ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిబంధనలకు తలొగ్గక తప్పలేదు. సాధారణంగా జగన్ ఎటువంటి ఆంక్షలు, నిబంధనలను పట్టించుకోరు. కోర్టుల విషయంలో కూడా ఆయన తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లు వ్యవహరిస్తారు. అయితే మారిన పరిస్థితులో.. మరీ మొండికేస్తే కటకటాల వెనక్కు వెళ్లాల్సి వస్తుందన్న బెదురో, కేసుల భయమో తెలియదు కానీ శుక్రవారం ఆయన పోలీసు ఆంక్షలకు తలొగ్గి తన రూట్ మార్చుకున్నారు.
రెండు రోజుల కిందట అంటే బుధవారం ఆయన అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ పేరుతో గుంటూరులో పర్యటించి పరామర్శ చేసిన సంరద్భంగా పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బహుశా జగన్ పోలీసు ఆంక్షలకు తలొగ్గి శుక్రవారం తన ఇబ్రహీంపట్నం పర్యటనలో ‘రూటు’ మార్చారు. అంటే ముందుగా ప్రకటించిన విధంగా కాకుండా పోలీసులు చెప్పినట్లుగా వారు సూచించిన దారిలో వెళ్లారు.
గుంటూరు పర్యటన సందర్బంగా వైసీపీ నేతల అరెస్టులే కాదు.. దారిపోడవునా ట్రాఫిక్ జామ్ ల కారణంగా స్థానికుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత, వైసీపీ పట్ల, జగన్ పట్ల వ్యక్తమైన ప్రజా నిరసన కారణంగా జగన్ ‘దారికి’ రాక తప్పలేదు. ఈ రోజు ఆయన లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ జోగి రమేష్ కుటుంబ సభ్యులకు పరామర్శ కోసం విజయవాడ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా వైసీపీ ప్రకటించిన దారిలో కాకుండా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసులు సూచించిన మార్గంలోనే వెళ్లారు.
ముందుగా ప్రకటించినట్లు విజయవాడ బ్రిడ్జి మీదనుంచి కాకుండా జగన్ కాన్వాయ్ పశ్చిమ బెపాస్ రోడ్డు, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్లింది. పోలీసులు ఈ జగన్ దారి మార్చుకుని ట్రాఫిక్ జామ్ లకు అవకాశం లేకుండా వెళ్లాలని ఆదేశించారు. జగన్ పోలీసు ఆదేశాలను అనుసరించి, వారు సూచించిన దారిలోనే వెళ్లారు. ఇలా ఉండగా జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు పశ్చిమ బైపాస్ రోడ్డు, ఇబ్రహీంపట్నంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జగన్ రూట్ మార్చుకుని పశ్చిమ బెపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలంటూ విజయవాడ పోలీసు కమిషనర్ గురువారం (ఫిబ్రవరి 5) రాత్రి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల మేరకు జగన్ పర్యటన సాగింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-canvoy-changed-its-route-39-213605.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.