రాజ్యసభ ఎన్నికల రూపంలో జగన్ కు ముందస్తు గండం!?

Publish Date:Feb 5, 2024

Advertisement

ఏపీ ముఖ్యమంత్రి మరో సారి అధికారంలోకి రావడం ఎలాగో తెలియక ఆందోళనలో ఉండి.. సిట్టింగుల మార్పు ప్రయోగంతో ఉన్న అవకాశాలను చేజార్చుకుంటూ బెంబేలెత్తుతుంటే.. మరో వైపు అసలు పోరుకు ముందు జరిగే రాజ్యసభ  ఎన్నికలలో అభ్యర్థిని నిలబెట్టి గెలిచి జగన్ కు చావు దెబ్బ కొట్టాలన్న వ్యూహాలతో తెలుగుదేశం, జనసేన కూటమి కార్యాచరణ ప్రారంభించింది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బాబలాలను పరిగణనలోనికి తీసుకుంటే.. ఎన్నికలు జరగనున్న మూడు రాజ్యసభ స్థానాలలోనూ వైసీపీ సునాయాసంగా విజయం సాధిస్తుంది.

అయితే అలా గెలిచేస్తామన్న నమ్మకం మాత్రం అధికార వైసీపీలో ఇసుమంతైనా కనిపించడం లేదు.  జగన్ తీరుతో విసుగెత్తి కొందరు, అసంతృప్తితో మరి కొందరు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేయగా, పార్టీలోనే ఉన్నవారిలో పలువురు జగన్ కు వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికలలో ఓటు వేయాలన్న నిర్ణయంతో ఉన్నట్లు అధికార పార్టీ వర్గాలే డంకా బజాయించి మరీ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుని జగన్ కు అసలు ఎన్నికల వేళ భారీ ఝలక్ ఇచ్చి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలన్న కృత నిశ్చయంతో ఉంది. అందుకే రాజ్యసభ ఎన్నికల విషయంలో టీడీపీ ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తోంది. వ్యూహరచన చేస్తోంది. అభ్యర్థిని అంటూ నిలబెడితే గెలిచి తీరాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. రాజ్యసభ ఎన్నికలపై పార్టీ ఒక బృందాన్ని నియమించి అభ్యర్థి విజయంపై కసరత్తు మొదలెట్టేసింది. ఆ బృందం   ఇప్పటికే అధికార పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలతో టచ్ లో ఉందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ బలం ఎంత,  ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్తులలో ఎంత మంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారు. వంటి అంశాలపై సీరియస్ గా కసరత్తు చేస్తున్నది.

ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తాము తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేస్తామని చెప్పినట్లు తెలుస్తోంి.  మరికొందరు తెలుగుదేశంలోకి టచ్ లోకి వచ్చారు. ఇంకొందరు జనసేనతో టచ్ లోకి వెళ్లారు.  దీంతో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికలలో అభ్యర్థిని నిలబెట్టాలన్న నిర్ణయానికి దాదాపుగా వచ్చేసింది. అయితే ఎవరిని పోటీలో నిలబెడుతుంది అన్న విషయంలో మాత్రం ఎలాంటి లీకులూ లేవు. అభ్యర్థి పేరును చివరి క్షణం వరకూ గోప్యంగా ఉంచాలని తెలుగుదేశం భావిస్తోంది.  ప్రస్తతం జగన్ రెడ్డి సీట్ల మార్పు కార్యక్రమంతో మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు సొంత పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో వ్యూహాత్మకంగా అవకాశం లేకపోయినా పంచుమర్తి అనూరాథను అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకున్న తెలుగుదేశం ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలలోనూ అంతే వ్యూహాత్మకంగా అభ్యర్థిని రంగంలోకి దింపేయాలని భావిస్తోందని చెబుతున్నారు. సిట్టింగుల మార్పు అంటూ జగన్ మార్పులతో ఆయన పార్టీపై దళిత నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే వైసీపీ ఇప్పటి వరకూ చేసిన మార్పులలో అత్యథికంగా 28 దళితులే ఉన్నారు.  దీంతో వారంతా రాజ్యసభ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిని నిలబెడితే ఆయనకే మద్దతు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  అలా నిలబెట్టే అభ్యర్థి దళితుడైతే ఇక సందేహానికి తావులేని విధంగా వారంతా  వారంతా తెలుగుదేశశం అభ్యర్థికి మద్దతుగా ఓటు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం రాజ్యసభ ఎన్నికలలో దళిత అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఇప్పుడు జగన్ అండ్ కో లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవతున్నది. నియోజకవర్గాలలో సిట్టింగుల మార్పు కార్యక్రమానికి విరామం ప్రకటించి తెలుగుదేశంతో టచ్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎవరు అన్న విషయాన్ని ఆరా తీయడంలో పడ్డారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల భయంతో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల మార్పు విషయంలో కూడా పునరాలోచించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మొత్తం మీద అసలు ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికల రూపంలో జగన్ కు పెనుగండం పొంచి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.