినా పోటీ చేయించి మైనార్టీల ఓట్లను గంపగుత్తగా తన వైపుకు తిప్పుకొనే ప్రణాళిక ఏమైనా జగన్ మదిలో ఉందా అన్న చర్చ కూడా మొదలైంది.  ఈసారి మళ్ళీ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న   వైసీపీ అందులో భాగంగానే ఓవైసీ రాకకు ఆహ్వానం పలికిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అసలు ఈ భేటీ వెనక మూల కారణం ఏంటన్నది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందేనని పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.