కుప్పం కార్యకర్తలతో జగన్ భేటీ

Publish Date:Aug 5, 2022

Advertisement

జనాన్ని కలుసుకుంటే నిరసనలు ఎదుర్కొనవలసి వస్తుందని భావిస్తున్న జగన్ జనంలోకి వెళ్లడం కంటే పార్టీ కార్యకర్తలను తన వద్దకు పిలిపించుకుని వారిని ఎన్నికలకు సమాయత్తం చేసి పార్టీ గెలుపునకు కెటలిస్టులుగా మార్చాలని యోచిస్తున్నట్లున్నారు. అందుకే ఆయన నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలకు శ్రీకారం చుట్టారు.   ఆయన కుప్పం కార్యకర్తలతోనే ఆయన ఈ భేటీలకు శ్రీకారం చుట్టారు. విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలను ఆయన తాడేపల్లి సీఎం కార్యాలయానికి పిలిపించుకుని వచ్చే ఎన్నికలలో పార్టీ విజయానికి తీసుకోవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.

తెలుగుదేశం అధినేత సొంత నియోజకవర్గంలో ఆయనను ఓడించగలిగితే.. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ అన్న లక్ష్యం సునాయసంగా సాధించగలమని జగన్ కార్యకర్తలకు తెలిపారు. స్థానిక ఎన్నికలలో కుప్పంలో వైసీపీ విజయంతో అసెంబ్లీ ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు ఓటమికి బీజాలు పడ్డాయని జగన్ వారితో అన్నారు. అదే ఉత్సాహంతో ముందుకు సాగి అసెంబ్లీ ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబుకు ఓటమి పరాభవం ఎదురయ్యేలా చూడాలని పిలుపు నిచ్చారు.

మరో సారి వచ్చే ఎన్నికలలో 175కు 175స్థానాలలోనూ మనదే విజయం అంటూ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించారు. గడపగడపకూ మన ప్రభుత్వం వైఫల్యం, మంత్రల బస్సుయాత్రకు ఎదురైన పరాభవం వీటిని వేటినీ ఆయన కనీసం ప్రస్తావించలేదు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ సమస్యలే లేవని, జనం అంతా వైసీపీవైపే ఉన్నారనీ కార్యకర్తలను నమ్మించే ప్రయత్నమే తప్ప, నియోజకవర్గ సమస్యల పరిష్కారం, జనాలను ఆకర్షించేందుకు తీసుకోవలసిన చర్యలు కానీ, హామీల అమలులో వైఫల్యాలు గానీ ఈ భేటీలో ఏ మాత్రం ప్రస్తావనకు రాలేదు. మనం గెలుస్తున్నాం.. గెలవాలంతే అన్న ధోరణిలోనే కుప్పం కార్యకర్తలతో జగన్ భేటీ సాగిందని విశ్వసనీయంగా తెలిసింది. 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.