Publish Date:Apr 27, 2022
కొన్నాళ్లుగా వైసీపీలో హోల్ అండ్ సోల్ సజ్జలనే. జగన్ తర్వాత నెంబర్ 2 పొజిషన్. మొదట్లో విజయసాయిరెడ్డికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉత్తరాంధ్రకు సామంతరాజును చేశారు. ఆయనేమో రాజ్యం మొత్తం నాదేనంటూ విర్రవీగారు. బాగా ఓవర్ చేశారు. వరుస ఫిర్యాదులతో సాయిరెడ్డి కోరలు కట్ చేశారు సీఎం జగన్. విశాఖ నుంచి తీసుకొచ్చి.. తన తాడేపల్లి ప్యాలెస్లో బంధించేశారు. పార్టీ అనుబంధ సంఘాల సమన్వయ బాధ్యతలంటూ ఏదో చిన్న పోస్టు పడేసి.. ఇకపై ఇక్కడే పడుండంటూ ఆదేశించారు. ఇక విజయసాయి పని ఖతం అనుకున్నారంతా. హవా అంతా సజ్జలదేనంటూ చర్చ జరిగింది. కానీ, నెల రోజుల వ్యవధిలోనే సీన్ మారిపోయింది. ప్రయారిటీ తారుమారు అయింది. సజ్జల పవర్స్కు కోత పెట్టారు. విజయసాయికి ఆ పదవులు కట్టబెట్టారు. ఎవరికి ఏ పనులు అప్పగించాలో.. బహుషా జగన్కే క్లారిటీ లేనట్టుంది.
సలహాదారు తానే.. పార్టీ బాధ్యతలూ తనకే.. తానే నెంబర్ 2 అనుకుంటూ గాల్లో తేలిపోతున్న సజ్జల రామకృష్ణారెడ్డిని.. తీసుకొచ్చి నేల మీద నిలబెట్టేశారు జగనన్న. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డికి.. వైసీపీ జిల్లా అధ్యక్షుల్ని.. రీజనల్ కోఆర్డినేటర్లను సమన్వయం చేసుకునే బాధ్యతలు ఇచ్చారు. దాదాపు పార్టీ అంతా సజ్జల చేతిలో పెట్టినంత పని చేశారు. అంతలోనే ఏమైందో ఏమో.. ఆ వెంటనే మళ్లీ నిర్ణయాన్ని సవరించుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు.. రీజనల్ కోఆర్డినేటర్ల సమన్వయ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం కేవలం ఎమ్మెల్యేల బాధ్యతలకే పరిమితం చేసి.. ప్రాధాన్యం తగ్గించేశారు. ఎప్పటిలానే మీడియా కోఆర్డినేషన్ను ఆయన దగ్గరే ఉంచేశారు.
ఎందుకు? సడెన్గా జగన్మోహన్రెడ్డి ఎందుకిలా సజ్జల పవర్స్కు కోత వేశారు? విజయసాయిరెడ్డికి మళ్లీ ఎందుకు ప్రాధాన్యం పెంచారు? అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నెంబర్ 2 అనే పదమే జగన్లో భయానికి కారణం అంటున్నారు. పార్టీ అంటే తానొక్కడి పేరు మాత్రమే వినిపించాలని.. తన తర్వాత మరెవరూ నెంబర్ 2గా ఉండకూడదనేది జగన్ లెక్క అంటున్నారు. అందుకే, సొంత చెల్లి షర్మిలను సైతం పక్కనపెట్టేశారని గుర్తు చేస్తున్నారు. ఇటీవల సజ్జల పేరు పార్టీలో మారుమోగుతుండటం.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఆయన సలహాలు, సూచనల మేరకే జరిగిందంటూ పార్టీ నేతలంతా సజ్జల చుట్టూ తిరుగుతుండటం జగన్కు నచ్చలేదని తెలుస్తోంది. అందుకే, పార్టీలో సజ్జల స్థాయిని అమాంతం తగ్గించేశారని చెబుతున్నారు. విజయసాయిరెడ్డిని ఇప్పటికే పార్టీ నేతలంతా దూరం పెట్టేశారు కాబట్టి.. సజ్జలను కాదని సాయిరెడ్డిని ఎంచుకున్నారని అంటున్నారు. ఇలా వైసీపీలో ఎవరికీ ప్రాధాన్యం ఉండదని.. ఎవరూ సూపర్ పవర్ కాదని.. తాను మాత్రమే సుప్రీం అనే మెసేజ్ పార్టీ వర్గాలకు ఇవ్వడానికే.. జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-action-on-sajjala-25-135050.html
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి హేమాహేమీలు తలపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్లో వున్న రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజకీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి.
వైఎస్ షర్మిలా రెడ్డి.. రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు. అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా రాష్ట్రపగ్గాలు అందుకున్నాకా.. తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు.
ఎన్నికలకు ఇంకా 11 రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారపార్టీ నేతల అరెస్ట్ సంచలనమైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష అభ్యర్థులపై వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా జగన్ పై తక్షణం బ్యాన్ విధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక్క ఆంధ్ర ప్రదేశ్ విషయంలోనే నిబంధనలు గుర్తుకురావా? లేక ఏపీకి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏమైనా ప్రత్యేక గైడ్ లైన్స్ ఉన్నాయా? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అన్ని పార్టీల విషయంలో సమానంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా? విపక్ష కూటమి ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి తమాషా చూస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.