జ‌గ‌న్ ఆశ అడియాశే.. వైసీపీ ఆట ముగిసిన‌ట్లే!?

Publish Date:Nov 20, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న దిగ్విజ‌యంగా ముందుకు సాగుతోంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. గ‌త ఐదేళ్లు క‌నీస స‌దుపాయాలులేక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఐదు నెల‌ల్లోనే రోడ్ల మ‌ర‌మ్మ‌తుల ద‌గ్గ‌ర నుంచి ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌పై దృష్టిసారించ‌డంతో ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఏపీలో పెట్టుబ‌డుల ప్ర‌వాహం మొద‌లైంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన పై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఏకంగా రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉంటే..  రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారం కోల్పోయిన నాటి నుంచి  అనేక మంది వైసీపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలలో చేరారు. మ‌రికొంద‌రు ఆ దారిలోనే నడిచేందుకు రెడీగా ఉన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే అయిన జ‌గ‌న్ మాత్రం జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయి.. మళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని ప‌దేప‌దే చెబుతూ ముఖ్య‌నేత‌లు పార్టీ వీడ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. మ‌రోవైపు కూట‌మి ప్ర‌భుత్వంలోని పార్టీల నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తేలా వైసీపీ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తున్నది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూటమి ఐక్యత విచ్ఛిన్నం అవుతుందనీ, మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహిస్తాననీ  వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌ల‌లు కంటున్నారు. తాజాగా అసెంబ్లీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో జ‌గ‌న్ ఆశ‌లు అడియాశల‌యిన‌ట్లేన‌ని వైసీపీ నేత‌ల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిస‌హా వైసీపీకి చెందిన ప‌ద‌కొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా బాయ్ కాట్ చేశారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్ర‌మే అసెంబ్లీకి హాజ‌ర‌వుతున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. స‌మ‌స్య ప‌రిష్కారానికి మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు. దీంతో గ‌త ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీలో ప్ర‌శాంత‌వాతావ‌ర‌ణంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అర్ధ‌వంత‌మైన చ‌ర్చ జ‌రుగుతుlన్నది.

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో అసెంబ్లీ స‌మావేశాల్లో మంత్రులు, కొంద‌రు వైసీపీ స‌భ్యులు అస‌భ్య‌ ప‌ద‌జాలంతో అప్పటి ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యుల‌పై తీవ్ర‌ స్థాయిలో విరుచుకుప‌డ్డారు. దీంతో ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు అంటేనే ప్ర‌జ‌లు టీవీలు బంద్‌పెట్టే ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ, చంద్ర‌బాబు సార‌థ్యంలోని తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వంలో అసెంబ్లీ స‌మావేశాలు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రుగుతున్నాయి. తాజాగా.. బుధ‌వారం (నవంబర్ 20)   అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో అద్భుత‌మైన పాల‌న సాగుతున్నద‌ని అన్నారు.  ఐదు సంవ‌త్స‌రాలే కాదు.. ద‌శాబ్ద‌కాలం పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబు నాయుడే ఉంటార‌ని, కూట‌మి ప్ర‌భుత్వం దిగ్విజ‌యంగా ముందుకు సాగుతుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేత‌ల ఆశ‌లు అడియాశ‌లైన‌ట్లేన‌ని చెప్పొచ్చు. 

అసెంబ్లీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో వైసీపీ నుంచి తెలుగుదేశం కూట‌మి పార్టీల్లోకి  వ‌ల‌స‌లు పెర‌గ‌డం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతుంది. ఇప్ప‌టికే వైసీపీ హ‌యాంలో బూతుల‌తో సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయిన వారిపై ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది. సహజంగా వీరిలో వైసీపీకి చెందిన నేత‌లే ఎక్కువ‌గా ఉన్నారు. దీనికి తోడు వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిపైనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ కేసుల నుంచి త‌ప్పించుకునేందుకు ప‌లువురు వైసీపీ నేత‌లు కూట‌మిపార్టీల్లోకి చేరేందుకు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం.. జ‌మిలి ఎన్నిక‌లు రాబోయేతున్నాయి.. మ‌ళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుంద‌ని పదేప‌దే చెబుతుండ‌టంతో కూట‌మి పార్టీల్లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న నేత‌లు కాస్త వెనుక‌డుగు వేస్తున్న ప‌రిస్థితి. దీనికితోడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను సైతం బెదిరింపుల‌కు గురిచేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది వైసీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని.. ఇప్పుడు వైసీపీ నేత‌ల‌ను ఇబ్బందులు పెట్టిన అధికారుల‌ను గుర్తుపెట్టుకొని మేము అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇటీవ‌ల‌ హెచ్చ‌రించారు. అంతే కాదు.. ఇప్పుడు వైసీపీ నేత‌ల‌ను ఇబ్బందులు పెట్టి.. త‌రువాత‌ ప‌ద‌వీ విర‌మ‌ణ పొంది విదేశాల‌కు పోయిన‌వారినిసైతం ప‌ట్టుకొచ్చి  జైలుకు పంపిస్తామంటూ హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. దీంతో కొంద‌రు అధికారులు వైసీపీ నేత‌ల జోలికి వెళ్లాలంటే భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య‌ల‌తో.. వైసీపీ నుంచి కూట‌మి పార్టీల్లోకి చేరే నేత‌ల‌ సంఖ్య పెర‌గ‌నుండ‌టంతో పాటు.. అధికారుల్లో దైర్యాన్ని నింపిన‌ట్ల‌యింది.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.