జగన్ చీకటి శాపం.. చంద్రబాబు ఆశాదీపం!

Publish Date:Jun 18, 2024

Advertisement

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ పాలన ఏపీకి చీకటి శాపంగా మారితే.. జగన్ ప్రభుత్వ పతనం తరువాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ఆశాదీపంగా మారారు. సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. పోలవరం, అమరావతి ఇలా రాష్ట్ర ఉజ్వలభవిష్యత్ కు దోహదం చేసే అన్నిటినీ జగన్ నాశనం చేస్తే ఇప్పుడు వాటిని మళ్లీ పట్టాలెక్కించి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు చంద్రబాబు నడుంబిగించారు. సోమవారం పోలవరం సందర్శించిన సందర్భంగా చంద్రబాబు జగన్ రాష్ట్రానికి ఎలా శాపంగా మారారో వివరించారు. 

సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టును  గత పభుత్వం సర్వనాశనం చేసిందని ఆరోపించారు.  రూ.447 కోట్లతో మరమ్మతులు చేసినా బాగుపడుతుందనే గ్యారెంటీ లేదని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో  గత జగన్ సర్కార్ ఎంత నిష్పూచీగా,  నిర్లక్ష్యంగా వ్యవహరించిందో చంద్రబాబు కళ్లకు కట్టినట్లు వివరించారు. మళ్లీ కొత్తగా డయాఫ్రేంవాల్ కట్టాలంటే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. పోలవరం అంచనా వ్యయం ఈ ఐదేళ్లలో పెరిగింది. తెలుగుదేశం హయాంలో  72 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్టు, 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క అడుగు ముందుకు పడలేదు.  వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ అంటూ కాంట్రాక్టర్ ను తప్పించారు.  విభజన చట్టంలో జాతీయ హోదా ప్రాజెక్టుగా పేర్కొన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కేంద్రమే చేపడితో ఏళ్లూ, పూళ్లూ గడిచినా పూర్తయ్యే అవకాశం లేదని భావించిన చంద్రబాబు తాను 2014లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే కేంద్రం నిధులు ఇస్తే ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టి పూర్తి చేస్తుందని గట్టిగా చెప్పి మోడీని ఒప్పించారు.  

అయితే  ఆ తరువాత ప్రధాని మోడీ, చంద్రబాబు మధ్య ఏపీకి నిధులు, విభజన హామీల అమలు విషయంలో విభేదాలు తలోత్తడంతో పోలవరం ప్రాజెక్టుకు నిధులు విషయంలో మోడీ దాదాపు మెండి చేయి చూపారు.   దీంతో చంద్రబాబు  అప్పట్లో పోలవరం విషయంలో సాహసోపేత నిర్ణయం తీసుకు న్నారు. పోలవరం నిర్మాణ వ్యయాన్ని ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే భరించి, ఆ తరువాత కేంద్రం నిధులు విడుదల చేసినప్పుడు తీసుకోవాలని భావించారు.  దీంతో ఆయన హయాంలో పోలవరం నిర్మాణ పనులు పరుగులు పెట్టిన రీతిలో జరిగాయి. అందుకే ప్రాజెక్టు దాదాపు 72శాతం పూర్తయ్యింది. 2019లో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితి పూర్తిగా తల్లకిందులైంది. జగన్ సర్కార్ పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రాన్ని నిధులు కోరలేదు. కేంద్రం కూడా ఇవ్వలేదు.  సరే రోగీ వైద్యుడూ కూడా చేతులెత్తేసిన చందంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలవరాన్ని పడకేసేలా చేశారు. పనులు నిలిచిపోయాయి. అసలు జగన్ సర్కార్ అధికారం చేపట్టిన క్షణం నుంచీ  ఏపీలో అభివృద్ధి ఆనవాళ్లు చెరిపివేయడమే లక్ష్యంగా అడుగులు వేసింది.

 రూ 2కోట్లతో  చంద్రబాబు నిర్మించిన   ప్రజావేదికను జగన్ అధికారంలోకి  వచ్చీ రావడంతోనే  కూల్చివేసారు. అమరావతిలో నిర్మించిన భవనాలను పట్టించుకోలేదు. వాటిని పాడుపెట్టేశారు.  ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడంతో వాటికి మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇందుకు కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అలా కాకుండా జగన్ సర్కార్ ఆ భవనాలను అధికారుల నివాసాలకు కేటాయించి ఉంటే.. వారికి ఇచ్చే హెచ్ ఆర్ఎ మిగిలి ఉండేది.  ఇలా జగన్ తన హయాంలో చేసినవన్నీ దండగమారి పనులే.  ఒక ప్రభుత్వం తీసుకున్న  కొన్ని నిర్ణయాలు కొత్తగా  వచ్చిన ప్రభుత్వం గౌరవించడం సంప్రదాయం. జగన్ ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కేశారు.  ఇక జగన్ చేసిన మరో నిర్వాకం, సకల నిబంధనలకూ తిలోదకాలిచ్చి, పర్యావరణ నియమాలకు చెల్లు చీటి పాడేసి విశాఖ పట్నం రుషికొండకు బోడి గుండు కొట్టేసి ఆ కొండపై అత్యంత విలాసవంతమైన హంగులతో  భవనాలు నిర్మించడం. ఒక్క మనిషి అదీ సీఎం కోసం ఇంతటి భవనం అవసరమా అంటున్నారు.రూ.500 కోట్లతో పాతిక వేల పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మించవచ్చని నిపుణులు  చెబుతున్నారు. ఈ భవనం టైల్స్ ఇటలీ నుంచి తెప్పించారని ఆరోపణలు ఉన్నాయి. బాత్ రూం లో టబ్ రూ.23లక్షలట.ఇవన్నీ విఐపీల కోసం నిర్మించిన ప్రభుత్వ భవనాలని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ రాజధానిగా చేయాలన్న సంకల్పంతో విఐపీలకోసం ఈ భవనాన్ని నిర్మించామని  చెబుతున్నారు. రాష్ట్రపతి,ప్రధాని,గవర్నర్ వంటి విఐపీల కోసం  నిర్మించామని చెబుతున్నారు. ప్రజాధనంతో ఇంతటి విలాసవంతమైన భవనం నిర్మించాల్సిన అవసరం ఉందా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

నిర్మణాత్మకమైన ఖర్చులు కాకుండా ఇలా ప్రజా వ్యతిరేక విధానాలు చేపట్టి, సంపద సృష్టి అనే మాటను మరచి జగన్ రాష్ట్రాన్ని దివాళా అంచులకు చేర్చేశారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. వాటి గురించి జగన్ సర్కార్ ఐదేళ్లలో పట్టించుకున్న పానాన పోలేదు. మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యతను జగన్ సర్కార్ విస్మరించింది.  తాగునీరు అందించడం కంటే మద్యం అమ్మకాలు పెంచుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది.  చెత్త మీద పన్ను వేసింది. కరెంట్  చార్జీలు 9 సార్లు పెంచింది. 

ఇప్పుడు జగన్ ప్రభుత్వం గద్దెదిగింది. జగన్ హయాంలో ఏపీలో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదంతా  సరిదిద్ది, రాష్ట్ర ప్రగతి, పురోగతిపై చంద్రబాబు దృష్టి పెట్టారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన అడుగుల వేగం చూసి జనం ఇక రాష్ట్రానికి ఏం భయం లేదు అన్ని రంగాలలో పురోగమిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జగన్ హయాంలో జరిగిన విధ్వసానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే విషయంలో కూడా చంద్రబాబు కఠినంగానే ఉండాలని, తప్పు చేసిన ఏ ఒక్కరూ శిక్ష పడకుండా తప్పించుకోవడానికి వీల్లేదని అంటున్నారు. 
 

By
en-us Political News

  
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.