ఐప్యాక్ వైపే జగన్ మొగ్గు.. వైసీపీలో నిస్తేజం!

Publish Date:Aug 12, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తన సొంత పార్టీ నేతల కంటే ఐప్యాక్ నివేదికలపైనే ఎక్కువ నమ్మకం ఉండేదన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికలలో తన పార్టీ ఘన విజయం సాధించి తాను ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టడానికి ఐప్యాక్ వ్యూహాలే కారణమన్నది ఆయన నమ్మకం.  అదే నమ్మకంతో జగన్ ఐప్యాక్ నివేదికలే నమ్ముకుని జగన్ 2024 ఎన్నికలకు వెళ్లారు. అయితే ఈ సారి మాత్రం ఐప్యాక్ వ్యూహాలు జగన్ కు రిత్ర కనీవినీ ఎరుగని పరాజయాన్ని మిగిల్చాయి. 2019 ఎన్నికల విజయం తరువాత 2019 ఎన్నికలలో పార్టీ కోసం పని చేయడానికి జగన్ ఐప్యాక్కు 350 కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెబుతారు. అంటే 2024 ఎన్నికలలో ఐప్యాక్ కు జగన్ అంత కంటే ఎక్కేవే చెల్లించి ఉంటారు. అసలు ఐప్యాక్ అనేది వైసీపీలో ఒక భాగంగా మారిపోయింది. ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో నిండా తల దూర్చింది. ఐప్యాక్ తో ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన సొమ్ములకు జగన్   సంస్థకు కొన్ని కాంట్రాక్టులు ఇచ్చారనీ, అలా ఐప్యాక్ కు పార్టీ పరంగా చెల్లించాల్సిన సొమ్ములు ముట్టచెప్పారని పార్టీ వర్గాలు బాహాటంగానే చెప్పుకున్నాయి. అంతే కాకుండా పలువురు ఐప్యాక్ సభ్యులను వివిధ ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగులుగా అప్పాయింట్ మెంట్ పత్రాలు ఇచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించారని కూడా తెలిసింది. 

ఇక ఐపాక్య సభ్యులైతే వైసీపీ ఎమ్మెల్యేలను నీడలా ఫాలో అవుతూ వారేం చేయాలో నిర్దేశించేవారు. కొన్ని కొన్ని నియోజకవర్గాలలో అయితే ఐప్యాక్ సభ్యులే వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేశారు. 2024 ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత జగన్ ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి అక్కడ వారితో ఫొటోలు తీయించుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం కంటే అధిక స్థానాలను గెలుచుకోబోతున్నామని ప్రకటించారు కూడా. అయితే తీరా ఎన్నికలు వచ్చిన తరువాత గతంలో ఏ పార్టీ ఓడిపోనంత ఘోరంగా వైసీపీ పరాజయం పాలైంది. అసలు వైసీపీ ఎన్నికల ప్రచారమే వైనాట్ 175 అంటూ వైసీపీ నేతలే బిత్తరపోయే రేంజ్ లో సాగింది. పార్టీ క్యాడర్ కు, నేతలకు క్షేత్ర స్థాయి పరిస్థితులు ఏమిటి అన్నది అలోచించే సావకాశం ఇవ్వకుండా సాగిన ఆ ప్రచారం చేసిన నష్టమేమిటో పార్టీకి, పార్టీ నాయకత్వానికి ఫలితాల తరువాత కానీ తెలియలేదు. ఒటమి తరువాత వైసీపీ నేతలు బాహాటంగానే  ఐప్యాక్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవాలు పార్టీ నాయకత్వానికి తెలియకుండా.. విజయం సాధించబోతున్నామంటూ తప్పుదోవపట్టించిందని విమర్శలు గుప్పించారు. ఇక ఐప్యాక్ తో వైసీపీ బంధం ముగిసిందనే అంతా భావించారు. 

అయితే 2029 ఎన్నికలలో కూడా పార్టీ తరఫున పని చేయడానికి జగన్ ఐప్యాక్ తో ఒప్పందం కుదుర్చుకోవడం వారిని దిగ్భ్రమకు గురి చేసింది. వచ్చే ఎన్నికలలో వైసీపీకి గెలుపు వ్యూహాలు రచించేందుకు ఐప్యాక్ తో జగన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారిక ప్రకటన ఏమీ రాకపోయినా.. పార్టీలో జరుగుతున్న పరిణామాలు అలాంటి ఒప్పందం ఏదో కుదిరిందన్న సందేహాలకు తావిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల ఫలితాల తరువాత ఐప్యాక్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా జగన్ కు, వైసీపీకి మద్దతుగా ఎటువంటి పోస్టులూ ఐప్యాక్ పెట్టలేదు. కానీ ఇటీవలి కొన్ని రోజులుగా ఐప్యాక్ యాక్టివ్ అయ్యింది.

జగన్ కు మద్దతుగా, కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. అలాగే జగన్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు, రాష్ట్రపతి పాలన అంటూ ఇష్టారీతిగా నోరు పారేసుకుంటున్నారు.  దీంతో జగన్ మరోసారి ఐప్యాక్ కు పార్టీని వచ్చే ఎన్నికలలో విజయం బాట పట్టించేందుకు వ్యూహాల రూపకల్పన కోసం ఐప్యాక్ ను ఆశ్రయించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇవే అనుమానాలు పార్టీలోనూ గట్టిగా వ్యక్తం అవుతున్నాయి. దీంతో వైసీపీ నేతలు, క్యాడర్ నిస్తేజంగా మారిపోయారు. మరోసారి వైసీపీని నమ్ముకుని అడుగులు వేస్తే రాజకీయ మనుగడ ఉండదన్న భయంతో సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు.  

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.