జ‌గ‌న్ ఆశ అడియాశే.. వైసీపీ ఆట ముగిసిన‌ట్లే!?

Publish Date:Nov 20, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న దిగ్విజ‌యంగా ముందుకు సాగుతోంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. గ‌త ఐదేళ్లు క‌నీస స‌దుపాయాలులేక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఐదు నెల‌ల్లోనే రోడ్ల మ‌ర‌మ్మ‌తుల ద‌గ్గ‌ర నుంచి ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌పై దృష్టిసారించ‌డంతో ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఏపీలో పెట్టుబ‌డుల ప్ర‌వాహం మొద‌లైంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన పై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఏకంగా రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉంటే..  రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారం కోల్పోయిన నాటి నుంచి  అనేక మంది వైసీపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలలో చేరారు. మ‌రికొంద‌రు ఆ దారిలోనే నడిచేందుకు రెడీగా ఉన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే అయిన జ‌గ‌న్ మాత్రం జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయి.. మళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని ప‌దేప‌దే చెబుతూ ముఖ్య‌నేత‌లు పార్టీ వీడ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. మ‌రోవైపు కూట‌మి ప్ర‌భుత్వంలోని పార్టీల నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తేలా వైసీపీ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తున్నది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూటమి ఐక్యత విచ్ఛిన్నం అవుతుందనీ, మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహిస్తాననీ  వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌ల‌లు కంటున్నారు. తాజాగా అసెంబ్లీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో జ‌గ‌న్ ఆశ‌లు అడియాశల‌యిన‌ట్లేన‌ని వైసీపీ నేత‌ల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిస‌హా వైసీపీకి చెందిన ప‌ద‌కొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా బాయ్ కాట్ చేశారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్ర‌మే అసెంబ్లీకి హాజ‌ర‌వుతున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. స‌మ‌స్య ప‌రిష్కారానికి మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు. దీంతో గ‌త ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీలో ప్ర‌శాంత‌వాతావ‌ర‌ణంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అర్ధ‌వంత‌మైన చ‌ర్చ జ‌రుగుతుlన్నది.

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో అసెంబ్లీ స‌మావేశాల్లో మంత్రులు, కొంద‌రు వైసీపీ స‌భ్యులు అస‌భ్య‌ ప‌ద‌జాలంతో అప్పటి ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యుల‌పై తీవ్ర‌ స్థాయిలో విరుచుకుప‌డ్డారు. దీంతో ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు అంటేనే ప్ర‌జ‌లు టీవీలు బంద్‌పెట్టే ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ, చంద్ర‌బాబు సార‌థ్యంలోని తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వంలో అసెంబ్లీ స‌మావేశాలు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రుగుతున్నాయి. తాజాగా.. బుధ‌వారం (నవంబర్ 20)   అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో అద్భుత‌మైన పాల‌న సాగుతున్నద‌ని అన్నారు.  ఐదు సంవ‌త్స‌రాలే కాదు.. ద‌శాబ్ద‌కాలం పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబు నాయుడే ఉంటార‌ని, కూట‌మి ప్ర‌భుత్వం దిగ్విజ‌యంగా ముందుకు సాగుతుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేత‌ల ఆశ‌లు అడియాశ‌లైన‌ట్లేన‌ని చెప్పొచ్చు. 

అసెంబ్లీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో వైసీపీ నుంచి తెలుగుదేశం కూట‌మి పార్టీల్లోకి  వ‌ల‌స‌లు పెర‌గ‌డం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతుంది. ఇప్ప‌టికే వైసీపీ హ‌యాంలో బూతుల‌తో సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయిన వారిపై ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది. సహజంగా వీరిలో వైసీపీకి చెందిన నేత‌లే ఎక్కువ‌గా ఉన్నారు. దీనికి తోడు వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిపైనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ కేసుల నుంచి త‌ప్పించుకునేందుకు ప‌లువురు వైసీపీ నేత‌లు కూట‌మిపార్టీల్లోకి చేరేందుకు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం.. జ‌మిలి ఎన్నిక‌లు రాబోయేతున్నాయి.. మ‌ళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుంద‌ని పదేప‌దే చెబుతుండ‌టంతో కూట‌మి పార్టీల్లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న నేత‌లు కాస్త వెనుక‌డుగు వేస్తున్న ప‌రిస్థితి. దీనికితోడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను సైతం బెదిరింపుల‌కు గురిచేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది వైసీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని.. ఇప్పుడు వైసీపీ నేత‌ల‌ను ఇబ్బందులు పెట్టిన అధికారుల‌ను గుర్తుపెట్టుకొని మేము అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇటీవ‌ల‌ హెచ్చ‌రించారు. అంతే కాదు.. ఇప్పుడు వైసీపీ నేత‌ల‌ను ఇబ్బందులు పెట్టి.. త‌రువాత‌ ప‌ద‌వీ విర‌మ‌ణ పొంది విదేశాల‌కు పోయిన‌వారినిసైతం ప‌ట్టుకొచ్చి  జైలుకు పంపిస్తామంటూ హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. దీంతో కొంద‌రు అధికారులు వైసీపీ నేత‌ల జోలికి వెళ్లాలంటే భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య‌ల‌తో.. వైసీపీ నుంచి కూట‌మి పార్టీల్లోకి చేరే నేత‌ల‌ సంఖ్య పెర‌గ‌నుండ‌టంతో పాటు.. అధికారుల్లో దైర్యాన్ని నింపిన‌ట్ల‌యింది.

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.