నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న ధోరణిలో వైసీసీ సర్కార్ వ్యవహరిస్తున్నది. పార్టీ నేతలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కిమ్మనకుండా, ఆరోపణలకు గురైన వారిపై చర్యలు తీసుకోకుండా వైసీపీ సర్కార్ ప్రజలకు ఏం చెబుదామనుకుంటోంది. గోరంట్ల మాధవ్ వ్యవహారమే తీసుకుంటే.. ఆయన దిక్కుమాలిన చర్య వల్ల పార్టీ పరువే కాదు.. రాష్ట్రం పరువు, పార్లమెంటు పరువూ కూడా గంగలో కలిసిపోయింది. చర్యలు తీసుకుని కొంతలో కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్న ఇంగితం కూడా వైసీపీలో కనిపించడం లేదు.
ఆయన న్యూడ్ కాల్ వ్యవహారం వెలుగులోనికి వచ్చిన రోజు మాత్రం కఠిన చర్యలు అంటూ మీడియా ముందుకు వచ్చిన మాట్లాడిన సజ్జల ఆ తరువాత నోరెత్తడం మానేశారు. పార్టీ అధినేత, సీఎం జగన్ సరేసరి, ఆయన తరఫున ప్రభుత్వ సలహాదారు సజ్జల జగన్ చాలా సీరియస్ ఉన్నారన్న ఓ మాట చెప్పేసి ఊరుకున్నారు. అంతే గోరంట్ల మాధవ్ విషయాన్ని ఆ పార్టీ నేతలెవరూ ప్రస్తావించడానికే ఇష్టపడటం లేదు. ఇది వ్యూహాత్మకమేననీ, జనం ఈ విషయాన్ని మర్చిపోయేవరకూ మిన్నకుండటమే మేలని పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదని ఈ వైఖరితో తేలిపోయింది.
ఆయన పార్లమెంటు సమావేశాలకు హాజరౌతున్నారు. పార్టీ పరంగా జరిగే సమావేశాలలోనూ పాల్గొంటున్నారు. అంత అసహ్యంగా వీడియోలో బుక్కైన గోరంట్ల మాధవ్ పై రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు చెందిన వారూ విమర్శలు గుప్పిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా వైసీపీ పట్టించుకోవడం లేదు. కనీసం పార్టీలో ఉన్న మహిళా నేతలకు కూడా మాట్లాడటం లేదు. ఇప్పుడు వైసీపీ దృష్టి అంతా మాధవ్ వ్యవహారం నుంచి ప్రజలు, మీడియా దృష్టిని మరల్చడమెలా అన్న దానిపైనే ఉందని పరిశీలకులు అంటున్నారు. గతంలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లపై ఇటువంటి ఆరోపణలకు వచ్చినప్పుడు కూడా వైసీపీ ఇదే వ్యూహాన్ని అనుసరించిందని గుర్తు చేస్తున్నారు.
అంబటి, అవంతి విషయంలో అయినా ఇప్పుడు గోరంట్ల మాధవ్ విషయంలో అయినా ప్రజలు ఏదో అనుకుంటారని .. వైసీపీ హైకమాండ్ ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు హిందూపురం ఎంపీ విషయంలోనే వైసీపీ అదే పంధాను అనుసరిస్తున్నది. జనం ఏమనుకుంటారు, పార్టీ పరువు ఏమౌతుంది అన్న ఆలోచనే వైసీపీ దరికి చేరనీయదనీ, అధికారంలో ఉన్నాం కనుక ఏం చేసినా చెల్లిపోతుంది, ఎవరైనా నిలదీస్తే చేతిలో పోలీసులు ఉన్నారు.. కేసులు పెట్టి వేధించేయవచ్చన్నదే వైసీపీ ఆలోచనాధోరణిగా ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన చిత్తూరు జిల్లా విద్యార్థిపై కేసు నమోదు చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-government-never-bother-about-people-39-141350.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.