ఏబీవీపై కేసు సరే.. జగన్, విజయసాయిలను ఏం చేయాలి?

Publish Date:Jan 23, 2025

Advertisement

కిందపడ్డా మాదే పై చేయి. మేం ఎవర్నైనా ఏదైనా అంటాం.. మమ్మల్ని అంటే మాత్రం సహించం. మేము ఏం చేసినా ఏం మాట్లాడినా, చివరికి బూతులు తిట్టినా తప్పు కాదు..  అదే మమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అది తప్పు. క్షమించరాని నేరం. ఇదీ మొదటి నుంచీ వైసీపీ నేతల తీరు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిస‌హా ఆ పార్టీ నేత‌లు ఎవ‌రినైనా ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిట్టొచ్చు. కులాల పేరుతో బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప‌లానా కులాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి వెలివేయాల‌ని అనొచ్చు . వారు ఏద‌న్నా క‌రెక్ట్ అంటూ స‌మ‌ర్ధించుకుంటారు. కానీ, వారి  వ్యాఖ్య‌ల‌ను విమ‌ర్శిస్తే మాత్రం త‌ట్టుకోలేరు. వారి సొంత‌ మీడియా , పార్టీ సోష‌ల్ మీడియా ద్వారా అదే ప‌నిగా అస‌త్యాల‌తో త‌ప్పుడు ప్ర‌చారం చేయిస్తుంటారు. అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను, ఏపీలోని క‌మ్మ‌ సామాజిక వ‌ర్గాన్ని పురుగుల్లా చూసిన జ‌గ‌న్‌.. ప్ర‌తిప‌క్షంలోనూ అదే త‌ర‌హా రాజ‌కీయాలు చేస్తున్నారు. తాను చేసిన త‌ప్పుల‌ను ఎత్తిచూపిన వారికి శిక్షలు  వేయాలంటూ సొంత మీడియా ద్వారా రోత రాత‌లు రాయిస్తున్నారు. ఇంత‌కీ  అస‌లేం జ‌రిగింది.. కుల ప్ర‌స్తావ‌న ఇప్పుడెందుకు తేవాల్సి వ‌చ్చిందీ అంటే..

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీలో 2019 నుంచి 2024 వ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.  ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన నాటినుంచి ఏపీలోని క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని రాష్ట్రం నుంచి వెలివేయ‌డ‌మే ల‌క్ష్యం అన్న‌ట్లుగా  ప‌నిచేశారు. ఈ ప్ర‌క్రియ ఐదేళ్ల పాటు సాగింది. ఇది ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న‌ ప్ర‌తిఒక్క‌రికీ తెలిసిన విష‌య‌మే. అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి ఏపీలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన అధికారుల‌పై జ‌గ‌న్ చిన్న‌చూపు చూస్తూ వ‌చ్చారు. ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు అధికారుల‌పై కేసులు పెట్టించారు. క‌రోనా కార‌ణంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను అప్ప‌టి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ అడ్డుకుంటే.. క‌మ్మ సామాజిక వ‌ర్గం కుట్ర చేస్తుందంటూ ప్ర‌చారం చేయించారు. మ‌రీ దారుణ‌మైన విష‌యం ఏమిటంటే.. క‌రోనా స‌మ‌యంలో భార‌త్ బ‌యోటెక్ క‌రోనా వ్యాక్సిన్ క‌నుక్కుంటే దానిపైనా వారి పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. అది క‌రోనా వ్యాక్సిన్ కాదు.. క‌మ్మ వ్యాక్సిన్ అంటూ ఆరోప‌ణ‌లు చేయ‌డం వారి నీచబుద్ధికి పరాకాష్ట‌. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావునైతే ముప్పుతిప్ప‌లు పెట్టారు. కేవ‌లం క‌మ్మ కులానికి చెందిన వ్యక్తి అన్నఅక్క‌స్సుతోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆయ‌న‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింది. ఇది బహిరంగ ర హస్యమే.  అప్ప‌ట్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరుపై విమ‌ర్శ‌లు సైతం వ‌చ్చాయి. కానీ, అధికార బ‌లంతో అంద‌రి నోర్లు మూయించారు.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికితోడు ఆ పార్టీ కీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అధికారంలో ఉన్నంత‌కాలం ప్ర‌తీరోజూ ఉద‌యం, సాయంత్రం క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని తిట్ట‌డ‌మే ఆయ‌న ప‌నిగా పెట్టుకున్నారు. ఏపీలో క‌మ్మోళ్లు ఎవ‌రూ బిజినెస్ లు చేసుకోవ‌ద్దు.. ఆ సామాజిక వ‌ర్గంవారు మీడియా సంస్థ‌లు న‌డ‌పొద్దు.. అస‌లు వారు రాష్ట్రంలో ఉండొద్దు అన్న‌ట్లుగా ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. వీరి వెకిలి చేష్ట‌ల‌ను భ‌రించ‌లేని ప్ర‌జ‌లు ఎన్నిక‌ల్లో గ‌ట్టి బుద్ది చెప్పారు. వైసీపీకి క‌నీసం ప్ర‌తిప‌క్ష పార్టీ హోదా కూడా ఇవ్వకుండా..  మీ నిర్వాకం ఐదేళ్లు భరించాం. ఇక చాలు అంటూ ఓటుతో గుణపాఠం చెప్పారు. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు అనేక‌ సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. కానీ, ఏ సామాజిక వ‌ర్గాన్ని ఆయ‌న విమ‌ర్శించలేదు. చంద్ర‌బాబు హ‌యాంలో అన్ని సామాజిక వ‌ర్గాల వారికి మేలు జ‌రిగింది. అన్ని సామాజిక వ‌ర్గాల వారికి కీల‌క ప‌ద‌వులు ద‌క్కాయి. కానీ  జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా  ఉన్న ఐదేళ్లూ రాష్ట్రంలో  క‌క్షా రాజ‌కీయాలు కొన‌సాగాయి. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌.. జ‌గ‌న్ క‌మ్మ సామాజిక వ‌ర్గంపై ఏవిధంగా క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించారో పూసగుచ్చినట్లు వివ‌రించారు. వైసీపీ హయాంలో  తనకు జరిగిన అన్యాయాన్నీ, అవమానాలను వివరించారు.  

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వ్యాఖ్య‌ల‌ను జ‌గ‌న్ సొంత మీడియా  తనకు మాత్రమే సాధ్యమైన వక్రభాష్యంతో హైలైట్ చేసింది. నిజాల‌ను ఒప్పుకోకుండా ఏబీపై విమ‌ర్శ‌ల దాడిచేసింది. అలాగే, ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వ్యాఖ్య‌లు చూసి ఎవ‌రైనా దాడుల‌కు దౌర్జ‌న్యాల‌కు దిగితే ప‌రిస్థితి ఏంటి అంటూ  బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. దీనికితో డు పోలీసులు ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయాల‌నే డిమాండ్ ను కూడా  లేవ‌నెత్తింది. అయితే, జ‌గ‌న్ మీడియా గుర్తించాల్సిన అస‌లు విష‌యం మాత్రం ఇప్ప‌టికీ గుర్తించ‌డం లేదు. దీంతో వైసీపీ మీడియా తీరును  గురువింద సామెత‌ను గుర్తు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  జ‌గ‌న్ మీడియా అన్న‌ట్లు కుల ప్ర‌స్తావ‌న తెచ్చిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై కేసులు పెడితే.. మరి జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి, ఆ పార్టీలోని కొంద‌రి నేత‌ల‌పై ఎన్ని కేసులు పెట్టాలి..?  ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలపై కేసు పెట్టాల్సి వస్తే..గతంలో జగన్, విజయసాయి, ఇతర వైసీనీ నేతల వ్యాఖ్యలు, విమర్శలు, దూషణలకు వారిని ఉరి తీయాల్సి ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా జరుగుతోంది.  కుల ప్ర‌స్తావ‌న తెచ్చిన ఏబీపై కేసులు పెట్టాల‌ని కోరిన జ‌గ‌న్ మీడియా.. మ‌రి జ‌గ‌న్, విజ‌య‌సాయిరెడ్డిపై ఏఏ కేసులు పెట్టాలో కూడా చెప్పాలంటూ నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.