ఏబీవీపై కేసు సరే.. జగన్, విజయసాయిలను ఏం చేయాలి?

Publish Date:Jan 23, 2025

Advertisement

కిందపడ్డా మాదే పై చేయి. మేం ఎవర్నైనా ఏదైనా అంటాం.. మమ్మల్ని అంటే మాత్రం సహించం. మేము ఏం చేసినా ఏం మాట్లాడినా, చివరికి బూతులు తిట్టినా తప్పు కాదు..  అదే మమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అది తప్పు. క్షమించరాని నేరం. ఇదీ మొదటి నుంచీ వైసీపీ నేతల తీరు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిస‌హా ఆ పార్టీ నేత‌లు ఎవ‌రినైనా ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిట్టొచ్చు. కులాల పేరుతో బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప‌లానా కులాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి వెలివేయాల‌ని అనొచ్చు . వారు ఏద‌న్నా క‌రెక్ట్ అంటూ స‌మ‌ర్ధించుకుంటారు. కానీ, వారి  వ్యాఖ్య‌ల‌ను విమ‌ర్శిస్తే మాత్రం త‌ట్టుకోలేరు. వారి సొంత‌ మీడియా , పార్టీ సోష‌ల్ మీడియా ద్వారా అదే ప‌నిగా అస‌త్యాల‌తో త‌ప్పుడు ప్ర‌చారం చేయిస్తుంటారు. అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను, ఏపీలోని క‌మ్మ‌ సామాజిక వ‌ర్గాన్ని పురుగుల్లా చూసిన జ‌గ‌న్‌.. ప్ర‌తిప‌క్షంలోనూ అదే త‌ర‌హా రాజ‌కీయాలు చేస్తున్నారు. తాను చేసిన త‌ప్పుల‌ను ఎత్తిచూపిన వారికి శిక్షలు  వేయాలంటూ సొంత మీడియా ద్వారా రోత రాత‌లు రాయిస్తున్నారు. ఇంత‌కీ  అస‌లేం జ‌రిగింది.. కుల ప్ర‌స్తావ‌న ఇప్పుడెందుకు తేవాల్సి వ‌చ్చిందీ అంటే..

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీలో 2019 నుంచి 2024 వ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.  ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన నాటినుంచి ఏపీలోని క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని రాష్ట్రం నుంచి వెలివేయ‌డ‌మే ల‌క్ష్యం అన్న‌ట్లుగా  ప‌నిచేశారు. ఈ ప్ర‌క్రియ ఐదేళ్ల పాటు సాగింది. ఇది ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న‌ ప్ర‌తిఒక్క‌రికీ తెలిసిన విష‌య‌మే. అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి ఏపీలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన అధికారుల‌పై జ‌గ‌న్ చిన్న‌చూపు చూస్తూ వ‌చ్చారు. ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు అధికారుల‌పై కేసులు పెట్టించారు. క‌రోనా కార‌ణంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను అప్ప‌టి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ అడ్డుకుంటే.. క‌మ్మ సామాజిక వ‌ర్గం కుట్ర చేస్తుందంటూ ప్ర‌చారం చేయించారు. మ‌రీ దారుణ‌మైన విష‌యం ఏమిటంటే.. క‌రోనా స‌మ‌యంలో భార‌త్ బ‌యోటెక్ క‌రోనా వ్యాక్సిన్ క‌నుక్కుంటే దానిపైనా వారి పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. అది క‌రోనా వ్యాక్సిన్ కాదు.. క‌మ్మ వ్యాక్సిన్ అంటూ ఆరోప‌ణ‌లు చేయ‌డం వారి నీచబుద్ధికి పరాకాష్ట‌. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావునైతే ముప్పుతిప్ప‌లు పెట్టారు. కేవ‌లం క‌మ్మ కులానికి చెందిన వ్యక్తి అన్నఅక్క‌స్సుతోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆయ‌న‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింది. ఇది బహిరంగ ర హస్యమే.  అప్ప‌ట్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరుపై విమ‌ర్శ‌లు సైతం వ‌చ్చాయి. కానీ, అధికార బ‌లంతో అంద‌రి నోర్లు మూయించారు.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికితోడు ఆ పార్టీ కీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అధికారంలో ఉన్నంత‌కాలం ప్ర‌తీరోజూ ఉద‌యం, సాయంత్రం క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని తిట్ట‌డ‌మే ఆయ‌న ప‌నిగా పెట్టుకున్నారు. ఏపీలో క‌మ్మోళ్లు ఎవ‌రూ బిజినెస్ లు చేసుకోవ‌ద్దు.. ఆ సామాజిక వ‌ర్గంవారు మీడియా సంస్థ‌లు న‌డ‌పొద్దు.. అస‌లు వారు రాష్ట్రంలో ఉండొద్దు అన్న‌ట్లుగా ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. వీరి వెకిలి చేష్ట‌ల‌ను భ‌రించ‌లేని ప్ర‌జ‌లు ఎన్నిక‌ల్లో గ‌ట్టి బుద్ది చెప్పారు. వైసీపీకి క‌నీసం ప్ర‌తిప‌క్ష పార్టీ హోదా కూడా ఇవ్వకుండా..  మీ నిర్వాకం ఐదేళ్లు భరించాం. ఇక చాలు అంటూ ఓటుతో గుణపాఠం చెప్పారు. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు అనేక‌ సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. కానీ, ఏ సామాజిక వ‌ర్గాన్ని ఆయ‌న విమ‌ర్శించలేదు. చంద్ర‌బాబు హ‌యాంలో అన్ని సామాజిక వ‌ర్గాల వారికి మేలు జ‌రిగింది. అన్ని సామాజిక వ‌ర్గాల వారికి కీల‌క ప‌ద‌వులు ద‌క్కాయి. కానీ  జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా  ఉన్న ఐదేళ్లూ రాష్ట్రంలో  క‌క్షా రాజ‌కీయాలు కొన‌సాగాయి. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌.. జ‌గ‌న్ క‌మ్మ సామాజిక వ‌ర్గంపై ఏవిధంగా క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించారో పూసగుచ్చినట్లు వివ‌రించారు. వైసీపీ హయాంలో  తనకు జరిగిన అన్యాయాన్నీ, అవమానాలను వివరించారు.  

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వ్యాఖ్య‌ల‌ను జ‌గ‌న్ సొంత మీడియా  తనకు మాత్రమే సాధ్యమైన వక్రభాష్యంతో హైలైట్ చేసింది. నిజాల‌ను ఒప్పుకోకుండా ఏబీపై విమ‌ర్శ‌ల దాడిచేసింది. అలాగే, ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వ్యాఖ్య‌లు చూసి ఎవ‌రైనా దాడుల‌కు దౌర్జ‌న్యాల‌కు దిగితే ప‌రిస్థితి ఏంటి అంటూ  బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. దీనికితో డు పోలీసులు ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయాల‌నే డిమాండ్ ను కూడా  లేవ‌నెత్తింది. అయితే, జ‌గ‌న్ మీడియా గుర్తించాల్సిన అస‌లు విష‌యం మాత్రం ఇప్ప‌టికీ గుర్తించ‌డం లేదు. దీంతో వైసీపీ మీడియా తీరును  గురువింద సామెత‌ను గుర్తు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  జ‌గ‌న్ మీడియా అన్న‌ట్లు కుల ప్ర‌స్తావ‌న తెచ్చిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై కేసులు పెడితే.. మరి జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి, ఆ పార్టీలోని కొంద‌రి నేత‌ల‌పై ఎన్ని కేసులు పెట్టాలి..?  ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలపై కేసు పెట్టాల్సి వస్తే..గతంలో జగన్, విజయసాయి, ఇతర వైసీనీ నేతల వ్యాఖ్యలు, విమర్శలు, దూషణలకు వారిని ఉరి తీయాల్సి ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా జరుగుతోంది.  కుల ప్ర‌స్తావ‌న తెచ్చిన ఏబీపై కేసులు పెట్టాల‌ని కోరిన జ‌గ‌న్ మీడియా.. మ‌రి జ‌గ‌న్, విజ‌య‌సాయిరెడ్డిపై ఏఏ కేసులు పెట్టాలో కూడా చెప్పాలంటూ నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.