ఇందుకే అయితే 40 రోజులు సమావేశాలు అనవసరమే

Publish Date:Mar 9, 2015

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలను కేవలం పదిహేడు రోజులే నిర్వహించాలనే తెదేపా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాన పతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలను సభలో చర్చించేందుకు వీలుగా కనీసం నలబై రోజులు సమావేశాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేసారు. శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై చర్చించేందుకు స్పీకర్ కోడెల శివప్రసాద్ బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించినప్పుడు, అందులో పాల్గొన్న వైకాపా నేతలు ఈ సమావేశాలలో తాము చర్చించదలచుకొన్న అంశాలతో కూడిన ఒక జాబితాను ఆయనకు అందజేశారు. అయితే వాటిలో కొన్నిటిని ఆయన తిరస్కరించినప్పుడు, తాము ఇచ్చిన అజెండాలో అంశాలను చర్చకు అంగీకరించకపోయినట్లయితే సభలో ఇబ్బంది కలిగిస్తామని హెచ్చరించినట్లు వార్తలు వచ్చేయి. దానిని అధికార ప్రతిపక్షాలు అన్నీ తీవ్రంగా తప్పు పట్టాయి. ఈరోజు శాసనసభ సమావేశాలు మొదలవగానే వైకాపా నేతలు తాము ఇచ్చిన అంశాలపై చర్చ జరగాలంటూ పట్టుబట్టడం చూస్తే వారే సభలో మరే ఇతర అంశాలు, సమస్యలపై చర్చించేందుకు వెనుకాడుతున్నట్లు ఉంది. పోడియం వద్దకు దూసుకు వచ్చి సభాకార్యకలాపాలకు అడ్డు తగులుతున్న వైకాపా నేతలను వారి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వారించకపోవడం గమనిస్తే ఆయన ప్రోద్బలంతోనే, ఆదేశానుసారమే సభా కార్యక్రమాలు సజావుగా సాగకుండా చేస్తున్నట్లుంది. అటువంటప్పుడు శాసనసభ సమావేశాలు నలబై రోజులు కాదు నాలుగు నెలలు నిర్వహించినా ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు.

 

వైకాపా సభ్యులు తమ ఆందోళన విరమించి సభా కార్యక్రమాలు సజావుగా సాగనిస్తే వారు పేర్కొన్న అన్ని అంశాలపైన చర్చించడానికి వీలుపడుతుందని స్పీకర్ కోడెల శివప్రసాద్ మరియు ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు పదేపదే చెపుతున్నప్పటికీ వారు తమ ఆందోళన విరమించకపోవడంతో సభను 10 నిమిషాలు వాయిదా వేయవలసి వచ్చింది. ఆ తరువాత మళ్ళీ సభ సమావేశమయినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని తన మైక్ కట్ చేస్తున్నారంటూ దాదాపు ఒక 20 నిమిషాల పాటు మాట్లాడారు.

 

అసలు ఆయన తన పార్టీ సభ్యులకే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనే సమయం అంతా హరించివేస్తున్నప్పుడు, మళ్ళీ తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని స్పీకర్ ని ప్రభుత్వాన్ని నిందించడం ఒక విచిత్రమనుకొంటే, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే అంశం మీదనే ఆయన సభలో అనర్గళంగా మాట్లాడుతుండటం మరో విచిత్రం. ఈవిధంగా అసలు సమస్యలు పక్కను బెట్టి సభలో వృధా ప్రసంగాలు చేయడం వలన ప్రయోజనం ఏమిటి?

 

తెలంగాణా శాసనసభ బడ్జెట్ సమావేశాలు కూడా ఇంచుముంచు 17 రోజులే సాగుతున్నాయి. అక్కడ అధికార ప్రతిపక్షాలవారు వేరే అంశాలపై పోరాడుతున్నారు. అది వేరే సంగతి. కానీ అక్కడ సభ్యులెవరూ సభని 40 రోజులు ఎందుకు నడపడం లేదని జగన్మోహన్ రెడ్డిలా వితండవాదం చేయడం లేదు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అధికార ప్రతిపక్షాలు ఒకరికొకరు సహకరించుకొంటూ, ప్రజాసమస్యలపై లోతుగా చర్చించే మాటయితే అటువంటి సమావేశాలకి ఒక అర్ధం ఉంటుంది. కానీ ప్రజాసమస్యలను గాలికొదిలి రాజకీయ పార్టీలు తమ పార్టీ ప్రయోజనాలనే సభ ఎజెండాగా చేయాలనుకొంటే అటువంటి సమావేశాల వలన వాటికీ ప్రయోజనం ఉండవచ్చునేమో కానీ ప్రజలకు మాత్రం ఏమీ ఉండబోదని చెప్పక తప్పదు. అటువంటి వాటి కోసం 40 రోజులు సభను నడిపినా విలువయిన ప్రజాధనం వృధాకావడం తప్ప వేరే ప్రయోజనం ఏముంటుంది?

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.