జగన్ శల్యసారధ్యంలో వైకాపా పయనం ఎటువైపు?

Publish Date:Mar 26, 2015

Advertisement

 

ఇంతవరకు ఏదో సరదాగా సరదాగా సాగుతోందనుకొన్న తెదేపా-వైకాపాల మధ్య యుద్ధం అకస్మాత్తుగా రసవత్తమయిన క్లైమాక్స్ దశకు చేరుకొంది. అందులో ఇప్పుడు అధికార తెదేపాదే పైచేయి సాధించినట్లు కనబడుతోంది. అయితే తెదేపాకు ఆ అవకాశం కల్పించింది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డేనని ఒప్పుకోక తప్పదు. ఈసారి బడ్జెట్ సమావేశాలు మొదలయినప్పుడు అజెండాలో తముకోరుకొన్న అంశాలను చేర్చకపోయినట్లయితే సభలో తాము ‘అగ్లీ సీన్స్ క్రియేట్’ చేస్తామని అధికార తెదేపాను హెచ్చరించడం ద్వారా వైకాపా తెదేపాకు మొదట్లోనే ఒక బ్రహ్మాస్త్రం అందించింది. వీలుచిక్కినప్పుడల్లా అధికార పార్టీ సభ్యులు దానిని వైకాపా మీద ప్రయోగిస్తూనే ఉన్నారు.

 

ఆ తరువాత తమ అధినేత జగన్మోహన్ రెడ్డికి సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వలేదంటూ స్పీకర్ కోడెల మీద వైకాపా సభ్యులు విరుచుకుపడటమే కాకుండా సభలో చాలా అసభ్యంగా ప్రవర్తించారు. స్పీకర్ ని దూషించి పెద్ద పొరపాటు చేసిన వైకాపా సభ్యులు ఆ తరువాత ఆయనపై అవిశ్వాస తీర్మానం కోసం నోటీసిచ్చి మరో తప్పిదం చేసారు. దానిని సభ చర్చకు చెప్పట్టేవరకు సభలో అడుగుపెట్టమని భీకర శపథం చేసి అధికార పార్టీకి మరో ఆయుధం అందజేశారు. కీలకమయిన బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు బయలుదేరబోతున్నట్లు ప్రకటించి మరో తప్పు చేసారు.

 

శాసనసభ సమావేశాలకు హాజరవడం ఇష్టం లేకనే జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి ఈ విధంగా చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారంటూ తెదేపా నేతలు విమర్శలు గుప్పించడంతో, చేసిన ప్రతిజ్ఞలను దిగమింగుకొని, బస్సు యాత్రలను రద్దు చేసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సభ్యులు శాసనసభకు హాజరవవలసి వచ్చింది. అప్పుడు అధికార పార్టీ సభ్యులు అందరూ వారితో సభలో చెడుగుడు ఆడేసుకొన్నారంటే అతిశయోక్తి కాదు.

 

“జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సభ్యులు అసలు సభని ఎందుకు బహిష్కరిస్తారో...మళ్ళీ ఎందుకు తిరిగి వస్తారో...మళ్ళీ ఎందుకు వాక్ అవుట్ చేస్తుంటారో...ఎవరికీ తెలియదు” అంటూ అధికార పార్టీ సభ్యులు ఎద్దేవా చేస్తుంటే వారికి జగన్మోహన్ రెడ్డి వివరణలు, సంజాయిషీలు ఇచ్చుకోవడం చూస్తుంటే చాలా నవ్వు తెప్పిస్తుంది.

 

అయితే వైకాపా కష్టాలు అంతటితో తీరిపోలేదు. స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానం పెట్టి అధికార పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెడదామని వైకాపా చూస్తే, స్పీకర్ ని దూషించినందుకు 9 మంది వైకాపా సభ్యులను సభ నుండి (ఆరు నెలలపాటు) సస్పెండ్ చేయాలని కోరుతూ స్పీకర్ కి నోటీసు ఇవ్వడంతో వైకపా కంగుతింది. వైకాపా అప్పుడు ప్రభుత్వంతో కాళ్ళబేరానికి రాక తప్పలేదు. తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేయకుండావదిలేస్తే, తాము స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకొంటామని బేరం పెట్టింది. సభలో తమకు మెజార్టీ లేదని, తమ నోటీసుకి మద్దతు ఇచ్చేందుకు సభలో వేరే ఇతర పార్టీలు ఏవీ లేవని తెలిసిఉన్నప్పటికీ అధికార పార్టీని ఏదోవిధంగా అప్రదిష్ట పాలుజేద్దామనే తాపత్రయంతో ముందు వెనుక చూసుకోకుండా హడావుడిగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చేసిన వైకాపా ఇప్పుడు దానిని కూడా వెనక్కితీసుకోనేందుకు సిద్దపడుతోంది. అయినా అధికార తెదేపా దిగిరాలేదు.

 

“అవిశ్వాస తీర్మానం పెట్టుకొంటే పెట్టుకోండి..ఎదుర్కొనేందుకు మేము సిద్దం. కానీ తొమ్మిది మంది వైకాపా సభ్యులను క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. జగన్మోహన్ రెడ్డి సభలో స్పీకర్ కి క్షమాపణలు చెప్పి, తన పార్టీ సభ్యులు మళ్ళీ సభలో అసభ్యంగా ప్రవర్తించారని లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చినట్లయితే తాము పరిశీలిస్తామని తెదేపా తేల్చి చెప్పడంతో వైకాపా పని ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది.

 

ఒకవేళ జగన్మోహన్ రెడ్డిసభలో క్షమాపణలు చెప్పి, అందుకు లేఖ కూడా ఇస్తే, అది అధికార పార్టీకి మరో గొప్ప ఆయుధంగా మారుతుంది. దానిని పట్టుకొని అధికార పార్టీ సభ్యులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వైకాపాతో ఆడేసుకొనే అవకాశం కూడా ఉంటుంది. పైగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన తప్పును అంగీకరిస్తూ క్షమించమని వ్రాసిన ఆ లేఖ అసెంబ్లీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కనుక అందుకు ఒప్పుకోకపోయినట్లయితే, అప్పుడు తొమ్మిదిమంది వైకాపా యం.యల్యేలు అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు వారందరూ జగన్మోహన్ రెడ్డిని తప్పు పడుతూ పార్టీలో అసమ్మతి వర్గంలా తయారయ్యే ప్రమాదం ఉంది. ఏవిధంగా చూసినా వైకాపా అడ్డంగా బుక్ అయిపోయినట్లే కనిపిస్తోంది.

 

అయితే ఈ సమస్య నుండి వైకాపా మెల్లగా ఏదో విధంగా బయటపడవచ్చును. కానీ జరిగినవన్నీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అపరికత్వకు అద్దంపట్టేవిగా ఉన్నాయి. అంతే కాదు ఆయన పార్టీలో సీనియర్లను ఎవరినీ సంప్రదించరనే సంగతి స్పష్టం అవుతోంది. ఆయన ఈ విధంగా పార్టీకి శల్యసారధ్యం చేస్తూ తను చేస్తున్న తప్పులకు పార్టీని భారీ మూల్యం చెల్లింపజేస్తున్నట్లుంది. పాపం వైకాపా!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.