Publish Date:May 12, 2025
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం పేరిట విషాన్ని విక్రయించారు. ఆ పనిని స్వయంగా అప్పటి జగన్ ప్రభుత్వమే చేసింది. జగన్ హయాంలో అమలు చేసిన మద్యం విధానం ప్రజారోగ్యాన్ని పీల్చి పిప్పి చేసింది. ఆ కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వం స్వయంగా మద్యం దుకాణాలను నిర్వహించి విక్రయించిన రకరకాల బ్రాండ్ల మద్యంలో ప్రాణాలకు హానికరమైన రసాయనాలు ఉన్నాయని అప్పట్లోనే నివేదికలు తేల్చి చెప్పాయి. ఆయా మద్యం బ్రాండ్లను కెమికల్ ల్యాబ్ లలో పరీక్షించి ఆయా బ్రాండల్లో హానికర కెమికల్స్ ఉన్నట్లు తేలినట్లు అప్పట్లోనే వార్తలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఆయా మద్యం బ్రాండ్ల తయారీదారులంతా వైసీపీ పెద్దలు, వారి సన్నిహితులేనని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అప్పట్లో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అప్పటి జగన్ సర్కార్ పట్టించుకోలేదు. అయితే రాష్ట్రంలో జగన్ సర్కార్ పతనమై తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ హయాంలో మద్యం కుంభకోణంపై దర్యాప్తునకు ఆదేశించింది.
ఆ దర్యాప్తు ఇప్పుడు వేగవంతమైంది. పలు అరెస్టులు కూడా జరిగాయి. అది పక్కన పెడితే.. జగన్ హయాంలో అవలంబించి మద్యం విధానం ప్రజారోగ్యాన్ని గుల్ల చేసిందన్న ఆరోపణలు అక్షర సత్యాలన్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. జగన్ ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసి సరఫరా చేసిన నాసిరకం మద్యం కారణంగా పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయనీ రుజువైంది. జగన్ హయాంలో సరఫరా చేసిన నాసిరకం మద్యం కారణంగా మద్యం సేవించిన వా రి ఆరోగ్యం క్షీణించిందన్న ఆరోపణలపై అధ్యయనానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక బృందాన్ని నియమించింది. ఆ బృందం తన అధ్యయన నివేదికను తాజాగా వెల్లడించింది.
జగన్ హయాంలో సరఫరా చేసిన మద్యం కారణంగా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైన మాట వాస్తవమని ఆ నివేదిక పేర్కొంది. 2019, 2024 మధ్య కాలంలో మద్యం సేవించే వారిలో మూత్ర పిండాలు, కాలేయ సంబంధిత వ్యాధులలో పెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఆ నివేదిక మేరకు మద్యం సంబంధిత వ్యాధులు విపరీతంగా పెరిగాయి. 2014-2019 మధ్య కాలంలో మద్యం సంబధిత వ్యాధులతో బాధపడిన వారి సంఖ్య 14, 026 కాగా సంఖ్య 2019-24 మధ్య కాలంలో దాదాపు రెట్టింపైంది. ఈ గణాంకాలు ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స పొందిన వారిది మాత్రమే. అలాగే కల్తీ మద్యం కారణంగా వ్యాధుల బారిన పడిన వారిలో 34 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కుల సంఖ్య అధికంగా ఉంది. కాగా ఈ జేబ్రాండ్ లిక్కర్ కారణంగా పలువురు నరాలకు సంబంధించిన వ్యాధుల బారిన కూడా పడ్డారని నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-government-supplied-harmful-liquor-25-197932.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.