ఆపత్సమయంలోనూ అబద్ధాలేనా సీఎం జగన్?!

Publish Date:Dec 9, 2023

Advertisement

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావుడితో ఒకింత తగ్గినట్టుగా కనిపించిన ఏపీ పొలిటికల్ హీట్ మళ్ళీ పెరుగుతున్నది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు ముందు రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒక దశలో వైసీపీకి గుక్క తిప్పుకునే అవకాశం ఇవ్వకుండా టీడీపీ నేతలు మాటలతోనే ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాల దండయాత్రతో అధికార పార్టీకి ఏం చేయాలో కూడా అర్ధంకాని పరిస్థితికి చేరింది. అలాంటి సమయంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించి సీఎం జగన్ తమ కక్షసాధించుకున్నారు. అయితే, అది జగన్ కు మరింత నష్టమే తెచ్చిందనుకోండి అది వేరే విషయం. మొత్తంగా చంద్రబాబుకు బెయిల్ దక్కడంతో మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చి అండగా నిలబడడం మొదలు పెట్టారు. ఏపీని నాలుగు రోజుల పాటు మిచౌంగ్ తుఫాన్ అల్లల్లాడించి పోయిన సంగతి తెలిసిందే. తుఫాన్ సమయంలో జగన్ ప్రభుత్వం ఏమీ చేయలే దన్నది నిజం. తుఫాన్ వెళ్ళిపోయాక తీరిగ్గా వైసీపీ నేతలు ప్రజలు మధ్యకి వచ్చారు. కానీ, అప్పటికే ఆలస్యమైపోయింది. తుఫాన్ తీరం దాటాక కూడా రెండు మూడు రోజుల వరకూ పరిస్థితులు చక్కబడలేదు.

తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు, అసలు తుఫాన్ ప్రభావాన్ని తెలుసుకొనేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజల మధ్యకే వెళ్లారు. దాదాపు మూడు నెలల తరువాత ఆయన జనం మధ్యకు వచ్చారు. అదీ ఆపత్సమయంలో   ప్రజలకు భరోసా ఇచ్చేందుకు. దీంతో  కంగారుపడిన సీఎం  జగన్ కూడా అదే రోజున తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే, చంద్రబాబు పంట పొలాల నుండి ప్రజలు ఇబ్బందులు పడుతున్న వాడల వరకూ వెడితే.. ముఖ్యమంత్రి జనగ్  మాత్రం ఈ కార్యక్రమాన్ని కూడా ఒక  పార్టీ సభలా  మార్చేసుకున్నారు. తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లడం అటుంచి..  బాధల్లో ఉన్న జనాలనే తన దగ్గరకు రప్పించుకున్నారు.  ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే బలవంతపు  జనసమీకరణ చేశారు.  సరే అలాగైనా తుపాను బాధితులకు ఏమైనా స్పష్టమైన సహాయం ప్రకటించారా? ధీమా ఇచ్చారా? భరోసా కల్పించారా అంటే అదేం లేదు.  ఒక ఎన్నికల ప్రచార సభలా సీఎం సభ  జరిగింది. ప్రతిపక్షాల మాటలను నమ్మొద్దని, చంద్రబాబు పాలన అంతా కరువు కాటకాలేనంటూ విమర్శలకు దిగారు. తుపాను బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ వారి వద్దకు వెళ్లకుండా సభ పెట్టారు. ఆ సభను కూడా  తన బటన్ నొక్కుడు సభగా మార్చేశారు.  ప్రతిపక్షాలను విమర్శించి చేతులు దులిపేసుకున్నారు. బాధితులందరికీ సాయం అందుతుందని.. ఎక్కడికక్కడ సచివాలయాలు బాధితులకు అండగా ఉంటాయని.. వారే ఇంటింటికీ వచ్చి సాయం  అందిస్తారనీ జగన్ చెప్పుకొచ్చారు.  

అయితే క్షేత్ర స్థాయిలో  పరిస్థితులు తెలిసిన వారికి  సీఎం చెప్పిన ఒక్క మాట కూడా నెరవేరే  అవకాశం లేదని తెలిసిపోయింది.   తుఫాన్ బాధితుల సభలో మాట్లాడిన సీఎం.. గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థతో ప్రతీ ఇంటికీ నేరుగా వచ్చి సహాయ కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పుకున్నారు.  మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఎవరో ఏదో చెబితే నమ్మవద్దు.. అసలు ఆ టీడీపీ అనుకూల పత్రికలు చదవవద్దని చెప్పారు. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. మీకు సాయం అందకపోతే నేరుగా 1902 నంబర్ కే ఫోన్ చేయండి.. అది నేరుగా సీఎం ఆఫీస్ కే వస్తుందని కూడా జగన్ చెప్పారు. ఏపీలో తమ ప్రభుత్వం ఎంతో మంచి చేస్తూంటే చూసి ఓర్వలేని వారు బురద జల్లుతున్నారని జగన్ ఆవేదన చెందారు. మండిపడ్డారు. అయితే, జగన్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

తుఫాన్ బాధితుల పరామర్శ కోసం వెళ్లిన సీఎం బాధితులకు భరోసా ఇవ్వాలి. కానీ తనదేం లేదు అన్నీ సచివాలయాలు చూసుకుంటాయని చెప్పారు. తుఫాన్ సమయంలో ఆ సచివాలయ ఉద్యోగులే కార్యాలయాలకు రాలేదు. ఆ తర్వాత కూడా సహాయక చర్యలకు తగిన కార్యాచరణ  రూపొందించలేదు. ప్రజల గురించి పట్టించుకోలేదు. ఇక సాయం అందించేందుకు ఎక్కడా తగిన సమాచారం కూడా సేకరించలేదు. అదే విషయాన్ని ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. కానీ జగన్ వాళ్ళని నమ్మవద్దంటూ తనకు అలవాటైన విమర్శలు చేసేశారు.   ఆపద సమయంలో అధికారంలో ఉండి తుపాను బాధితులను ఆదుకునేందుకు తామేం చేశాం, ఏం చేయబోతున్నాం అన్నది  చెప్పాల్సిన చోట జగన్ గత ప్రభుత్వాన్ని విమర్శించి చేతులు దులిపేసుకున్నారు. 

ఇక 1902 నంబర్ కి కాల్ చేస్తే సీఎంఓకి వస్తుందని.. మీ సమస్యలు తీరతాయని జగన్ నిస్సంకోచంగా పచ్చి అబద్దం చేప్పేశారు. వాస్తవంగా ఆ నంబర్ కి కాల్ చేసే ఫిర్యాదులు తీసుకుని సంబంధిత  శాఖకి పంపిస్తారు. కానీ ఆ శాఖ అధికారులు మాత్రం తమ దగ్గర సమస్య పరిష్కరించేందుకు తగిన సౌకర్యాలు లేవని చెప్తున్నారు. ఉదాహరణకి ఏపీలో అనధికారిక విద్యుత్ కోతలపై 1902కి కాల్ చేస్తే ఫిర్యాదు తీసుకొని సంబంధిత అధికారికి కలుపుతారు. అధికారి మాత్రం ఎందుకు విద్యుత్ కోతలు విధిస్తున్నారో తమకి కూడా సమాచారం లేదని చెప్తున్నారు. సాధారణ రోజుల్లోనే  పరిస్థితి ఇలా ఉంటే..  ఇక తుఫాన్ లాంటి  ఆపత్సమయాల్లో  పరిస్థితి ఎలా ఉంటుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  అందుకే జగన్ వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆపత్సమయంలోనే పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడమేమిటంటూ  నిలదీస్తున్నారు. 

By
en-us Political News

  
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.