నిరంతరం పోరాడుతున్నా ప్రజాధారణ దక్కడం లేదు!

Publish Date:Oct 28, 2015

Advertisement

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిత్యం ఏదో ఒక సమస్యపై ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటారు. సాధారణ సమస్యలపై దీర్ఘకాల పోరాటాలు చేయనవసరం లేదు కానీ పంట రుణాల మాఫీ, రైతుల ఆత్మహత్యలు, రాజధాని తదితర ప్రాజెక్టుల కోసం భూసేకరణ, ప్రత్యేక హోదా వంటి అంశాల మీద ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం కొనసాగించగలిగి ఉండి ఉంటే, జగన్ చెప్పుకొంటున్న విశ్వసనీయత, మడమ తిప్పని పోరాటం వంటి మాటలకు అర్ధం ఉండేవి. తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయడం కోసం చేసిన పోరాటంతో తెరాస ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అయితే ఇంతవరకు జగన్ చేసిన ఏ ఒక్క పోరాటం కూడా ఇలాగ విజయవంతం కాలేదు. ఎందుకంటే ఏ సమస్యపై నిలకడగా పోరాటం చేయకపోవడమే కారణమని చెప్పవచ్చును. ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి ఎంత అకస్మాత్తుగా పోరాటం మొదలుపెట్టారో అంతే అకస్మాత్తుగా దానిని పక్కనబెట్టడం గమనిస్తే అది అర్ధమవుతుంది.

 

ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో ఆయనతో కలిసి పోరాడేందుకు సిద్దంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడి అమరావతికి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి గురించి ఎటువంటి ప్రకటన చేయకపోవడం వలన జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యేక పోరాటం కొనసాగించేందుకు చాలా మంచి అవకాశం లభించింది. ఇంత సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకో తన ప్రత్యేక పోరాటాలని అర్ధాంతరంగా నిలిపివేశారు. అందుకు కారణాలేమిటో ఇదమిద్దంగా తెలియదు. బహుశః ప్రత్యేక హోదా కోసం చేప్పట్టిన నిరవధిక నిరాహార దీక్ష అత్యంత అవమానకర పరిస్థితుల్లో ముగించవలసి రావడం, దానికి ప్రజల నుంచి ఆశించినంతగా స్పందన కొరవడటం వంటి కారణాలు జగన్మోహన్ రెడ్డిని తీవ్ర నిరుత్సాహపరిచి ఉండవచ్చును. అందుకే ఆయన దృష్టి మళ్ళీ రాజధాని భూసేకరణపైకి మళ్లినట్లుంది.

 

రెండు రోజుల క్రితం జగన్ రాజధాని ప్రాంతంలో పర్యటించి భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు న్యాయపోరాటం చేయదలిస్తే వారికి వైకాపా అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చివచ్చేరు. ఇంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పారు. భూసేకరణకు వ్యతిరేకిస్తూ రెండు రోజులు ధర్నా కూడా చేసారు. కానీ ఆ తరువాత వారి సమస్యని పక్కన పెట్టి ప్రత్యేక హోదా అంశం భుజానికెత్తుకొన్నారు. మళ్ళీ దానిని పక్కన పడేసి రాజధాని భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాటం అంటున్నారిప్పుడు. ప్రత్యేక హోదా వచ్చేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పిన వైకాపా నేతలు, మోడీ వచ్చే వరకు కొంచెం హడావుడి చేశారు. ఆ తరువాత వాళ్ళు కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం తగ్గించి, రాజధాని భూసేకరణ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఈ అంశంపై వైకాపా నేతలు ఎన్ని రోజులు పోరాడుతారో.. ఆ తరువాత మళ్ళీ ఏ అంశాన్ని భుజానికెత్తుకొంటారో వారికే తెలియాలి.

 

జగన్మోహన్ రెడ్డి నిరంతరంగా చేస్తున్న ఈ పోరాటాల వలన నిజానికి ఆయనకి, వైకాపాకి ప్రజలలో చాలా మంచి ఆదరణ లభించి ఉండాలి కానీ వాటి వలననే ఆయన విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారుతోంది. నిలకడ లేకపోవడం, చేసే పనిలో చిత్తశుద్ధి లోపించడం, హడావుడిగా నిర్ణయాలు తీసుకొని దుందుడుకుగా వ్యవహరించడం వంటి లోపాలు వైకాపాకు విశ్వసనీయతకు ప్రశ్నార్ధకంగా మార్చుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.