జగన్ ప్రతిష్ట మసకబారడానికి కారణాలెన్నో

Publish Date:Jan 16, 2014

Advertisement

 

ఇటీవల బెంగళూరుకు చెందిన ఒక సర్వేసంస్థ సీమాంధ్రలో నిర్వహించిన సర్వేలో జగన్మోహన్ రెడ్డి ప్రజాధారణ (పాపులారిటీ) రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడున్న70 శాతం నుండి ఒకేసారి 22శాతానికి పడిపోయినట్లు బయటపెట్టింది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి ఓదార్పుయాత్ర మొదలుపెట్టిన తరువాత ప్రజాధారణ కొంత నిలకడగా ఉన్నట్లు కనబడినప్పటికీ, ఆయన అరెస్టుతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు సీబీఐ జేడీ లక్ష్మి నారాయణ జగన్మోహన్ రెడ్డి కేసుల పరిశోధనతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో మంచి పేరు సంపాదించుకొనగా, క్రింద కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు అన్ని కోర్టులు బెయిలు తిరస్కరిస్తున్నపుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం పరువు పోగోట్టుకొన్నారు.

 

కేంద్రం రాష్ట్ర విభజనకు పూనుకోగానే, వైకాపా వెంటనే తట్టాబుట్టా సర్దుకొని తెలంగాణాలో బయటపడి సమన్యాయం అనడం, ఆ తరువాత సమైక్యాంధ్ర నినాదం అందుకోవడంతో, మొట్టమొదటిసారిగా ప్రజలకి ఆయన విస్వసనీయతపై అనుమానాలు మొదలయ్యాయి. నాటి నుండే ఆయనను తెలంగాణా ప్రజలు ద్వేషించడం కూడా మొదలుపెట్టారు. తెలంగాణాను వదులుకొని సమైక్య శంఖం పట్టుకొని సీమాంధ్రకు వచ్చిపడినప్పటికీ, సమైక్య ముసుగులో విభజనవాదనే ప్రచారం, కాంగ్రెస్ అధిష్టానంతో ఆయనకున్న రహస్య సంభందాల గురించి సీనియర్ కాంగ్రెస్ నేతలే చెపుతుండటంతో అయన చేస్తున్న ఉద్యామలపట్ల ప్రజలలో నమ్మకం కలగలేదు. నానాటికీ దిగజారుతున్న పార్టీ పరిస్థితి గురించి వైకాపా సమావేశాలలో విజయమ్మ పదే పదే ప్రస్తావిస్తూ, అందరూ కలిసి పార్టీని బలోపేతం చేయాలని హెచ్చరిస్తునప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ, జగన్మోహన్ రెడ్డి జైలు నుండి వెలువడటంతో మళ్ళీ ఆయన పాపులారిటీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.

 

ఆయన బయటకు వచ్చేసాడు గనుక ఇక పార్టీ దూసుకుపోతుందని అందరూ భావించారు. కానీ, ఆయన ఏపీయన్జీవోలతో వ్యవహరించిన తీరు, తన ఇంటి ముందు టెంట్ వేసుకొని ఆయన చేసిన ఐదు రోజుల ఆమరణ నిరాహార దీక్ష వంటివన్నీ ఆయన ప్రతిష్టను మరింత మసకబార్చాయి. ఆ తరువాత ఆయన హైదరాబాదులో సమైక్య శంఖారావం పూరించినా, దానివలన ఆయన కానీ, వైకాపాకు గానీ ఎటువంటి మైలేజీ పొందలేకపోయారు. ఆ తరువాత, రాష్ట్ర విభజన ప్రక్రియ జోరుగా సాగుతున్న సమయంలో ఆయన ఉద్యమాలు పక్కనబెట్టి దేశాటన చేసి ప్రతిపక్ష నేతలను కలవడం వలన ప్రజలలో మరిన్ని అనుమానాలు పెరిగాయే తప్ప ఆయన ఆశించినట్లు సమైక్య ఛాంపియన్ గా ఎదగలేకపోయారు.

 

శాసనసభకు తెలంగాణా బిల్లు వచ్చిన నాటి నుండి సమైక్య తీర్మానం కోరుతూ వైకాపా సభ్యులు బిల్లుపై చర్చలో పాల్గొనకుండా తప్పించుకోవడం, అదేసమయంలో ఆయన మళ్ళీ ఏపీయన్జీవో సంఘాల ఎన్నికలలో వేలుపెట్టి భంగ పడటంవంటివి ఆయన ప్రతిష్టను మరింత దిగజార్చాయి. వీటికి తోడు పార్టీలో టికెట్స్ కోసం లుకలుకలు, లక్షలు ఖర్చు బెట్టేసి టికెట్స్ దొరకక బయటకి పోయేవారు జగన్మోహన్ రెడ్డి గురించి చెపుతున్నమాటలు అన్నీకూడా ఆయన ప్రతిష్టను దిగజార్చుతూనే ఉన్నాయి. వెంటనే ఏదోకటి చేయకపోయినట్లయితే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందనే ఆలోచనతోనే ఆయన చంద్రబాబు నియోజక వర్గం కుప్పం నుండి సమైక్యశంఖారవం చెప్పట్టారు. కానీ దానివలన అతని దుందుడుకు స్వభావమే బయటపడింది తప్ప ఆయనకు, పార్టీకి ఎటువంటి ప్రయోజనమూ కలగలేదు.

 

ఇప్పుడు తాజాగా మారెప్పపార్టీని వీడుతూ జగన్ గురించి అన్నమాటలు, ఆ వెనువెంటనే పొట్లూరి వరప్రసాద్ పార్టీలో చేరే ఆలోచన విరమించుకోవడం వగైరాలు పార్టీ ప్రతిష్టను మరింత మసకబార్చాయి. అందువలన త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక భారీ సభో, లేక మరో కార్యక్రమమో ప్రకటించవచ్చును.

By
en-us Political News

  
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.