అసెంబ్లీలో బాబు గ్యారంటీలకు ప్రచారం!.. ఓటమి భయంతో జగన్ లో అయోమయం!

Publish Date:Feb 6, 2024

Advertisement

ఏపీలో మ‌రికొద్ది నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.. ఈ స‌మ‌యంలో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేది మేమేనంటూ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌భ‌ల్లో గొంతెత్తి అరుస్తున్నాడు.. వైసీపీ శ్రేణులు జ‌గ‌న్ మాట‌ల‌కు చ‌ప్ప‌ట్లు కొడుతున్నారు. కానీ, వారిలో సగం మందికి పైగా  వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ద్దెదిగ‌డం ఖాయ‌మ‌ని తెలుసు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌భ‌ల్లో పాల్గొని బ‌య‌ట‌కొచ్చే స‌మ‌యంలోనే కొంద‌రు ఈ విష‌యాన్ని చ‌ర్చించుకుంటూ వ‌స్తున్నారు. ఏదో తప్పని పరిస్థితుల్లో జగన్ సభలకు  రావ‌డ‌ం త‌ప్పితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెల‌వ‌డు అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో జోరుగా నడుస్తోంది.  అసలు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని వాళ్లూ వీళ్లూ చెప్పడం కాదు.. స్వయంగా జగనే అంగీకరించేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అధికారంలోకి రాకపోయినా బాధపడనని చెప్పిన సంగతి తెలిసిందే.

తాజాగా అసెంబ్లీ స‌మావేశాల్లో జ‌గ‌న్ ప్రసంగం  చూస్తే రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ఎవ‌రికైనా జ‌గ‌న్ ఓట‌మిని ఒప్పుకున్నారని స్ప‌ష్టంగా అర్థ‌మైపోతుంది. అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌భుత్వం ఏ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది, ఎన్నికోట్లు ఖ‌ర్చు చేసింది, ఎంత‌మందికి ల‌బ్ధి చేకూరింది. అనే విష‌యాల‌ను ఏ ముఖ్య‌మంత్రి అయినా ప్ర‌స్తావిస్తారు. కానీ, జ‌గ‌న్ మాత్రం అసెంబ్లీలో ఉన్నామ‌న్న విష‌యం మ‌రిచి..  ఓ బహిరంగ సభలో మాట్లాడిన‌ట్లు ప్ర‌తిప‌క్షాల‌పై  విమ‌ర్శ‌లు చేయడం ఆయ‌న‌లోని ఓట‌మి భ‌యాన్ని తేట‌ తెల్లం చేస్తున్నద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. 

ఏపీలో అసెంబ్లీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగం కోసం అంతా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూశారు. సుమారు నాలుగున్న‌రేళ్లు అధికారంలో ఉన్న జ‌గ‌న్.. త‌న పాల‌న తీరును ఏ విధంగా స‌మ‌ర్థించుకుంటారు. అసలు సమర్ధించుకోవడానికి ఏముంది అంటూ ఆయన ప్రసంగం కోసం ఆసక్తిగా చూశారు.   కానీ, జ‌గ‌న్ మాత్రం నాలుగున్న‌రేళ్లు ప్ర‌జ‌ల‌కు ఏం చేశాం.. రాష్ట్రంలో అభివృద్ధి ఏ స్థాయిలో జ‌రిగింది? ఎన్నికొత్త కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టాయి? ఎంత మందికి ఉపాధి దొరికింది అనే అంశాల‌ను ప్ర‌స్తావించ‌కుండా.. రెండు ప‌త్రిక‌లు, ఓ టీవీ చానెల్ పేరును ప‌దేప‌దే ప్ర‌స్తావించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఒకానొక ద‌శ‌లో టీవీల ముందు జ‌గ‌న్ స్పీచ్ ను వీక్షించిన ప‌లువురు వైసీపీ శ్రేణులు సైతం జ‌గ‌న‌న్నా.. మీరు ఉన్నది అసెంబ్లీలో, ప‌బ్లిక్ మీటింగ్ లో కాద‌న్నా అని మొత్తుకోవ‌టం గ‌మ‌నార్హం. మ‌రోవైపు క‌రోనా వ‌ల్ల న‌ష్ట‌పోయామ‌ని, ప్ర‌తీ రాష్ట్రానికి ఓ ప‌వ‌ర్ హౌస్ లా ఉండే మ‌హాన‌గ‌రం లేక‌పోవ‌డం వ‌ల్ల ఇంకా న‌ష్ట‌పోయామ‌ని.. అందువ‌ల్ల ఏమీ చేయ‌లేక పోయామ‌న్న‌ట్లుగా జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌టం అసెంబ్లీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల‌తోపాటు బయట ఉన్న వైసీపీ శ్రేణులు  కంగుతినేలా చేసింది. జ‌గ‌న్ త‌న స్పీచ్‌లో ప్ర‌తీ రాష్ట్రానికి ఓ ప‌వ‌ర్ హౌస్ ఉండాల‌ని, అలాంటి ప‌వ‌ర్ హౌస్ విశాఖ అవుతుంద‌ని అనేక‌ సార్లు ప్ర‌స్తావించారు. కానీ, ఐదేళ్ల‌లో విశాఖ అభివృద్ధికి ఏం చేశామ‌నే విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌లేదు. 

టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అసెంబ్లీలో స్క్రీన్ వేసి మ‌రీ చూపించారు. ఆ ప‌థ‌కాల‌ను ఒక్కొక్క‌టిగా వివ‌రిస్తూ ఇన్ని నిధులు ఎలా తెస్తారు? ఎలా అమ‌లు చేస్తారు? అంటూ సీఎం జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. అసెంబ్లీలో జ‌గ‌న్ స్పీచ్ చూసిన వైసీపీ శ్రేణులు సైతం జ‌గ‌న‌న్నా.. అస‌లు రాష్ట్రానికి మీరేం చేశారు..? మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తారు? అని చెప్ప‌కుండా చంద్ర‌బాబు ప‌థ‌కాలు ఎందుకు ప్ర‌చారం చేస్తున్నావ‌న్నా అంటూ త‌ల‌లు ప‌ట్టుకున్న ప‌రిస్థితి. అసెంబ్లీలో జ‌గ‌న్ ప్ర‌సంగం మొత్తం వీక్షించిన వారికి చిరికి అర్థ‌మ‌య్యేది ఒక్క‌టే.. వైసీపీ మ‌ళ్లీ అధికారంలోకి రాద‌న్న విష‌యాన్ని జ‌గ‌న్  స్వ‌యంగా చెప్పేశార‌ని. ఇప్ప‌టికే తెలుగుదేశం. జ‌న‌సేన పొత్తుతో అసెంబ్లీ ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలోకి దిగుతుండ‌టంతో జ‌గ‌న్ అండ్ కో బెంబేలెత్తిపోతున్న విష‌యం తెలిసిందే. తెలుగుదేశం, జ‌న‌సేన పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు ఆ పార్టీ అధినాయ‌క‌త్వం ప‌డ‌రాని పాట్లు ప‌డుతుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నది. కానీ,  జ‌గ‌న్ అండ్ కో ఆట‌లు సాగ‌డం లేదు. 

ఇన్నాళ్లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అండ‌గా ఉంటూ వ‌చ్చిన కేంద్రంలో బీజేపీ పెద్ద‌లు సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోతుంద‌న్న అంచ‌నాకు వ‌చ్చేశారు‌. ప‌లు ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా జ‌గ‌న్ ఓట‌మి ఖాయ‌మ‌ని తేల్చిశాయ‌ని ప‌లువురు బీజేపీ నేత‌లు పేర్కొంటున్నారు.  దీంతో బీజేపీ కూడా తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మిలో చేరేందుకు సిద్ధ‌మైందని పరిశీలకులు అంటున్నారు.  నేడో రేపో  చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద‌ల‌ను క‌ల‌బోతున్నారు. మ‌రోవైపు గ‌తంలో జ‌గ‌న్ గెలుపులో కీల‌క పాత్ర పోషించిన ఆయన సొంత సోదరి వైఎస్ ష‌ర్మిల  ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలి హోదాలో జ‌గ‌న్ పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్ర‌మంలో అంద‌రూ క‌లిసి న‌న్ను ఒంటిరివాడిని చేశారు.  నేను మిమ్మ‌ల్నే న‌మ్ముకున్నా అంటూ ప్ర‌జ‌ల్లో మ‌రోసారి సానుభూతి అస్త్రాన్ని జ‌గ‌న్ ప్ర‌యోగిస్తున్నారు. కానీ, ఏపీ ప్ర‌జ‌లు మాత్రం చీద‌రించుకుంటున్న ప‌రిస్థితి. ఒక‌సారి సానుభూతి చూపి రాష్ట్రాన్ని, మా జీవితాల‌ను నాశ‌నం చేసుకున్నాం.  ఈసారి నిన్ను ఇంటికి పంపిస్తామంటూ ఏపీ ప్ర‌జ‌లు నిన‌దిస్తున్నారు. దీంతో జ‌గ‌న్ అండ్ కో మీడియా ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నా ఓటమి తథ్యమన్న  విష‌యం  వారికికూడా అర్థ‌మైంది. ఇందుకు తాజాగా అసెంబ్లీలో జ‌గ‌న్ ప్రసంగమే నిదర్శనం.

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.