ఏపీలో కాంగ్రెస్ ఖాళీ.. జగన్ వ్యూహం అదేనా?

Publish Date:Feb 13, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. గత ఎన్నికలకు ముందు వైఎస్సార్ కుమార్తె షర్మిలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం ద్వారా వైసీపీని దెబ్బకొట్టేందుకు ఆ పార్టీ పన్నిన వ్యూహం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అదే వ్యూహాన్ని రివర్స్ లో అమలు చేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా తనకు బద్ధ విరోధిగా మారిన షర్మిలను దెబ్బకొట్టడంతో పాటు.. రాష్ట్రంలో వైసీపీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ కు ఖాళీ చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. 

ఔను.. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ పరిస్థితి అప్పటి నుంచీ కూడా జారుడుబండమీద నిలబడినట్లుగానే ఉంది. ఆ పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా ఇతర పార్టీలకు వెళ్లిపోతున్నారు. మరి కొందరు రాజకీయ సన్యాసం ప్రకటిస్తున్నారు. ఆ పార్టీ నుంచి వలసల ఉధృతి చూస్తుంటే.. సమీప భవిష్యత్ లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టడం, అలాగే షర్మిల దూకుడుకు బ్రేకులు వేయడం కోసం జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని పరిశీలకులు అంటున్నారు. అందులో భాగంగానే.. వైసీపీని వీడే వాళ్ల గురించి పట్టించుకోకుండా, బయట నుంచి నేతలను పార్టీలోకి తీసుకుంటున్నారు.అలా వచ్చేందుకు రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో నామమాత్రంగా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రెడీగా ఉన్నారు. 

గత ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. దాంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కొంత మేర పుంజుకున్న పరిస్థితి కనిపించింది. అయితే ఎన్నికల ఫలితాల తరువాత మళ్లీ రాష్ట్ర కాంగ్రెస్ లో నిరాశ, నైరాశ్యం, నిస్ఫృహలు అలముకున్నాయి. ఈ పరిస్థితుల్లోనే గతంలో రాష్ట్ర కాంగ్రెస్ లో  చక్రం తిప్పిన సీనియర్ నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పేరుకు కాంగ్రెస్ లో ఉన్నా వారు పార్టీ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం లేదు సరికదా.. కనీసం పార్టీ కార్యాలయంవైపు కూడా కన్నెత్తి చూడటంలేదు. అలాంటి వారిపై జగన్ దృష్టి పెట్టారు. వైసీపీలోకి వస్తే వారి సీనియారిటీకి తగిన ప్రాధాన్యత కల్పిస్తానని హామీ ఇస్తూ వారిని ఫ్యాన్ గూటికి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే తొలుత ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్ ను వైసీపీలో చేర్చుకున్నారు. 

ఇప్పుడిక ఆయన కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేశారని రాజకీయవర్గాలలో టాక్ నడుస్తోంది. వైసీపీలోకి చేరనున్న కాంగ్రెస్ సీనియర్ల జాబితాలో కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వంటి వారు ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. అలాగే మాజీ ఎంపీ హర్షవర్థన్ ను కూడా జగన్ వైసీపీలోకి ఆహ్వానించారని చెబుతున్నారు.

సీనియర్ల చేరికతో వైసీపీలో కొత్త ఊపు వస్తుందని జగన్ భావిస్తున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అయితే గత ఐదేళ్ల జగన్ పాలనపై జనంలో ఏ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యిందో చూసిన తరువాత కాంగ్రెస్ సీనియర్లు ఆయన పంచన చేరే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. అయినా కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు వైఎస్ కుమార్తె చేతిలో ఉన్నందున వైఎస్ ను నిజంగా అభిమానించే నేతలెవరూ కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరే అవకాశాలు లేవని అంటున్నారు.  

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.