బెడిసికొడుతున్న జగన్ వ్యూహాలు

Publish Date:Oct 15, 2015

Advertisement

 

ప్రత్యేక హోదా కోసం అంటూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన దీక్షతో ఏమి సాధించారు...అంటే రాష్ట్రంలో తన పార్టీ శ్రేణులను ఉత్తేజపరచగలిగారని చెప్పుకోవచ్చును. ఆయన ఈ దీక్ష ద్వారా మరో ప్రయోజనం కూడా ఆశించి ఉండవచ్చును. తెదేపా-బీజేపీల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో తనకున్న ప్రజాధారణను నరేంద్ర మోడికి ప్రదర్శించడం ద్వారా బీజేపీకి దగ్గరవ్వాలనే ఆలోచన ఇందులో ఇమిడి ఉండవచ్చుననిపిస్తోంది.

 

జగన్ తో సహా దీక్షా వేదిక నుండి మాట్లాడినవారందరూ మోడీ ప్రభుత్వంలో తెదేపాకు చెందిన ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం, అదే సమయంలో జగన్ దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా శ్రేణులు ధర్నాలు, ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టడం గమనిస్తే జగన్ అదే వ్యూహం అమలుచేస్తున్నారేమో? ఆ వ్యూహానికి కొనసాగింపుగానే అక్టోబర్ 21 వరకు పార్టీ శ్రేణులతో రకరకాల నిరసన కార్యక్రమాలు కొనసాగించిన తరువాత, రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడి వచ్చినప్పుడు ఆయనను కలిసి తన దీక్ష గురించి, దానికి వచ్చిన ప్రజాస్పందన గురించి తెలియజేసేందుకే ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతున్నరనుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధాని దృష్టిని ఆకర్షించి, బీజేపీకి దగ్గరయ్యేందుకే జగన్ ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది.

 

ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ తమ పార్టీ రాష్ట్రంలో తెదేపాతో తెగతెంపులు చేసుకొని వైకాపాతో చేతులు కలిపేందుకు సిద్దపడితే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం తన పోరాటం కొనసాగిస్తారా? అనే సందేహం కలుగుతుంది. జగన్ ఉద్దేశ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా అధికారంలో నుండి దింపి తను ముఖ్యమంత్రి అవడమే తప్ప ప్రత్యేక హోదా కోసం కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేయడం కాదు. అందుకే తన ఆరు రోజుల దీక్షలో కేంద్రప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేయలేదు.

 

కానీ ప్రత్యేక హోదా విషయంలో చాలా ఇబ్బందిపడుతున్న కేంద్రప్రభుత్వాన్ని తన దీక్షలు, ర్యాలీలు, ధర్నాలతో ఇంకా ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోడీ ఆదరించవలసిన అవసరం ఏమిటి? అని ఆలోచిస్తే జగన్ వ్యూహం ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్ధం అవుతుంది. మరో విధంగా చెప్పాలంటే తెదేపాతో తెగతెంపులు చేసుకొని తమ పార్టీతో చేతులు కలపకపోతే కేంద్రానికి, రాష్ట్రంలో బీజేపీకి తన ప్రత్యేక దీక్షలతో ఇబ్బంది కలిగిస్తూనే ఉంటానని జగన్ హెచ్చరిస్తున్నట్లుంది.

 

జగన్ ఇటువంటి ఆలోచనలతో, వ్యూహాలతో ముందుకు సాగడం వలన ఆయన విశ్వసనీయత ఇంకా ప్రశ్నార్ధకం అవుతుంది. బీజేపీని తనవైపు తిప్పుకొనే ప్రయత్నంలో దానితో జగన్ ఈ విధంగా చెలగాటమాడితే చివరికి ఆయనే నష్టపోవచ్చును. అప్పుడు జగన్ ఇమేజ్ పైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న వైకాపా కూడా తీవ్రంగా నష్టపోవచ్చును. తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని గ్రహిస్తే రాజకీయ నేతలు ఏమి చేస్తారో తెలుసుకొనేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మన కళ్ళ ముందే సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. జగన్ ప్రత్యేక హోదా కోసమే పోరాడుతున్నారో లేదో తెలియదు కానీ తన అసంబద్ద, అనాలోచిత వ్యూహాలతో చివరికి తన పార్టీకి కూడా అటువంటి పరిస్థితి ఎదురవకుండా జాగ్రత్త పడితే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.