జ‌గ‌న్ ప‌క్కా బిజినెస్‌మేన్‌.. శ్రీలంక‌లా ఏపీ మార‌డం ఖాయం.. ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌నం..

Publish Date:Apr 16, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక అరాచకత్వానికి  కేరాఫ్ అడ్రస్ గా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజాధనాన్ని తనకు ఓట్లు రాల్చి పెట్టేందుకు వీలుగా సంక్షేమ పథకాల మాటున పందేరం చేస్తున్నారు. దీన్నే క్విడ్ ప్రోకో అంటారని మాజీ ఎంపీ, జగన్ తండ్రి వైఎస్ అనుయాయి అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు.  జగన్ కు నీకిది...నాకిది అన్న చందంగా క్విడ్ ప్రొకో మాటున లబ్ధి పొందడం తన తండ్రి వైఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచీ అలవాటే. అందుకుసంబంధించిన ఆర్థిక నేరాలపై జగన్ పై ఇప్పటికీ విచారణ జరుగుతోంది.  వ్యాపారంలో క్విడ్  ప్రోకోను  కూపీలాగి నిగ్గుతీయడానికి విచారణ సంస్థలు ఉన్నాయి. అయితే సంక్షేమం మాటున ఓట్ల లబ్ధికి పాల్పడే క్విడ్ ప్రోకో నిఘా సంస్థల పరిధిలోనికి రాదన్న ధీమా జగన్ లో కనిపిస్తున్నది.

 డబ్బులను తమ జేబులోంచి ఇస్తున్నట్లుగా చేతికి ఎముకే లేదన్నట్లుగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రం దివాళా తీయడం, అభివృద్ధి కుంటుపడటమే కాకుండా రాష్ట్రంలో  శ్రీలంక  పరిస్థితులు ఏర్పడే ముప్పు కూడా ఉందన్న ఆర్థిక రంగ నిపుణుల హెచ్చరికలు సీఎం జగన్ చెవికి ఎక్కడం లేదు. రెండేళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు రాబట్టడమే లక్ష్యంగా డబ్బుల పందేరంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు.  ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రభుత్వాధినేతగా బాధ్యతాయుత పదవిలో ఉండి ప్రభుత్వ ధనంతో జూదం ఆడుతున్నారు.  ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఒక సాకుతో...తనకు అంటే తన పార్టీకి ఓట్లు వేస్తారని నమ్ముతున్న వర్గాలను సొమ్ముల పందేరంలో తనకు ఎవరూ సాటిలేరన్న చందంగా జగన్ ఈ సొమ్ము బదిలీ విద్యలో ఆరి తేరారు. 

ఆఖరికి కేంద్రం విపత్తు నిర్వహణ కోసం ఇచ్చిన సొమ్మును కూడా తన ఓటు బ్యాంకు విస్తరణ  పథకం కోసం వాడుసుకున్నారు. అంతెందుకు ఉచిత బియ్యానికి బదులుగా లబ్ధిదారులకు ఆ మేరకు సొమ్ము బదిలీ చేసేప్రతిపాదనను తెరపైకి తీసుకు వచ్చే సాహసం చేశారంటే...తన అధికారాన్నిఆయన ఏ స్థాయిలో ఎన్నికల లబ్థి కోసం వాడుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. 

నిజానికి ఓటు బ్యాంకు లక్ష్యంగా ప్రభుత్వాలు చేసే ఉచిత పందేరాలను అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీనిని నియంత్రించే బాధ్యత ఎవరు తీసుకోవాలి.  ఎన్నికలను నిర్వహణ బాధ్యత ఉన్న ఎన్నికల సంఘమే ప్రభుత్వాలు జనాలను ప్రలోభ పెట్టే పందేరాలను నియంత్రించాలి. అయితే ఆ పని తమది కాదని ఎన్నికల సంఘం ఇటీవల తేల్చేసింది. కాగ్ వంటి సంస్థల నివేదికలను ప్రభుత్వాలుపట్టించుకోకుండా బుట్ట దాఖలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల దుబారాను, ఆర్థిక అరాచకత్వాన్ని అడ్డుకొనే ఒక పటిష్ట వ్యవస్థ అవసరం ఉంది. 
నిజానికి నీతి ఆయోగ్ ఏర్పాటు ఉద్దేశమే ఇది. కానీ...అభివృద్ధి..రాజకీయాలు జుగల్ బందీగా సాగుతున్న తీరు నీతి ఆయోగ్ ను కూడా ఒక ఉత్సవ విగ్రహంగా మార్చేసింది. రాష్ట్రాలను మరీ ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నరాష్ట్రాల పట్ల కేంద్రంలోని మోడీ సర్కార్ సవతి ప్రేమ చూసుతోంది. అదే సమయంలో తమ నిర్ణయాలను విచక్షణను ఉపయోగించకుండా, రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం లేకుండా ఔదాల్చే జగన్ సర్కార్ వంటి ప్రభుత్వాల తప్పులను కేంద్రం చూసి చూడనట్టు వదిలేస్తున్నది. అదే జగన్ కు వరంగా మారింది. అందుకే నిబంధనల జోలికి వెళ్లకుండా యథేచ్ఛగా పందేరాల పరంపర కొనసాగించగలుగుతున్నారు. స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తి కోసం ఉద్దేశించిన 93, 94 రాజ్యాంగ సవరణలను సైతం పట్టించుకోకుండా పంచాయతీ నిధులను కూడా మళ్లించేశారంటే ఇదే కారణం. ఈ నిరంకుశత్వం, నిష్పూచీ తనం, జవాబాదారీతనం లేని తీరుతో పరిపాలన, రాజకీయ ప్రయోజనం.. రెంటినీ అవిభక్త కవలలుగా మార్చి జగన్ చేస్తున్నది  వచ్ఛిన్నమే, విధ్వంసకర జూదమే!

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.