డాక్టర్ ప్రియాంక.. గొర్రెల కాపరి దానయ్య.. రాజకీయం కోసం జగన్ ద్వంద్వ వైఖరి?
Publish Date:Aug 10, 2026
Advertisement
రాజ మహూంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ను కారుతో ఢీకొట్టి దారుణ హత్యకు గురి చేసిన సంఘటన రాజకీయంగా, సామాజికంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి విదిమే. ఈ కేసును ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిండానికి వైసీసీ అధినేత చేస్తున్న ప్రయత్నం వెనుక ఉన్న ఈ కేసులో ఇద్దరు నిందితుల్లో ఒకడైన న ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ఒక పాపస్టర్ కుమారుడు కావడమేనంటున్నారు.వాస్తవానికి విషయంతో సంబంధం లేకుండాప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం వైసీపీ ఎకోసిస్టమ్లో భాగంగా మారిపోయింది. రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది. రెండుసంఘటనల్లోనూ ఆయన స్పందన వేరువేరుగా ఉంది. కాశీబుగ్గ ఘటనలో నిందితులకు అనుకూలంగా, రాజమహేంద్రవరం సంఘటనలో మరోలా మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లోని వైరుధ్యాన్నీ, ప్రభుత్వంపై నిందలు మోపుతున్న తీరునూ గమనిస్తే.. జగన్ నిందితులకు మద్దతుగా మాట్లాడుతూ, రాజకీయంతోనూ, ప్రభుత్వంతోనూ ఏమాత్రం సంబంధం లేని సంఘటనలకు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని చెప్పకతప్పదని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఈ రెండుసంఘటనల్లోనూ కూడా నిదితులు మద్యం మత్తు, నిర్లక్ష్యం, అహంకారంతో వాహనం నిర్లక్ష్యంగా నడిపి నిండు ప్రాణం బలితీసుకున్నారు. ఈ విషయంలో పోలీసుల వైఫల్యం కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ ఇసుమంతైనా లేదు. ముందుగా కాశీబుగ్గ సమీపంలో సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన యాక్సిడెంట్ విషయానికి వస్తే.. ఆ సంఘటనలో ఒక పేద గొర్రెల కాపరి దానయ్య ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. తొలుత సొంత పార్టీ నేత కుమారుడిని రక్షించేందుకు వేరొక అనామకుడిపై నింద మోపే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో నడిరోడ్డుపై పడి ఉన్న దానయ్యను కాపాడే ప్రయత్నం చేయలేదు. దానయ్య కుటుంబాన్ని ఆదుకోలేదు. కుమారుడిని కాపాడేందుకు, కేసును తప్పుదోవపట్టిచేందుకు ప్రయత్నించిన సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే.. దాన్ని రాజకీయ కక్ష సాధింపు గా జగన్ రెడ్డి అభివర్ణించి విమర్శల పాలయ్యారు. బాధితుడైన గొర్రెల కాపరి కుటుంబం ఆవేదనను పక్కనపెట్టి, కేవలం తమ పార్టీ నేత, కుల సమీకరణాలకే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. సీదిరి అప్పలరాజు, అతడి కుమారుడిపై కేసు పెట్టడాన్ని రాజకీయ కక్ష సాధింపుగా, మత్స్యకార నాయకుడ్ని వేధించడంగా అభివర్ణించారుర. ఇక తాజాగా రాజమహేంద్రవరం ఘటనలో డాక్టర్ ప్రియాంక మరణానికి కారణమైన వారిలో ఒక నిందితుడు.. తనకు కీలకమైన ఓటు బ్యాంకువర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఈ ఘటనలో మరణించిన ప్రియాంక వైద్య విద్యార్థిని కావడంతో ఏం మాట్లాడాలో తెలియక డైలమాలో పడిన జగన్ చివరికి ప్రభుత్వాన్నినిందిస్తూ ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. జోసెఫ్ ఎడ్వర్డ్స్ కుటుంబం సామాజికంగా, మతపరంగా వైసీపీకి సాంప్రదాయకంగా మద్దతు ఇచ్చే వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో రాజమమేంద్రవరం కేసులో నిందితులకు కఠిన శిక్ష పడాలని, వైసీపీ చేస్తున్న డిమాండ్లు మాటవరసేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. కాశిబుగ్గ కేసులో అప్పలరాజు కొడుకుపై చట్టం చర్యలు తీసుకుంటే వ్యతిరేకించిన జగన్.. ప్రియాంక విషయంలో అందుకు భిన్నంగా స్పందిస్తారని ఎలా భావించగలమని అంటున్నారు. ప్రియాంక తండ్రి కడుపు కోతతో మాట్లాడుతున్న మాటలను రాజకీయం చేసి లబ్ధి కోసం పాకులాడుతున్నారు. చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు, ఒక నిందితుడు తమ పార్టీ నేత కొడుకైనా, లేక ఓటు బ్యాంకుకు చెందిన ప్రముఖుడి కొడుకైనా శిక్ష ఒకేలా ఉండాలి.. జగన్ డిమాండ్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి కదా అంటున్నారు. బాధితురాలైన డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం జరగాలనే డిమాండ్ ఏపీవ్యాప్తంగా మిన్నంటుతున్న వేళ, వైసీపీ ద్వంద్వ వైఖరి ఆ పార్టీ విశ్వసనీయతను మరింత మరింత మసకబారుస్తోందనడంలో సందేహం లేదు. సీదిరి అప్పలరాజు కుమారుడి కేసులో బాధితుడికి ఒక న్యాయం, రాజమహేంద్రవరం ప్రియాంక కేసులో మరో న్యాయం అన్నట్లుగా జగన్ రాజకీయాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Jagan double standards, Politics, Hit and Run, Sidiri Appalaraju Son, Doctor Priyanka
http://www.teluguone.com/news/content/jagan-double-standards-25-228561.html





