అభద్రతా భావంలో జగన్ ....30 మంది ప్రయివేటు సెక్యురిటీ సిబ్బంది

Publish Date:Jun 18, 2024

Advertisement

అవగాహనా రాహిత్యం వల్ల మనిషి అభద్రతా భావానికి గురవుతుంటాడు. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతుంటాడు.  ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సమాజం పట్ల , జీవితం ఎంత ఎక్కువ అవగాహన ఉంటే అంత ఆత్మ స్థైర్యం కలుగుతుంది. హేతుబద్దంగా ఆలోచించగలుగుతారు. మాజీ ముఖ్యమంత్రి వైఎష్ జగన్ గత ఐదేళ్లు చేసిన అధికార దుర్వినియోగం వల్ల పదవీచ్యుతుడయ్యాడు. ఆయనకున్న సెక్యురిటీ తగ్గిపోవడంతో పూర్తి అభధ్రతలో పడ్డారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాల‌యానికి 30 మంది  ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బంది వచ్చేసింది. 
ఏపీ మాజీ సీఎం జగన్‌ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియ‌మించుకున్న సెక్యురిటీ  సిబ్బంది సోమ‌వారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చారు. అధికారం కోల్పోవడం, ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ప్రభుత్వ పరంగా జగన్‌కు భద్రత కుదించే అవ‌కాశం ఉండ‌డంతో ఆయన ప్రైవేటుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. 
ఇకపై జ‌గ‌న్ మాజీ సీఎంగా, సాధార‌ణ ఎమ్మెల్యేగా మాత్ర‌మే కొన‌సాగాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగానే ఆయ‌న భ‌ద్ర‌తలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ముంద‌స్తుగా జ‌గ‌న్ ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని సిద్ధం చేసుకున్నార‌ని తెలుస్తోంది. గ‌తంలో కూడా జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు, పాద‌యాత్ర స‌మ‌యంలో ప్రైవేటు భ‌ద్ర‌తా సిబ్బందిని భారీ మొత్తంలో నియ‌మించుకున్న విష‌యం తెలిసిందే. కాగా, జ‌గ‌న్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో త‌న‌కు, త‌న ఫ్యామిలీకి భ‌ద్ర‌త కోసం స్పెష‌ల్ సెక్యూరిటీ గ్రూపును ఏర్పాటు చేస్తూ ఒక ప్ర‌త్యేక చ‌ట్టాన్ని తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. లండన్ లో ఉన్న తన కూతుళ్ల కోసమే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. కొడుకుతో తనకు రక్షణ లేదని జగన్ తల్లి విజయమ్మ విదేశాల్లో ఉన్న మనవడు రాజారెడ్డి ఇంట్లో ఉంటోంది.  ఎపికి ఇప్పటివరకు పని చేసిన 17 ముఖ్యమంత్రులు ఒక ఎత్తయితే జగన్ మరో  ఎత్తుగా మారింది. పేదవాడిగా చెప్పుకునే జగన్ తరచూ లండన్ వెళ్లేవారు. ఆ సమయాల్లో జగన్ సెక్యురిటీ కోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది.
 

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.