జగన్ దెబ్బ.. బ్రదర్ అనిల్ అబ్బ..

Publish Date:Mar 8, 2022

Advertisement

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమార్కుడు. ఈ చిత్రంలో హీరో రవితేజ.. తన మాస్.. మార్క్ హీరోయిజంతో విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అతడు అత్తిలి చిరబరానంద స్వామిగా.. అందరికీ గుండ్లు కొట్టడం.. ఆ తర్వాత వారంతా.. ఎమ్మెల్యే వద్దకు తమ మోర వినిపించేందుకు వెళ్లడం.. అక్కడ.. ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారంటూ.. ఏమిటీ విషయం అంటూ ఎమ్మెల్యే భార్య అడగడం.. సదరు గుండు బాధితులంతా.. అత్తిలి చిరబరానంద స్వామి పేరు చెప్పడం.. దాంతో సదరు ఎమ్మెల్యే భార్య .. కన్నీటిపర్యంతమవుతూ.. మీ బాధ సరే.. నా బాధను ఎవరితో చెప్పుకొనంటూ.. తాను అత్తిలి చిరబరానంద స్వామిజీ బాధితురాలినే అనడం... ఈ నేపథ్యంలో సదరు గుండు బాధితులంతా.. ఆశ్చర్యానికి గురికావడం జరిగింది. ఇదంతా వెండి తెర మీద సీన్.. 

కానీ సరిగ్గా ఇలాంటి సీనే.. కానీ జస్ట్ ఛేంజ్.. అదీ పోలిటికల్ సీన్. ఫిబ్రవరి 7వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ బావ, వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్.. బీసీ, ఎస్టీ, ఎస్సీ, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ వర్గాలతోపాటు ముగ్గురు మహిళలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చోటు చేసుకున్న పరిణామాలు. తాము పడుతున్న ఇబ్బందులను బ్రదర్ అనిల్‌ ఎదుట సదరు కులాల వారంతా  ఏకరువు పెట్టారట. ఆ క్రమంలో మీ బాధ సరే.. వైయస్ జగన్ తనకు సొంత బావై  ఉండి... రెండేళ్ల నుంచి తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చిందే లేదని ఆయన స్పష్టం చేయడంతో వారంతా కంగుతిన్నారని సమాచారం.  

అంతేకాకుండా.. వైయస్ జగన్ ప్రభుత్వం వల్ల తమకు ఒరిగింది ఏమీ లేదని, తమ కష్టాలను ఆయా సంఘాల ప్రతినిధులు బ్రదర్ అనిల్ కుమార్‌కు మోర పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు పాలనలోనే తాము ఎంతో ప్రయోజనం పొందారని వారు గుర్తు చేసుకోవడం గమనార్హం. అంతేకాకుండా.. దళితులు, బీసీలపై ఎస్సీ, ఎస్టీ కేసులు, ముస్లింలపై గంజాయి రవాణా కేసులు నమోదు చేశారని వారు ఈ సందర్బంగా బ్రదర్ అనిల్ కుమార్‌కు వివరించారని తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైనా సమస్యపై ధర్నా చేస్తే.. ఈ అంశంపై ఆయన ఆరా తీసేవారని, సమస్యను వివరించడానికి ఆయన తమకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చేవారని వారు ఈ సందర్భంగా గుర్త చేసుకున్నారట. అయితే ఈ జగన్‌ ప్రభుత్వంలో తమకు అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోగా, ధర్నాలు చేసే హక్కు నూ కూడా హరించారని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముందస్తుగా ఆందోళనకు దిగిన తమను అరెస్టు చేయిస్తున్నారని వారు ఆరోపించారు. భజన చేసే నాయకులకే సీఎం వైయస్ జగన్‌ అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారని వారు అనిల్‌తో పేర్కొనడం కొసమెరుపు. కానీ పార్టీ విజయానికి కృషి చేసిన వారిని పక్కన పెట్టడం పట్ల వారు కన్నీటి పర్యంతమయ్యారని తెలుస్తోంది. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని గత ఎన్నికల్లో బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ప్రచారం చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఇదే విషయాన్ని ఆయనకు గుర్తుచేయగా.. బ్రదర్ అనిల్ నీళ్లు నమిలినట్లు సమాచారం. 
 
జగన్ పాలనలో క్రైస్తవులకు ప్రాధాన్యం లేదని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ విజయం కోసం గ్రామాల్లో తామంతా తిరిగామని వారు పేర్కొన్నారు. ఇప్పుడు తమకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని వారు వాపోయారు. జగన్‌ పాలనలో కంటే చంద్రబాబు ప్రభుత్వంలోనే క్రైస్తవులకు ఎక్కువ మేలు జరిగిందని పలువురు పాస్టర్లు ఈ సందర్భంగా బ్రదర్ అనిల్‌కు చెప్పినట్టు సమాచారం. పాస్టర్లకు ఒక నెల మాత్రమే రూ.5 వేలు గౌరవవేతనం ఇచ్చారని, ఆ తర్వాత మొండిచేయి చూపించారని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. 

ఈ జగన్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చెబుతూ.. ఓ బీసీ సంఘం నేత అయితే జగన్‌ ఫ్యామిలీ గురించి ప్రస్తావించినట్టు తెలిసింది. ‘తల్లి, చెల్లి, మిమ్మల్ని (అనిల్‌ కుమార్‌) పట్టించుకోలేని నాయకుడు మమ్మల్ని ఎలా పట్టించుకుంటారంటూ బ్రదర్ అనిల్‌కు చురకలంటించినట్లు తెలుస్తోంది. దాంతో అనిల్‌ కుమార్ కాసేపు సైలెంట్‌గా ఉండిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత తేరుకున్న బ్రదర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని ఇప్పుడు మీరు బాధపడుతున్నారు. నాకు అయితే సీఎం వైయస్ జగన్ రెండేళ్లకు పైగానే అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేందంటూ తన మనసులోని మాటను బ్రదర్ అనిల్ కుమార్ బయట పెట్టారని విశ్వసనీయంగా తెలిసింది. 

మరో రెండు మూడు రోజుల్లో విశాఖ లేదా గుంటూరులో బ్రదర్ అనిల్ కుమార్ అధ్యక్షతన మరో సమావేశం ఉంటుందని సమాచారం. ఇటీవల రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో బ్రదర్ అనిల్ కుమార్.. కొత్త రాజకీయ పార్టీ పెడతారంటూ.. ఓ ప్రచారం అయితే ఊపందుకొంది. ఇదే విషయాన్ని విజయవాడలో బ్రదర్ అనిల్ కుమార్‌ను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదంటూనే..  కొన్ని రోజుల్లో ఓ శుభవార్త వింటారంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. మరోవైపు బ్రదర్ అనిల్ భార్య వైయస్ షర్మిల.. మార్చి 11వ తేదీ నుంచి తెలంగాణలో ప్రజా ప్రస్థానం యాత్రను పున: ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.
 

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.